India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. చింతగూడెం గ్రామానికి చెందిన హర్షవర్ధన్(9) తన తండ్రి నచ్చని హెయిర్ కటింగ్ చేయించాడని మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.
మంగపేట మండలంలోని రాజుపేట కెనరా బ్యాంకులో ఇటీవల బంగారం దొంగిలించిన అప్రైజర్ ప్రశాంత్ను ఏటూరునాగారం మండలం ఎక్కెల క్రాస్ వద్ద ఏఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్ పట్టుకున్నారు. ఏఎస్పీ వివరాల ప్రకారం.. అతని వద్ద రూ.2,82,000 విలువైన 47 గ్రాముల బంగారం, రూ.2,19,000 విలువైన 2.190 కేజీల వెండి, రూ.2,51,000 నగదు, కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైసంపల్లి గ్రామానికి చెందిన సిద్దు(9) అనే బాలుడు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేసవి సెలవులు రావడంతో బాలుడు ఇతరుల ఇళ్లకు వెళ్లి ఆడుకునే వాడు. దీంతో ఆ బాలుడి తల్లి మందలించింది. మనస్తాపంతో బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇటీవల జరిగిన NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నిక ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక్కడి పోలింగ్ సరళిపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరుగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా లేక ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధిస్తారా? అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్థులు ఎవరికి వారే తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం పలు రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.16,500 పలకగా.. ఏసీ తేజ మిర్చి రూ.19,500 ధర పలికింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. మరోవైపు టమాటా మిర్చికి రూ.25 వేల ధర వచ్చింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం ప్రత్యేక సెలవు ఉండగా.. ఈరోజు పునః ప్రారంభమైంది. నేడు మార్కెట్కు పత్తి తరలి రాగా.. మంగళవారంతో పోలిస్తే ధర తగ్గింది. మొన్న క్వింటా పత్తి ధర రూ.7,275 పలకగా.. నేడు రూ.7,210కి చేరింది. పత్తి ధరలు దారుణంగా పడిపోతుండడంతో అన్నదాతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
కొండగట్టు అంజన్న ఆలయం హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి శనివారం వరకు నిర్వహించే ఉత్సవాలకు దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. 2 లక్షలకుపైగా దీక్షాపరులు తరలివచ్చి మాల విరమణ చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. తలనీలాలు సమర్పించేందుకు వీలుగా 1500 మంది క్షరకులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
విద్యుత్ సరఫరాలో సమస్యలను అధిగమిస్తున్నామని ఎన్పీడీసీఎల్ CMD వరుణ్ రెడ్డి తెలిపారు. గతేడాది జనవరి నుంచి మే వరకు పరిస్థితిని చూసుకుంటే ఈసారి ట్రిప్పింగ్స్ తగ్గాయని చెప్పారు. గతేడాది 11 కేవీ ట్రిప్పింగ్స్ 57,771 ఉండగా ఈసారి 40,724 నమోదై 29.51 శాతం తగ్గిందన్నారు. గతంలో 10,558 అంతరాయాలు ఉండగా.. 7,262 గంటలకు తగ్గి 31.22 శాతం నమోదైందన్నారు. వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో మానసిక దివ్యాంగ బాలిక(8)పై మద్యం మత్తులో యువకుడు అత్యాచారయత్నం చేశాడు. స్థానికుల వివరాలు.. మండల పరిధిలోని ఓ తండాలో యువకుడు బాలికకు చాక్లెట్ ఆశజూపి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం లైంగిక దాడి యత్నించడంతో బాలిక కేకలు వేసింది. బాలిక తల్లిదండ్రులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం మార్కెట్కు సెలవు ప్రకటించారు. దీంతో గురువారం ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని, రైతులు నాణ్యమైన సరకులు తీసుకుని రావాలని అధికారులు సూచించారు.
Sorry, no posts matched your criteria.