India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> జిల్లా వ్యాప్తంగా ముగిసిన MLC ఎన్నికల ప్రచారం
> రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఆసిఫాబాద్ MLA
> శాయంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
> WGL- KMM రహదారిపై సైకిల్ ని ఢీ కొట్టిన లారీ
> ఉరివేసుకొని 4వ తరగతి విద్యార్థి సూసైడ్
> వరంగల్లో విత్తన షాపులలో తనిఖీలు
> విద్యుత్ షాక్ తో 8ఏళ్ల బాలికకు గాయాలు
> భూపాలపల్లి కాలేశ్వరం ఆలయానికి పోటెత్తిన భక్తులు
జనగామ మండలంలోని గానుగపహడ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సంపత్ (11) నాల్గవ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సంపత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంపత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈనెల 27న జరగనుంది. 3 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉ. 8 నుంచి సా. 4 వరకు పోలింగ్ జరగనుంది. బరిలో BRS నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52 మంది బరిలో ఉన్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు 3 రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రచారం చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రేమేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డిలు వరంగల్ జిల్లాకు చెందిన వారే కాగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న నల్గొండ జిల్లాకు చెందిన వారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో వరంగల్ గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది.
‘అమ్మ నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దు’ అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన ఓ మైనర్ హంటర్ రోడ్డు సమీపంలో 2 మోరీల జంక్షన్ వద్ద రైలు కింద పడి మృతి చెందింది. ఓ బాలికకు వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవ మధ్య ఫోన్ కాల్ ద్వారా బంధం ఏర్పడింది. ఇద్దరూ మైనర్లు కావడంతో ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమనే చర్చ జరుగుతుంది.
WGL- HNK ప్రాంతాల మధ్య భద్రకాళి చెరువు ఉంది. 15 ఏళ్లుగా వరదతో పది కాలనీలు నీట మునుగుతున్నాయి. స్మార్ట్ సిటీ పథకం ద్వారా భద్రకాళి బండ్ పనులు మూడేళ్లుగా సాగుతున్నాయి. దీంతో చెరువు కట్ట బలహీనమైంది. గతేడాది పోతననగర్ వైపు మట్టి కట్టకు గండి పడింది. ఇరిగేషన్, గ్రేటర్ WGL అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే పలు ప్రాంతాలు నీట మునిగే అవకాశాలున్నాయని స్థానికులు వాపోతున్నారు.
ఈనెల 27న నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈనెల 27 ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని రామన్నపేట క్రాస్ రోడ్డు హంటర్ రోడ్డు సమీపంలో 12 మోరీల జంక్షన్ వద్ద రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. కాగా, యువతి మృతి చెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివార సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున, రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్కి సరుకులు తీసుకురావద్దని అధికారులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.17,200 పలికింది. అలాగే ఏసీ తేజ మిర్చి రూ.19,000 ధర, 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. కాగా నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు భారీగా తగ్గాయి. దీంతో రైతన్నలు కొంత నిరాశ చెందుతున్నారు.
Sorry, no posts matched your criteria.