India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్సాహంగా ఓటు వేయడానికి వచ్చిన మహిళ ఓటు వేసిన అనంతరం మృతి చెందిన విషాద ఘటన చేర్యాలలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చేర్యాల మండల కేంద్రంలోని పెద్దమ్మ గడ్డ బాలుర పాఠశాలలో.. పట్టణానికి చెందిన సరోజన(75) ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటికి రాగానే గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి మంగళవారం ప్రత్యేక సాధారణ సెలవుగా జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రకటించారు. బుధవారం యథావిధిగా విధులకు హాజరు కావాలని కోరారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-65.00%, స్టే.ఘ-74.64%, పాలకుర్తి- 68.41%, పరకాల-70.20%, వర్ధన్నపేట-66.43%, వరంగల్ ఈస్ట్-59.43%, వరంగల్ వెస్ట్-47.00%గా ఉన్నాయి.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-64.72%, డోర్నకల్-70.86%, మహబూబాబాద్-67.19%, ములుగు-67.92%, నర్సంపేట-73.01%, పినపాక-65.91%, ఇల్లందు-69.11%గా ఉన్నాయి.
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. మరో గంటలో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
– SHARE IT
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-60.58%, డోర్నకల్-64.51%, మహబూబాబాద్-58.71%, ములుగు-61.23%, నర్సంపేట-62.30%, పినపాక-60.68%, ఇల్లందు-61.40%గా ఉన్నాయి.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-58.00%, స్టే.ఘ-63.51%, పాలకుర్తి- 60.22%, పరకాల-57.48%, వర్ధన్నపేట-56.40%, వరంగల్ ఈస్ట్-47.10%, వరంగల్ వెస్ట్-38.27%గా ఉన్నాయి.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-49.54%, డోర్నకల్-53.71%, మహబూబాబాద్-47.52%, ములుగు-50.66%, నర్సంపేట-43.60%, పినపాక-49.82%, ఇల్లందు-47.58%గా ఉన్నాయి.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-45.00%, స్టే.ఘ-47.55%, పాలకుర్తి- 45.67%, పరకాల-46.70%, వర్ధన్నపేట-41.62%, వరంగల్ ఈస్ట్-32.50%, వరంగల్ వెస్ట్-31.19%గా ఉన్నాయి.
మొబైల్ టిఫిన్ సెంటర్ను ఆర్టీసీ గరుడ వాహనం బస్సు రఘునాథపల్లి మండల కేంద్రంలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో <<13237980>>ఢీ కొట్టిన విషయం తెలిసిందే<<>>. అయితే ఈ ఘటనలో టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ మహిళ తీవ్రంగా గాయ పడింది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Sorry, no posts matched your criteria.