India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో పెద్ద జయంతి ఉత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. యాగశాల శుద్ధి, పుణ్యాహవాచనం, అఖండ దీపస్థాపన తదితర కార్యక్రమాలు చేపట్టారు. కాగా గురువారం ఉదయం 9 గంటల నుంచి జయంతి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం మార్కెట్కు సెలవు ప్రకటించారు. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని, రైతులు నాణ్యమైన సరకులు తీసుకుని రావాలని అధికారులు సూచించారు.
గ్రూప్-2, సింగరేణి ఉద్యోగాలిప్పిస్తామని రూ.4 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముఠాను కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రవీణ్కమార్ వివరాల ప్రకారం.. WGL రంగశాయిపేటకు చెందిన దాసు హరికిషన్ చుంచుపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. ఈ స్కామ్లో హరికిషన్తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు 6 రోజుల సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి గుగులోతు రెడ్డి తెలిపారు. జూన్ 1న వారాంతపు యార్డు బంద్, 2న ఆదివారం సాధారణ సెలవు. 3, 4, 5వ తేదీల్లో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ను పురస్కరించుకుని ఎన్నికల అధికారులు, కలెక్టర్ల ఆదేశాలమేరకు మార్కెట్కు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. 6న అమావాస్య సెలవు ఉందని, 7వ తేదీ శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభం కానుంది.
హన్మకొండ-ములుగు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం గూడెప్పాడు సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్కు చెందిన వీరు తాడ్వాయి మండలం మేడారం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ములుగు జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ట్రాక్టర్ను లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడిని పారిశుద్ధ్య కార్మికుడు సారయ్య(52)గా గుర్తించారు. కాగా, మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల ఓ మైనర్ ప్రేమ జంట <<13309776>>రైలు కింద పడి<<>> ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవులుకు ఫోన్ కాల్లో ఖమ్మంకు చెందిన సుష్మతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈనెల 24న వరంగల్ 12 మోరీల జంక్షన్ వద్ద రైలు కిందపడి ఆత్మ హత్యాయత్నం చేయగా.. సుష్మ(17) ఘటనాస్థలంలోనే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన చెన్నకేశవులు ఎంజీఎంలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
ఈనెల 27న WGL-KMM-NLG ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఉమ్మడి WGL వ్యాప్తంగా 73.80 శాతం పోలింగ్ నమోదయింది. 2021తో పోలిస్తే 3.02శాతం పోలింగ్ తగ్గింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పరిశీలిస్తే 76.34శాతంతో జనగామ అగ్రస్థానంలో నిలవగా.. ములుగు రెండో స్థానంలో నిలిచింది. WGL-3, BHPL-4, HNK-5 స్థానంలో ఉండగా.. 72.15శాతంతో మహబూబాబాద్ చివరి స్థానంలో నిలిచింది.
జూన్ 4న కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు అన్నారు. ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో నమోదు చేయాలని సూచించారు.
HNK జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబీకుల వివరాలు.. ధర్మసాగర్ మండలం ములకలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు(45) క్వారీలో గ్రానైట్ కట్టర్గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుంటున్న సమయంలో కిందపడటంతో కాలికి దెబ్బ తగిలింది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్ సూది ఇవ్వగానే తమ తండ్రి ప్రాణం విడిచాడని, డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయారని వెంకటేశ్వర్లు కొడుకు ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.