Warangal

News May 23, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.18,200 ధర, ఏసీ తేజ మిర్చి రూ.20,000 ధర పలికింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. టమాటా రకం మిర్చి ఏసీ క్వింటాకు రూ.30 వేల ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

News May 23, 2024

WGL: దగ్గర పడుతున్న గడువు.. ఊపందుకున్న ప్రచారం

image

NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నికల ప్రచార గడువు శనివారంతో ముగియనుంది. దీంతో BRS, BJP, INC పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అన్ని పార్టీల్లోని రాష్ట్ర స్థాయి నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ఎన్నికకు సోమవారం పోలింగ్ జరగనుంది. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

News May 23, 2024

వరంగల్: తరలివచ్చిన పత్తి.. పెరిగిన ధర

image

నిన్న ఎండ తీవ్రత నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల మార్కెట్ బంద్ ఉండగా.. ఈరోజు ప్రారంభమవడంతో నేడు పత్తి తరలివచ్చింది. గత రెండు రోజులతో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,040, మంగళవారం రూ.7,070 పలికాయి. ఈరోజు మరింత పెరిగి రూ.7,210 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News May 23, 2024

27 నుంచి జూన్ 30 వరకు రైళ్ల రద్దు

image

మూడో లైను పనుల కారణంగా ఈ నెల 27 నుంచి వచ్చే నెల 30 వరకు పలు రైళ్లను రద్దు చేశారు. 07462/63 వరంగల్- సికింద్రాబాద్ పుష్పల్ రైలు, 17035/36 కాజీపేట- బల్లార్షా, 07766/65 కరీంనగర్ -సిర్పూర్ టౌన్, 07894 కరీంనగర్- బోధన్ రైళ్లను వచ్చే నెల 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.

News May 23, 2024

వరంగల్: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వరంగల్ ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు పొందుటకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ జుమ్లానాయక్ తెలిపారు. వచ్చే నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రాధాన్య క్రమంలో ట్రేడ్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. 14 ఏళ్ల వయసు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలన్నారు. అభ్యర్థులు వాడుకలో ఉన్న ఫోన్ నంబరును అందజేయాలన్నారు.

News May 23, 2024

భూపాలపల్లి, ములుగు మీదుగా రైల్వే లైను 207.80 కి.మీ

image

రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.

News May 23, 2024

ఎంతమందికి స్కూటీలు, తులం బంగారం ఇచ్చారో చెప్పాలి: KTR

image

కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే మహిళలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని అన్నారు. ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.

News May 22, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో TODAY హైలెట్స్

image

> WGL, HNK, NSPTలో MLC సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
> సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు
> స్ట్రాంగ్ రూములను పరిశీలించిన HNK, WGL జిల్లాల కలెక్టర్లు
> జనగామలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం
> మేడిగడ్డను సందర్శించిన పూణే సైంటిస్ట్ బృందం
> WGL: రోడ్డు ప్రమాద బాధితున్ని ఆసుపత్రికి తరలించిన KTR
> జిల్లాలో 3 ప్రధాన పార్టీల విస్తృత ప్రచారం
> MGMను సందర్శించిన వరంగల్ జిల్లా కలెక్టర్

News May 22, 2024

WGL: వివాహేతర సంబంధం.. SI సస్పెండ్

image

వివాహేతర సంబంధం వ్యవహారంలో కొమురవెల్లి ఎస్సై నాగరాజును సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళ్తే.. నాగరాజు వేరే మహిళలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో పాటు, నాగరాజు భార్య పీఎస్ ముందు మంగళవారం ధర్నా చేసినట్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. దీంతో ఈ ఘటనపై సిద్దిపేట సీపీ విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమవడంతో అతన్ని సస్పెండ్ చేశారు.

News May 22, 2024

ఎనుమాముల మార్కెట్ యార్డులో ఏర్పాట్ల పరిశీలన

image

ఎనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించనున్న వరంగల్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారదర్శకతతో కూడిన ఏర్పాట్ల విషయంలో ఖచ్చితత్వం పాటించే విధానంలో చేపట్టవలసిన వాటిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద నిర్వహించే విధులపై చర్చించారు.