India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడు మరో మనిషికి ప్రాణం పోశాడు. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన షేక్ షానాజ్కు గుండె సంబంధిత సమస్య ఉంది. గుండె మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో నిమ్స్ వైద్యులు అతడి గుండెను మార్పిడి చేసి షానాజ్కు విజయవంతంగా అమర్చారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత 3 రోజులతో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,040, మంగళవారం రూ.7,070 పలికింది. గురువారం రూ.7,210 ధరతో పోలిస్తే మరింత పెరిగి రూ.7,245 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.
HNK వడ్డేపల్లి చెరువు బండ్కు ముప్పు పొంచి ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఈ వానాకాలంలో అనేక కాలనీలు జలమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. GWMC అధికారులు వడ్డేపల్లి బండ్ పనులు అశాస్త్రీయంగా చేపట్టారని వారు బల్దియాకు సైతం లేఖ రాశారు.కాగా వడ్డేపల్లి చెరువు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని NIT రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రభుత్వ CSకి లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనకు ఆధునిక మైనింగ్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు సంస్థ C&MD బలరాం పేర్కొన్నారు. ఈ మేరకు HYD సింగరేణి భవన్లో మైనింగ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంపై ఆస్ట్రేలియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డేనిస్ ఈటెన్తో ప్రత్యేక సమావేశమయ్యారు. సింగరేణిలో నూతన వ్యాపార విస్తరణ చర్యల పరిశీలనకు నవంబర్లో ఆస్ట్రేలియా బృందం పరిశీలిస్తుందన్నారు.
వరంగల్ జిల్లాలో నేడు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఉ.11 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమై మ.1.30 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 12 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. గంట ముందు నుంచే అనుమతి ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. విద్యార్థులు HB బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్షకు జిల్లా నుంచి 5,624 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎనుమాముల మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల కు ఏర్పాటు చేసిన మూడు అంచెల భద్రతను సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్ర బలగాలు మరియు స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న విధులపై సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతోపాటు స్ట్రాంగ్ రూమ్లు మరింత భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు సూచించారు
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి ప్రావీణ్య ఆదేశించారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుపనున్న దృష్ట్యా గురువారం కలెక్టరేట్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై ఎన్నికల సంఘం నిబంధనల కచ్చితంగా పాటించాలన్నారు.
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నారావుపేట మండలం మగ్దుంపురంలో చోటుచేసుకుంది. మగ్దుంపురం గ్రామానికి చెందిన తోట రాజు(40)కు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. భార్య భర్తల మధ్య గొడవతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రాకపోవడం, మద్యానికి బానిసైన రాజు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. ‘ నేను మీటింగ్లో ఉన్నాను. నాకు డబ్బులు కావాలంటూ’ కలెక్టర్ ఐడీతో మేసేజ్ వచ్చింది. ఇది గమనించిన కలెక్టర్ తక్షణమే పోలీసులకు ఫిర్యాదుచేశారు. తన పేరుతో వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని ఆమె ప్రజలకు సూచించారు
వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు FACEBOOKలో నకిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. కలెక్టర్ పేరుతో ఉన్న ఐడీ ద్వారా.. తాను మీటింగ్లో ఉన్నానని, అర్జెంట్గా డబ్బులు కావాలంటూ +94776414080 నుంచి మేసేజ్ వచ్చింది. డబ్బులు ఫోన్పే చేసి, స్క్రీన్షాట్ షేర్ చేయాలని సందేశంలో ఉంది. వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.