Warangal

News November 13, 2024

26 నుంచి కేయూ డిగ్రీ పరీక్షలు

image

కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ ఎం.తిరుమలాదేవి ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ https://kuexams.org/లో పొందుపరిచినట్లు వారు పేర్కొన్నారు.

News November 13, 2024

వరంగల్: కోటి దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

image

వరంగల్ న్యూ శాయంపేటలోని దోణగుట్ట శ్రీ త్రివేదాద్రి సంతోష లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణం కోటి దీపోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు మంత్రి కొండా సురేఖకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని వీక్షించి, దీప ప్రమిదను వెలిగించిన కొండా సురేఖ.

News November 12, 2024

MHBD: కారు, బైకు ఢీకొని ఇద్దరు మృతి

image

కారు, బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డే కొత్తపెళ్లి గ్రామం వద్ద ఈరోజు రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అమర్ సింగ్ తండా వాసులుగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

News November 12, 2024

వరంగల్ మార్కెట్లో చిరుదాన్యాల ధరలు ఇలా 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. నిన్న పసుపు క్వింటాకి రూ.11,427 ధర రాగా నేడు రూ.11,781 ధర వచ్చింది. అలాగే మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2,495 ధర పలకగా నేడు రూ.2,465 ధర పలికింది. మరోవైపు సూక పల్లికాయకు సోమవారం రూ.5,510 ధర రాగా ఈరోజు రూ.5,900 ధర వచ్చింది.

News November 12, 2024

WGL: హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌కు అతి ఉత్కృష్ట సేవా పతకాలు

image

పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే అతి ఉత్కృష్ట సేవా పతకానికి కేయూసీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మల్లారెడ్డితో పాటు హనుమకొండ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కే.మహేశ్‌లు ఎంపికయ్యారు. అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైన మల్లారెడ్డి, మహేశ్‌లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ అభినందించారు.

News November 12, 2024

దుగ్గొండి: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. రైతు వరికెల గోవర్ధన్ (50) తన వ్యవసాయ భూమిలో యాసంగి పంట కోసం నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మోటారు నడవక పోవడంతో ఫ్యూజ్‌లు సరి చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

News November 12, 2024

వరంగల్: పారా మెడికల్ ఎంట్రెన్స్ కౌన్సెలింగ్ వాయిదా

image

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మంగళవారం, బుధవారం నిర్వహించాల్సిన పారా మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ వాయిదా పడింది. గతంలో కాకతీయ మెడికల్ కళాశాల తరఫున పారా మెడికల్ లో వివిధ కోర్సులకు గాను దరఖాస్తులను స్వీకరించారు. వాటికి సంబంధించిన కౌన్సెలింగ్ అనివార్య కారణాలతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కళాశాల అధికారులు తెలిపారు. త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తారన్నారు.

News November 12, 2024

వరంగల్‌: వివాహిత మృతి

image

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్లలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై కథనం ప్రకారం.. సట్టు శోభారాణి (33) తన భర్త తాగుతున్నాడని ఇంట్లో గొడవపడి క్షణికావేశంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు.

News November 11, 2024

భూపాలపల్లి : గోదావరి నదికి మహా హారతి కార్యక్రమం

image

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు కార్తీక మాసం ప్రతి సోమవారం గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగముగా సోమవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ప్రధాన రాజ గోపురం నుంచి మంగళవాయిద్యాలతో గోదావరి నది వద్దకు బయలుదేరి ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు గోదావరి నది హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి పాల్గొన్నారు.

News November 11, 2024

చిల్పూర్: కుమారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్‌లో ఫిర్యాదు

image

తమ ముగ్గురు కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లికి చెందిన చెట్టబోయిన వెంకట కిష్టయ్య, ఆయన భార్య సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. 30 గుంటల భూమి అమ్ముకోగా వచ్చిన రూ.26 లక్షల రూపాయలు ఇవ్వడం లేదన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ ఫిర్యాదును స్వీకరించి తమ కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.