Warangal

News March 18, 2024

జనగాం: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

image

జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలో జరిగింది. మద్దూరు ఎస్సై షేక్ యూనస్ అహ్మద్ అలీ తెలిపిన వివరిలిలా.. కూటిగల్ గ్రామానికి చెందిన తిగుళ్ల రమేశ్ (21) జీవితంపై విరక్తి చెంది వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన తెలిపారు.

News March 18, 2024

వరంగల్: గుండెపోటుతో వ్యక్తి మృతి

image

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన BRS గ్రామ కమిటీ నాయకుడు జనగాం నారాయణ గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పని నిమిత్తం బయటకు వస్తున్న నారాయణ రోడ్డుపై అకస్మాతుగా కుప్పకులాడు. అది గమనించిన గ్రామస్థులు అతనికి ఫిట్స్ వచ్చిందేమొనని తాళాల గుత్తి అతని చేతిలో పెట్టారు. కాగా అప్పటికే నారాయణ మృతిచెందినట్లు వారు గుర్తించారు.

News March 18, 2024

వరంగల్ : విదేశాల్లో ఉద్యోగావకాశాలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి సోమవారం తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్లాస్టరింగ్ పనులకు జర్మనీలో డిమాండ్ ఉందన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News March 18, 2024

వరంగల్: ఓటరు నమోదుకు అవకాశం

image

లోకసభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక BLOలను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో http:///ceotelangana.nic.in లేదా http:///voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

News March 18, 2024

భూపాలపల్లి: ఆస్కార్‌ గుర్తుగా.. గ్రంథాలయం

image

ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ తన సొంతూరు చల్లగరిగేలో గ్రంథాలయం నిర్మాణం చేపట్టారు. పురస్కారానికి గుర్తుగా తన సతీమణి సుచిత్ర ఆలోచన మేరకు గ్రామంలోని గ్రంథాలయాన్ని ఆంగ్ల అక్షరం ‘O’ ఆకారంలో రెండంతస్తుల్లో నిర్మిస్తున్నారు. 80శాతం పనులు పూర్తి అయ్యాయి. మరికొద్ది రోజుల్లో గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు.

News March 18, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పలు రకాల సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,400 ధర పలకగా, 341 రకం మిర్చి రూ.16వేల ధర పలికింది. అలాగే వండర్ హాట్ (WH) రకం మిర్చికి రూ.17వేల ధర రాగా, 5531 మిర్చికి రూ.13వేల ధర, టమాటా రకం మిర్చికి రూ.37,000 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News March 18, 2024

హనుమకొండ: దాడి చేసిన 9మందిపై కేసు

image

హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన నాగరాజు, గణపురం గ్రామానికి చెందిన శ్రావణి ప్రేమించి ఈ నెల 12న పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు 14న శాయంపేటకు పోలీసులను సంప్రదించగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈక్రమంలో 16న బంధువులు నాగరాజు ఇంటికి వెళ్లి దాడి చేశారు. దీంతో శ్రావణి ఫిర్యాదు చేయగా దాడి చేసిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 18, 2024

వరంగల్: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. వరంగల్ జిల్లాలో 253 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 43,325 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

News March 18, 2024

మేడారం: జంపన్నవాగులో మునిగి ఒకరి మృతి

image

వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తుడు ఆదివారం జంపన్నవాగులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పోచమ్మ బస్తీకి చెందిన రాజు కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆదివారం మేడారం వచ్చారు. పుణ్యస్నానం కోసం ప్రవాహంలోకి దిగారు. లోతును అంచనా వేయకుండా దిగడంతో మునిగిపోయాడు. ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 18, 2024

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

image

ఇవాళ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.. ఈ విషయాన్ని గమనించి జిల్లా నుండి ప్రజలు ఫిర్యాదులు అందించడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు.