Warangal

News November 9, 2024

జిల్లాలో సుమారు 2.63 లక్షల కుటుంబాలు: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వరంగల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు 2.63 లక్షల కుటుంబాలున్నట్లు ఉప ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామని జిల్లా కలెక్టర్ వివరించారు.

News November 9, 2024

BREAKING: భూపాలపల్లి జిల్లాలో హత్య

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మర్డర్ కలకలం రేపింది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్రంపేట గ్రామంలో సకినాల సరస్వతి(48) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు చంపేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

News November 9, 2024

వరంగల్ మార్కెట్ నేడు, రేపు బంద్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు, రేపు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు వారాంతపు యార్డు బంద్, రేపు (ఆదివారం) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరుకు తీసుకుని రావద్దని సూచించారు.

News November 9, 2024

WGL: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

News November 9, 2024

నేడు కేయూ పరిధిలోని కళాశాలలకు వర్కింగ్ డే: రిజిస్ట్రార్

image

కాకతీయ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ప్రకటించినందున నేడు రెండో శనివారం వర్కింగ్ డే అని రిజిస్ట్రార్ మల్లారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కావున కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలలు, విభాగాలు పని చేయాలని, విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని ఆదేశించారు.

News November 9, 2024

ఎండిపోయాక మాత్రమే వరి కోతలు చేపట్టాలి: వరంగల్ కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి కోత యంత్రం యజమానులతో కలెక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంట పూర్తిగా వరి నారుమల్లు ఎండిపోయాక మాత్రమే వరి కోతలు చేపట్టాలని హర్వెస్టర్లకు సూచించారు. మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో మండలాల వారీగా రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు.

News November 8, 2024

వరంగల్ మార్కెట్లలో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లలో నేడు తేజ మిర్చి ధర పెరిగింది. గురువారం క్వింటాకు రూ.16,200 ధర రాగా.. నేడు రూ. 17,000 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.15 వేల ధర రాగా నేడు రూ. 14,500కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ మిర్చికి నిన్న రూ.14,000 ధర రాగా, ఈరోజు రూ.500 పెరిగి రూ.14,500కి చేరిందని వ్యాపారులు తెలిపారు.

News November 8, 2024

రైతుల అభిప్రాయాలను నివేదికల్లో సమర్పించాలి: వరంగల్ కలెక్టర్

image

మామూనూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులతో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూసేకరణలో భాగంగా రైతులతో అభిప్రాయ సేకరణలో భాగంగా గుంటూరుపల్లి, గాడిపల్లి, నక్కలపల్లి రైతులు భూమి కోల్పోయిన రైతుల అభిప్రాయాలను స్వీకరించాలన్నారు. వారి సలహాలు, సూచనల మేరకు నివేదికలు సమర్పించాలని తహశీల్దార్ నాగేశ్వర్‌ను ఆదేశించారు.

News November 8, 2024

వరంగల్: తగ్గిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు మొక్కజొన్న తరలివచ్చింది. ధర మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురువారం రూ.2,470 పలికిన క్వింటా మొక్కజొన్న నేడు రూ.2,450కి పడిపోయింది. 2 నెలల క్రితం 3వేలకు పైగా పలికిన మక్కల ధర క్రమంగా తగ్గింది. మరోవైపు 5,531 రకం మిర్చికి నిన్నటిలాగే నేడు రూ.13 వేల ధర వచ్చింది.

News November 8, 2024

4వ డివిజన్ కన్వీనర్‌గా సురేందర్

image

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పనికలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4వ డివిజన్ కమిటీని ఈరోజు ఎన్నుకున్నామన్నారు. డివిజన్ కన్వీనర్‌గా సురేందర్, కో -కన్వీనర్లుగా వేల్పుల భిక్షపతి, తోగరి సారంగపాణి, బలిజ పృథ్వీ, రాజ్ కుమార్ తదితరులను ఎన్నుకున్నామని చెప్పారు. అనంతరం గ్రేటర్ కో-కన్వీనర్లు పొనగంటి లక్ష్మినారాయణ, కాళేశ్వరం రామన్న చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.