Warangal

News June 3, 2024

మానుకోట విద్యార్థికి పాలిటెక్నిక్‌లో స్టేట్ 5 ర్యాంకు

image

తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్షా ఫలితాల్లో మానుకోట విద్యార్థి ముత్యాల పార్థసారథి గణితశాస్త్ర విభాగంలో స్టేట్ 5వర్యాంక్ సాధించాడు. స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో పార్థసారథి టెన్త్ చదువుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని మానుకోట జిల్లా కాంగ్రెస్ నాయకులు శంతన్ రామరాజు, ప్రైవేటు విద్యాసంస్థల జిల్లా అధ్యక్షుడు కమ్మగాని కృష్ణమూర్తి, తెలంగాణ ఉద్యమ ఫోరం నాయకులు నారాయణ్ సింగ్, తదితరులు అభినందించారు.

News June 3, 2024

RTV సర్వే: వరంగల్ బీజేపీ, మహబూబాబాద్ కాంగ్రెస్!

image

వరంగల్ స్థానం బీజేపీదేనని RTV సర్వే తేల్చి చెప్పింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున అరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి మారేపల్లి సుధీర్‌కుమార్ బరిలో ఉన్నారు. మహబూబాబాద్ స్థానంలో కాంగ్రెస్ గెలుపొందనుందని ఈ సర్వే పేర్కొంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోరిక బలరాం నాయక్, బీజేపీ తరఫున అజ్మీరా సీతారాంనాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత పోటీలో ఉన్నారు.

News June 3, 2024

మన ఎంపీ బలరాంనా.. కవితనా.. సీతారాం నా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో మహబూబాబాద్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి మాలోతు కవిత, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, BJP నుంచి అజ్మీరా సీతారాం నాయక్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

మన ఎంపీ కావ్యనా.. ఆరూరినా.. సుధీర్ కుమార్‌ నా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో వరంగల్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి సుధీర్ కుమార్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, BJP నుంచి ఆరూరి రమేశ్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

పంథిని వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐనవోలు మండలం పంథిని గ్రామంలో రెండు ట్రాక్టర్లను ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

వరంగల్: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

image

వరంగల్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజుల ఉత్కంఠకు మరో రోజుతో తెర పడనుంది. ఎనుమాముల మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. WGL తూర్పులో 17 రౌండ్లు ఉండడంతో లెక్కింపు ప్రక్రియ మొదట పూర్తి కానుంది. మిగతా 6 నియోజకవర్గాల్లో 18 రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. మొత్తం 124 టేబుళ్లపై.. 127 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.

News June 3, 2024

భారీ వర్షాలు.. గ్రేటర్ వరంగల్ ALERT

image

రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్‌ వరంగల్‌ అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే డీఆర్‌ఎఫ్, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. మడికొండ మెట్టుగుట్ట వద్ద చెట్లు కూలడంతో అక్కడికి DRF బృందం వెళ్లాలని ఆదేశించారు. వరంగల్‌ బట్టలబజారు వేంకటేశ్వరస్వామి దేవాలయం ముందు వరద నీరు భారీగా నిలవడంతో పారిశుద్ధ్య కార్మికులు మళ్లించారు.

News June 2, 2024

ఏటూరునాగారం: దైవ దర్శనానికి వెళ్ళొస్తూ.. దుర్మరణం

image

ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి-తాడ్వాయి మధ్య <<13364819>> బొలెరో వాహనం <<>>చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే మంగపేట మండలం రమణక్కపేటకు చెందిన ఓ వ్యక్తి తన కూతురు పుట్టు వెంట్రుకల వేడుక కోసం బంధువులతో కలిసి బొలెరో వాహనంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో చింతలమోరీ సమీపంలో బొలెరో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణ(60) అనే మహిళ మృతిచెందింది.

News June 2, 2024

వేయి స్తంభాల ఆలయంలో వంటలక్క

image

ప్రముఖ సీరియల్ నటి, బుల్లితెరలో పాపులర్ అయిన కార్తీకదీపం నటి ప్రేమీ విశ్వనాథ్ (వంటలక్క) ఈరోజు హనుమకొండ నగరంలో సందడి చేశారు. నేడు హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రుద్రేశ్వర స్వామిని ఆమె దర్శించుకొని పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో పలువురు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

News June 2, 2024

WGL: CPAC సర్వే.. BRS గెలుపు!

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో BRS గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. అలాగే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో BRS 11, BJP 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరొకటి గెలుస్తాయని అంచనా వేసింది. భువనగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది.