India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సగం మంది మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులే పాలన కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారు మహిళలే కావడం విశేషం. WGL, HNK, ములుగు జిల్లాల కలెక్టర్లు కూడా మహిళా IASలే. వరంగల్, MHBD, భూపాలపల్లి ZP ఛైర్మన్లుగా వారే ఉన్నారు. GWMC మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా ఉండగా.. తాజాగా నిన్న వరంగల్ ఎంపీగా కావ్య గెలిచారు. పాలకుర్తి MLAగా యశస్విని రెడ్డి ఉన్నారు.
వరంగల్ లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు మాత్రమే విజయం సాధించారు. 1984 సం.లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి డాక్టర్ కల్పనాదేవి కాంగ్రెస్ అభ్యర్థి కమాలుద్దీన్ అహ్మద్పై గెలిచారు. మళ్లీ 2024లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ కడియం కావ్య బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్పై విజయం సాధించారు. వీరిద్దరూ డాక్టర్లు కావడం గమనార్హం.
సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళ ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపు సీఎంతో మహిళా నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ – ఖమ్మం -నల్లగొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ నల్గొండలో ప్రారంభం అయింది. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బండిల్స్ కట్టే కార్యక్రమం ప్రారంభం చేశారు. నాలుగు హాళ్లలో 96 టేబుల్స్ పై కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు బండిల్స్ కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను నల్గొండలో లెక్కిస్తున్నారు. ప్రస్తుతం బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగుతుంది. 96 టేబుళ్లపై ఓట్ల కొనసాగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 24 గంటల పాటు ఎన్నికల కౌంటింగ్ కొనసాగనుంది. ఓట్ల లెక్కింపులో 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యపై 3,92,574 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి కడియం కుమార్తె కావ్య పోటీ చేసి 2,20,339 ఆధిక్యంతో విజయం సాధించారు. ఇప్పుడు ఒకే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కుమార్తె ఎంపీగా.. తండ్రి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించనున్నారు.
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. వరంగల్లో 8,380 ఓట్లు రాగా.. మహబూబాబాద్లో 6,585 ఓట్లు పోలయ్యాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?
వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. ఎంపీగా గెలిచిన కడియం కావ్యకు కలెక్టర్ ప్రావీణ్య సర్టిఫికెట్ అందజేశారు.
WGL లోక్సభ ఎన్నికలో పోలైన ఓట్లు: 12,56,301
కడియం కావ్య (కాంగ్రెస్): 5,81,294
ఆరూరి రమేశ్ (BJP): 3,60,955
సుధీర్ కుమార్ (BRS): 2,32,033
ఉమ్మడి వరంగల్లోని వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను హస్తం కైవసం చేసుకుంది. వరంగల్లో కడియం కావ్యకు 2.20 లక్షల మెజార్టీ రాగా.. మహబూబాబాద్లో బలరాం నాయక్ 3.44 లక్షల భారీ ఆధిక్యం సాధించారు. కాగా ఈ రెండు స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు తెలిపారు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, షేక్ రిజ్వాన్ బాషా, సీపీ అంబర్ కిషోర్ ఝా ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎల్ఈడీ స్క్రీన్, టీవీల ద్వారా వీక్షించారు.
Sorry, no posts matched your criteria.