India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KF లైట్ బీర్లో నీళ్లున్నాయంటూ ఓ వినియోగదారుడు ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. వివరాలిలా.. ఈ నెల 14న ములుగు మండలంలోని ఓ వైన్స్లో 6 బీర్లు కొనగా, వాటిలో 5 బీర్లలో ఆల్కహాల్కు బదులు నీళ్లున్నట్లు గుర్తించాడు. దీంతో ఎక్సైజ్ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈమేరకు బీర్ బాటిల్ను ల్యాబ్కు పంపిస్తామని, నిర్ధారణ అయితే వైన్షాపుపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినట్లు యువకుడు తెలిపాడు.
సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 17 నుంచి 15 రోజులు మూసివేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ రమేశ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 40కి పైగా ఉన్న సింగిల్ థియేటర్లు మూసివేయనున్నారు. మల్టీఫ్లెక్స్లు మాత్రం కొన్నిరోజులు కొనసాగుతాయన్నారు. మారుతున్న సాంకేతిక ప్రభావంతో ఓటీటీల్లో కోరుకున్న సినిమా అనుకూలమైన సమయంలో ఇంట్లోనే తిలకించే అవకాశం రావడమే ముఖ్యకారణంగా చెబుతున్నారు.
లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు KMM-NLG-WGL ఎమ్మెల్సీ ఉపఎన్నికలపై దృష్టి సారించాయి. ఎట్టి పరిస్థతుల్లోనూ ఈస్థానంలో పాగా వేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. BRS నుంచి రాకేశ్ రెడ్డి పోటీలో ఉండగా ఆయనకు మద్దతుగా గతంలో ఈస్థానం నుంచి గెలిచిన పల్లా వ్యూహాలను రచిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డినే బీజేపీ ఈ దఫా బరిలోకి దింపింది.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామశివారులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలిలా.. బుధరావుపేట గ్రామానికి చెందిన రావుల వెంకన్న (45) అనే గీత కార్మికుడు రోజు వారి వృత్తిలో భాగంగా ఐనపల్లికి సైకిల్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ నుంచి నర్సంపేట వైపు వేగంగా వస్తున్న కారు సైకిల్ను ఢీకొంది. ఈప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు.
మహబూబాబాద్లో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది.
బలరాం నాయక్(కాంగ్రెస్)పై మాలోత్ కవిత (BRS) 1,46,663 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అర్జున్ కుమార్ (TJS) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో బలరాం నాయక్(కాంగ్రెస్), సీతారాం నాయక్ (BJP), మాలోత్ కవిత(BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
6 రోజుల సుదీర్ఘ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున ప్రారంభం కానుంది. ఈనెల 13న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 10 నుంచి 15 వరకు 6రోజుల సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు మార్కెట్ ప్రారంభం కానుండటంతో ఉ.6 గం.ల నుంచే మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించాలని కోరారు.
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలను పార్టీ కార్యకర్తలు పట్టభద్రులకు వివరించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.
NLG-KMM-WGL MLC స్థానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా నడిచింది. ఉమ్మడి ఏపీలో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గెలిచారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి 2009 పోటీ చేసిన దిలీప్ కుమార్ మరోసారి విజయం సాధించారు. 2015, 21లోనూ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.
లోక్సభ పోరు ముగియగా మరో సమరానికి వరంగల్ సిద్ధమైంది. NLG-KMM-WGL MLC స్థానానికి ఈ నెల 27న బైపోల్ జరగనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న (INC), BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండింపెండెంట్గా అశోక్ పోటీ చేస్తున్నారు.
2019 ఎన్నికలతో పోలిస్తే వరంగల్ లోక్సభ స్థానంలో 2024లో ఓటింగ్ శాతం పెరిగింది. అప్పుడు 63.65% నమోదు కాగా.. ఇప్పుడు 68.86% పోలింగ్ అయింది. మహబూబాబాద్లోనూ 2019లో కంటే ఈసారి 2.81% మంది అధికంగా పోలింగ్లో పాల్గొనడంతో 71.85% నమోదైంది. ఈ రెండు స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉండగా.. 70.22 శాతంతో 23,57,331 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మరి మీరు ఓటేశారా? కామెంట్.
Sorry, no posts matched your criteria.