Warangal

News May 11, 2024

HNK: మిర్చి బజ్జీలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య

image

హనుమకొండ చౌరస్తాలోని ఓ మిర్చి బండి వద్ద కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య మిర్చి బజ్జీలు చేస్తూ సందడి చేశారు. అంతకు ముందు కాజీపేట నుంచి చౌరస్తా వరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే వరంగల్ అభివృద్ధి సాధ్యమని కావ్య అన్నారు.

News May 11, 2024

WGL: ఉపాధి హామీ పనులు చేసిన BRS ఎంపీ అభ్యర్థి

image

బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాలోతు కవిత ఉపాధి హామీ పనులు చేశారు. కురవి మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి, తనని గెలిపించాలని కోరారు. ఈ క్రమంలోనే గడ్డపార పట్టి, మట్టి తవ్వి ఉపాధి హామీ పనులు చేశారు. ఆమెతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పనుల్లో పాల్గొన్నారు.

News May 11, 2024

మహబూబాబాద్: రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

image

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణించిన బాలుడు పెద్దవంగర మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన చింతం జస్వంత్‌గా గుర్తించారు.

News May 11, 2024

వరంగల్: నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు

image

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఇన్ని రోజులుగా పాటలతో, మాటలతో హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు మరో 48 గంటల సమయమే మిగిలి ఉండటంతో, అటు మద్యం దుకాణాలు సైతం ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మూతపడనున్నాయి. ప్రచార పర్వం ముగుస్తుండటంతో అటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పర్వం మొదలు కానుంది.

News May 11, 2024

వరంగల్: గుండెపోటుతో యువకుడి మృతి

image

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పర్వతగిరి మండలంలోని రావూరు గ్రామానికి చెందిన నాగరాజు(28) గుండెపోటుతో మృతి చెందాడు. అయితే రోజు వారీలాగే ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లొచ్చాడు. సాయంత్రం 9 నుంచి 10 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించాడు.

News May 11, 2024

గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ మనకు అవసరమా: కావ్య

image

గత పదేళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ మనకు అవసరమా? అని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రశ్నించారు. భీమారంలో నిర్వహించిన రోడ్ షోలో కావ్య పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోని కోట్లాది మందిని నిరుద్యోగులుగా మార్చారని మండిపడ్డారు. వరంగల్ ప్రజలు బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కావ్య అన్నారు.

News May 11, 2024

బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు: సీతక్క

image

గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా పలు మండలాల్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ జీఎస్టీ పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేసిందని, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని అన్నారు.

News May 10, 2024

బీజేపీ రాష్ట్రంలో లేదు.. నియోజకవర్గంలో లేదు: కడియం

image

బీజేపీ రాష్ట్రంలో లేదు.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే మనకు జరిగే లాభమేమీ లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రం, ఉప్పుగల్లు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే కడియం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ప్రధానమంత్రి మోదీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదని కడియం అన్నారు.

News May 10, 2024

వరంగల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీని ఆశీర్వదించాలి: రమేశ్

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరూరిని కోలాట బృందాలు, డప్పు చప్పులతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. వరంగల్ అభివృద్ధి చెందాలన్నా, నిధులు రావాలన్నా.. బీజేపీని ఆశీర్వదించాలని అన్నారు.

News May 10, 2024

MHBD: కారు, బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ పట్టణంలోని నందిని నగర్ సమీపంలో గూడూరు తహశీల్దార్ కారు, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.