India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనికి వస్తుంది. జిల్లాలోని జనగామ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాబాద్ పరిధిలోకి, మిగిలిన ఏడు నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.
లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన సతీమణి ఎర్రబెల్లి ఉషాతో కలిసి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎర్రబెల్లి కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ మొదలైంది. శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ-లైన్లలో వేచి ఉన్నారు. ఎండల నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
వరంగల్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం పడింది. గీసుగొండలో 61.9 మి.మీ, ఖానాపురంలో 61 మి.మీ, వరంగల్లో 59.8 మి.మీ, ఖిలా వరంగల్లో 43,5 మి.మీ, సంగెంలో 28.8 మి.మీ, దుగ్గొండిలో 25.3 మి.మీ, నర్సంపేటలో 10 మి.మీ వర్షం పడింది. జిల్లావ్యాప్తంగా సరాసరి 22.3 మి.మీ వర్షం కురిసింది. మొత్తంగా 292.3 మి.మీ వర్షం పడినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గతేడాది జరిగిన అసెబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి WGL 12 అసెంబ్లీ స్థానాల్లోని WGL తూర్పు, పశ్చిమ మినహా మిగతా 10స్థానాల్లోని చాలా కేంద్రాల్లో 90%పైగా ఓటింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే 1952 నుంచి 2019 వరకు WGL లోక్సభ స్థానంలో 2014లో 76.39% అత్యధికంగా 1952లో అత్యల్పంగా 51.03% నమోదయింది. MHBD స్థానంలో 1957లో అత్యల్పంగా(53.82), 2014లో 81.05% ఓటేశారు. పట్టణాల్లో విద్యావంతులున్నా పల్లెల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది.
ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. WGL ఎంపీ స్థానంలో 2019లో 63.70 శాతం పోలింగ్ నమోదవగా మహబూబాబాద్లో 69.06 నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.
కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి నేటివరకు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని రూ.870,840 నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా SP సుధీర్ రామ్నాథ్ కెనాన్ తెలిపారు. అలాగే రూ.91,18,107 విలువచేసే మద్యాన్ని సీజ్ చేశామని, రూ.11,04,150ల విలువ చేసే గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో వివిధ వ్యక్తులు 18 తుపాకులను డిపాజిట్ చేశారన్నారు.
నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమ, బాధ్యతలోనూ. మన ఓరుగల్లు జిల్లాలో 33,56,832 మంది ఓటర్లున్నారు. -నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.
Sorry, no posts matched your criteria.