India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులు వరంగల్లో కడియం కావ్య 1,53,918 ఓట్ల మెజార్టీ, మహబూబాబాద్లో బలరాం నాయక్ 2,84,897 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికీ కావ్యకు 4,23,137 ఓట్లు రాగా.. బలరాం నాయక్కు 5,19,052 ఓట్లు వచ్చాయి. కాసేపట్లో రెండు స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి.
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ 2,08,460 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితకు 1,62,623 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు 3,71,083 ఓట్లు వచ్చాయి. కాసేపట్లో మహబూబాబాద్ చివరి ఫలితం విడుదల కానుంది.
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 9వ రౌండ్ ముగిసే సరికి 1,02,252 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం కావ్యకు 2,96,638 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్కు 1,94,386 ఓట్లు రాగా రెండో స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ 1,22,287 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ 1,84,442 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితకు 1,43,318 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు 3,27,760 వచ్చాయి. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాసేపట్లో మహబూబాబాద్ చివరి ఫలితం విడుదల కానుంది.
మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కౌంటింగ్లో భాగంగా 5వ రౌండ్లో పోలైన ఓట్లు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్కి మొత్తం 1,54,211 ఓట్లు రాగా.. BRS అభ్యర్థి మాలోత్ కవితకు 70,299 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 83,912 ఓట్లతో భారీ మెజార్టీలో ఉన్నారు.
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 2వ రౌండ్ పూర్తయ్యే సరికి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు 61,611 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్కు 43,113, బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ 28,195 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 18,498 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్& సైన్స్ కళాశాలలో ఈ నెల 10 నుంచి డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ 3వ, 5వ సెమిస్టర్ల ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కావున విద్యార్థులు తప్పక ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వాలన్నారు. తరగతులకు హాజరు కాని విద్యార్థులను సెమిస్టర్ పరీక్షలకు అనుమతించబోమని ఆమె తెలిపారు.
WGL, MHBD ఎంపీ స్థానాల ఓట్ల లక్కింపునకు సర్వం సిద్ధమైంది. WGL ఎంపీ స్థానంలో WGL తూర్పు లెక్కింపు తొలుత పూర్తవనుండగా.. ఆ తర్వాత PLKY, వర్ధన్నపేట, WGL పశ్చిమ, PRKL, BHPL, ఘనపూర్ ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 125 టేబుళ్లకు గాను 18 రౌండ్లలో కౌంటింగ్ చేయనున్నారు. MHBD ఎంపీ స్థానంలో MHBD, NSPT, పినపాక, భద్రాచలం, ఇల్లందు, డోర్నకల్, ములుగు సెగ్మెంట్లలో 112 టేబుళ్లకు గాను 22 రౌండ్లలో లెక్కించనున్నారు.
రేపు ఏనుమాముల మార్కెట్లో ఏర్పాటు చేసిన వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో 400 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ సీపీ తెలిపారు. సోమవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సీపీ సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి కేవలం ఎంపీ ఎన్నికల్లో పోటీదారులు, సంబంధిత ఏజెంట్లు, పాసులు ఉన్నవారికీ మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల అభీష్టం మేరకే నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. అధికారికంగా ప్రకటించకముందే ప్రతిపక్షాలు ఆందోళన చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేయడం విపక్షాలకు అలవాటుగా మారిందన్నారు.
Sorry, no posts matched your criteria.