India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామంలో గుగులోత్ భద్రమ్మ ఓటు వేసేందుకు వెళ్లి కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో స్థానికులు 108కు ఫోన్ చేయగా.. గూడూరు ప్రాథమిక ఆసుపత్రికి అంబులెన్సులో తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని 108 సిబ్బంది తెలిపారు.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-30.10%, డోర్నకల్-33.33%, మహబూబాబద్-30.95%, ములుగు-29.79%, నర్సంపేట-28.50%, పినపాక-32.00%, ఇల్లందు-30.30%గా ఉన్నాయి.
మంత్రి కొండా సురేఖ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మెరుగైన సమాజం, దేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తమ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-26.00%, స్టే.ఘ-30.40%, పాలకుర్తి-27.20%, పరకాల-27.56%, వర్దన్నపేట-22.50%, వరంగల్ ఈస్ట్-18.50%, వరంగల్ వెస్ట్-18.24శాతంగా ఉన్నాయి.
WGL-HYD జాతీయ రహదారి.. రఘునాథపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని టిఫిన్ చేస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి WGLలోని ఈ గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాజేడు మండలం బొల్లారానికి చెందిన 219 మంది దాదాపు 6కి.మీ దూరంలోని ఆర్.గుంటపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటేస్తున్నారు. వెంకటాపురం మం.లోని పెంకవాగు, కలిపాక, కొత్తగుంపు గ్రామాల్లోని 433 మంది 6-7 కి.మీ దూరంలోని ఆలుబాక వెళ్లి ఓటేస్తున్నారు. మంగపేట మం. రేగులగూడెంలోని 150 మంది 4కి.మీ దూరం వెళ్లి తొండ్యాల-లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటేస్తారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-9.00%, స్టే.ఘ-13.00, పాలకుర్తి-10.24%, పరకాల-9.75%, వర్దన్నపేట-8.10%, వరంగల్ ఈస్ట్-6.70%, వరంగల్ వెస్ట్-6.50శాతంగా ఉన్నాయి.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-12.07%, డోర్నకల్-14.60, మహబూబాబద్-11.65%, ములుగు-11.38, నర్సంపేట-11.20, పినపాక-11.95, ఇల్లందు-11.90శాతంగా ఉన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఓ వైపు వర్షం.. మరోవైపు నేడు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో.. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయి కరెంట్ లేక పలు సమస్యలు తలెత్తాయి. వర్షం నీరు భారీగా నిలిచి ఓటర్లు చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు వర్షం, ఎండల నేపథ్యంలో ఉదయమే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.
భారత రాజ్యాంగం రూపొందించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరు హైస్కూల్లో 258వ బూతులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.