India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజలతో, ప్రజల కోసం.. నిరంతరం పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. మరేన్ని దుర్మార్గాలు చేసినా.. తానేప్పుడు ప్రజాసేవని పక్కన పెట్టలేదని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి సురేఖ చెప్పారు.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
హనుమకొండ జిల్లా కేంద్రానికి వచ్చిన కేటీఆర్ను మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి, శంకర్ నాయక్, ముఖ్య నేతలు కలిశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కేటీఆర్కు మాజీ ఎమ్మెల్యేలు వివరించారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చింతం సదానందం, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కుటుంబాలకు అనుగుణంగా ఎన్యుమరేటర్లను నియమించమన్నారు. సర్వే ఫారంలో ఉన్న 75 ఖాళీలను పూర్తిగా నింపి కులగణన సమగ్రంగా ఉండేలా ఎన్యుమరేటర్లు చూడాలన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయ M.Sc (5 year integrated) కెమిస్ట్రీ తొమ్మిదో సెమిస్టర్ పరీక్ష టైం టేబుల్ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య ఓ ప్రకటనలో విడుదల చేశారు. మొదటి పేపర్ నవంబర్ 26న, రెండో పేపర్ 28న, మూడో పేపర్ 30న, నాల్గో పేపర్ డిసెంబర్ 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఉంటాయని తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్నాపెద్దా అని వయసుతో తేడా లేకుండా ప్రజలు హార్ట్ ఎటాక్కు గురై మృత్యువాత పడుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గకు చెందిన పల్లకొండ వినోద్ గత రాత్రి గుండెపోటుతో మరణించాడు. 30 సంవత్సరాలలోపు యువకుడే కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
కులగణన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 2,3 నెలలు సమయం పట్టే అవకాశముండగా గ్రామాల్లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. పలు కారణాలతో గతంలో పోటీ చేయనివారు ఈసారి సై అంటున్నారు. సర్పంచ్ సంగతి పక్కన పెడితే వార్డు సభ్యుడిగా చేయాలన్నా కొన్ని చోట్ల పోటీ ఉంది. వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ దక్కించుకోవాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహిస్తూ గణకులు అందరి వివరాలు సేకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. శనివారం వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పరిశీలించి పటిష్టంగా నిర్వహించడానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేలో భాగంగా ఇంటింటికి స్టిక్కరింగ్ పూర్తి చేశామన్నారు.
> JN: కొడకండ్లలో యాక్సిడెంట్..
> WGL: మత్తు పదార్థాలు సేవించి వాహనాల నడపొద్దు..
> MHBD: కామెర్లతో యువకుడు మృతి..
> HNK: న్యాయం చేయాలని ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన
> BHPL: గుర్రంపేటలో హత్య
> MLG: పారిపోయిన బాలిక.. గంటలో గుర్తించిన పోలీసులు
> HNK: దోపిడి ముఠా అరెస్ట్
> WGL: డ్రైనేజీలోకి హోటల్ వ్యర్థాలు
రెండు తలలతో గొర్రె పిల్ల జన్మించిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. నెల్లికుదురు గ్రామానికి చెందిన కావటి పిచ్చయ్య యాదవ్కు చెందిన గొర్రెల మందలో ఒక గొర్రెకు రెండు తలలతో వింత గొర్రె పిల్ల పుట్టింది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తండోపతండాలుగా వచ్చి దానిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా ఇది జన్యులోపమని పలువురు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.