Warangal

News June 9, 2024

హనుమకొండ: పీజీ 4వ సెమిస్టర్ పరీక్ష వాయిదా

image

కేయూ పీజీ కోర్సుల MA, ఎంకామ్, MSC కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి బీఎస్ఎల్ సౌజన్య తెలిపారు. ఈనెల 11 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెమిస్టర్ పరీక్షల్ని వాయిదా వేసినట్లు తెలిపారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News June 9, 2024

జనగామ: కుక్కల దాడిలో బాలుడు మృతి

image

చిల్పూర్ మండలం ఫతేపూర్ గ్రామ శివారులోని నునావత్ తండాలో శనివారం దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో ఉన్న బాలుడు పై కుక్కలు దాడి చేసి అతి దారుణంగా చంపేశాయి. చెట్ల పొదల్లో అరుపులు వినిపించడంతో వెళ్లి చూసే సరికి బాలుని మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

News June 9, 2024

ఆత్మకూరు: బావిలో పడి రైతు మృతి

image

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి రైతు మృతి చెందిన ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీరుకుళ్ల గ్రామానికి చెందిన బిట్ల ప్రేమ్ చందర్ శనివారం పొలానికి మందు పిచికారీ చేయడానికి వెళ్లాడు. బావిలో నీళ్లు తోడుతున్న సమయంలో బావిలో పడిపోయాడు. గమనించిన భార్య తోటి రైతుల సాయంతో ప్రేమ్ చందర్‌ను బయటకు తీయించింది. అనూష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 9, 2024

నాలుగుసార్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే..

image

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత 2007లో శాసనమండలి వ్యవస్థను తిరిగి ప్రారంభించారు. WGL–KMM–NLG గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా తొలిసారి టీఆర్‌ఎస్‌ నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లోనూ కపిలవాయి విజయం సాధించారు. 2015 తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. మళ్లీ 2021ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.

News June 9, 2024

WGL: నేడు గ్రూప్‌-1 EXAM.. ఇది మీ కోసమే!

image

నేటి గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 76, భూపాలపల్లి-17 మహబూబాబాద్-12, జనగామలో 13 సెంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 35 వేల మంది పరీక్ష రాస్తున్నారు. అభ్యర్థుల కోసం బస్టాండ్‌లో హెల్ప్‌డెస్క్‌, రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేశారు.
NOTE: 10:30AM నుంచి 1PM వరకు పరీక్ష ఉంటుంది.
ALL THE BEST

News June 8, 2024

కాళేశ్వరం వాసులకే ఛైర్మన్‌ పదవి?

image

కాళేశ్వరం దేవస్థానానికి పాలక మండలి నియామకానికి సన్నాహాలు మొదలయ్యాయి. BRS ప్రభుత్వంలో నియామకమైన పాలకమండలి గడువు మార్చి 13న ముగిసింది. రెండేళ్ల క్రితం ఈ క్షేత్రానికి పూర్తిస్థాయి ఈవో నియామకం జరగగా.. 2 నెలల క్రితం బదిలీ అయ్యారు. అయితే పాలకమండలి ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. ఈసారి కాళేశ్వరం వాసులకే ఛైర్మన్‌ పదవి దక్కాలని ఆశిస్తున్నట్లు సమాచారం.

News June 8, 2024

కేయూలో రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

జూన్ 11 నుంచి ప్రారంభం కావాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి, అదనపు నియంత్రణ అధికారి డాక్టర్ బి.ఎస్.ఎల్ సౌజన్య తెలిపారు. తిరిగి ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో తెలియజేస్తామన్నారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని వహించాలని తెలిపారు.

News June 8, 2024

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ

image

దేశ రాజధాని న్యూ-ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలను కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, తదితరులు పాల్గొన్నారు.

News June 8, 2024

ములుగు: తాగునీరు కావాలంటే 2 కి.మీ నడవాల్సిందే

image

వాజేడు మండలం టేకులగూడెం పంచాయితీ పరిధిలోని పలు కాలనీల్లో 15 రోజులుగా నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయితీ అధికారులు ఏర్పాటు చేసిన మోటార్ పనిచేయకపోవడంతో 2 కి.మీ దూరంలో ఉన్న గోదావరి నది నుంచి చిన్నపిల్లలతో సహా నీరు మోసుకొని రావాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు తాగునీరు అందేలా చూడాలని కోరారు.

News June 8, 2024

కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కష్టపడి పని చేసిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పార్టీ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రవేశ పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.