India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాత కాలంనాటి కచ్చా నాలాలతోనే ముంపు సమస్య ఉందని, వరదనీటి కాలువల నిర్మాణమే శాశ్వత పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం హన్మకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మేయర్, ఎంపీ, ఎమ్మెల్యేలు అన్ని ప్రభుత్వ శాఖలతో సమీక్ష సమావేశం జరగనుంది. వరద ముంపు, మొక్కల పెంపకం, 66 డివిజన్లలో అభివృద్ది పనులు తదితర అంశాలపై చర్చించనున్నారు.
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. సర్కార్ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. వరంగల్ జిల్లాలో 724 పాఠశాలలు ఉండగా.. మొదటి విడతలో 645 పాఠశాలను ఎంపికచేసి రూ.24.09 నిధులు కేటాయించారు.
ఏపీలోని పిఠాపురం సంస్కృతి తెలంగాణకు చేరింది. ఇటీవల KNR జిల్లా చొప్పదండి, WGL పాలకుర్తి MLAల అభిమానులు వాహనాల మీద ‘ఎమ్మెల్యేల గారి తాలూకా’ అనే స్టిక్కర్లు అతికించి సందడి చేసిన విషయం తెలిసిందే. దీన్ని అనుసరిస్తూ డోర్నకల్లో సైతం వాహనాల మీద ఈ తరహా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. మంగళవారం డోర్నకల్ మండలంలో ఓ వాహనంపై ‘డోర్నకల్ MLA గారి తాలూకా’ అని రాసి ఉన్న స్టిక్కరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలనలో మహిళల మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోనూ వరంగల్ ప్రాంతాన్ని రాణిరుద్రమదేవి పరిపాలించింది. రాణిరుద్రమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకునట్లుగా జిల్లాలో 80శాతం ప్రజాప్రతినిధులు, అధికార సారథులు మహిళలే కావడం విశేషం. జిల్లా నుండి ఇద్దరు మహిళా మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఐదుగురు జడ్పీ చైర్మన్లు, మేయర్, మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మహిళలే ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు బంద్ ఉండనుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్కి సరుకులు తీసుకొని రావద్దని అధికారులు సూచించారు. గురువారం మార్కెట్ యథాతథంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సీతక్కతో కలిసి సీఎంను కలిసి పూలబొకే అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ప్రజా పాలనలో భాగంగా మంత్రి సీతక్క రాష్ట్ర సచివాలయంలో వరదలకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ముందస్తుగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్, పాత కనెక్షన్పై సమీక్షించారు. పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడు నర్సంపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలో నిర్మాణంలో ఉన్న నర్సంపేట వైద్యకళాశాల భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మ్యాపును పరిశీలించి, అధికారులకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. నిర్మాణంలో అలసత్వం వహించవద్దని, నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన వినయ్ కుమార్.. రాజన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ మృతి చెందాడు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నేడు మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.18,500 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి సైతం నిన్నటి (రూ.16,500) ధర వచ్చింది. వండర్ హాట్ (WH) రకం మిర్చికి సోమవారం రూ.18,000 ధర రాగా నేడు రూ.18,500 ధర వచ్చింది. కాగా, నేడు మార్కెట్కు మిర్చి తరలివచ్చింది.
Sorry, no posts matched your criteria.