India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతు గూడెం తండాలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గత వారం భర్త రవి సంగెం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక భార్య సరిత గురువారం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జేఈఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 18న నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జేఈఈలో అర్హత సాధించి ఇంజినీరింగ్ కళాశాలను ఎంచుకునేందుకు గాను ఈ అవగాహన తోడ్పడుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అవగాహన నిర్వహించనున్నారు. నిట్ వరంగల్ ప్రత్యేకతనూ తెలియజేయనున్నారు.
బాలురను నిరంతరం పర్యవేక్షించాల్సిన సిబ్బంది మద్యం మత్తులో మునిగి తేలిన ఘటన WGL బాలుర పరిశీలన గృహం(అబ్జర్వేషన్ హోం)లో జరిగింది. ఉన్నతాధికారుల ప్రకారం.. జూన్ 2న ఉప సంచాలకుడు పరిశీలన గృహాన్ని తనిఖీ చేయగా.. పర్యవేక్షిడితో పాటు కింది స్థాయి సిబ్బంది మద్యం మత్తులో మునిగి ఉన్నారు. వారితో మాట్లాడుతుండగా మత్తులో తూగుతుండటం గమనార్హం. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని జూన్ 3న సంచాలకుల కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ జిల్లా అధికారులు ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ పండుగను ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్యం, అలాగే అవసరమైన నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని వేస్ట్ను దూరంగా ఉంచి జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలని అన్నారు.
పరకాల నియోజకవర్గంలోని ఓ కన్వెన్షన్లో కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజయోత్సవ-అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునాదిని నిర్మించే బాధ్యత మనందరి పైన ఉందని, పరకాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18,500 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి రూ.17వేల ధర వచ్చింది. వండర్ హాట్ (WH) రకం మిర్చికి రూ.17,500 ధర వచ్చింది. కాగా, నేడు మార్కెట్కు మిర్చి తరలి వచ్చింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..
కాటారం మండలం దుబ్బపల్లి-విలాసాగర్ గ్రామాల మధ్య ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందిగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు దామెర కుంటలోని ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్నను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్నను ఎంపీ చామల శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రమాణం చేయనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు.
ఆర్టీసీ బస్సు ఆగకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు బస్సుకు అడ్డం తిరిగి రోడ్డుపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-MHBDకు వెళ్లే ఆర్టీసీ బస్సులో తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగారు. ఇంతలో డ్రైవర్ బస్సును పోనిచ్చాడు. సదరు మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.