Warangal

News April 2, 2025

పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

image

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో BRS సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సభకు మీరు వెళ్తున్నారా?

News April 2, 2025

రాయపర్తి: ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించండి: ఎమ్మెల్యే

image

రాయపర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఈ పథకం అందేలా నిరంతరం పనిచేస్తున్నామని, ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాన్ని అందించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

News April 2, 2025

వరంగల్: GREAT.. గ్రూప్-1 ఆఫీసర్‌గా వాచ్‌మెన్ కుమారుడు

image

వరంగల్ జిల్లాకు చెందిన వాచ్‌మెన్ కుమారుడు గ్రూప్‌-1 ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. మామునూరుకు చెందిన జయ-రవికుమార్ దంపతుల కుమారుడు రాహుల్ ఇటీవల TGPSC విడుదల చేసిన గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో 555వ ర్యాంక్, మల్టీ జోన్-1 SC కేటగిరీలో 23వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 2023-2024లో టీజీపీఎస్సీ నిర్వహించిన ఏవో, జేఏఓ ఎగ్జామ్‌లో రాహుల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ)గా ఎన్నికయ్యారు.

News April 1, 2025

రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం పునః ప్రారంభం కానుంది. శనివారం అమావాస్య, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం మంగళవారం రంజాన్ సందర్భంగా సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News April 1, 2025

ఆందోళనలో ‘మావో’ కుటుంబాలు

image

ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు నేలకొరుగుతున్నారు. ఇక్కడి నుంచి సుమారు 21 మంది కీలక నేతలు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ఎన్ కౌంటర్లతో జిల్లాలోని వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఓరుగల్లు వాసులే ఉండడం గమనార్హం.

News April 1, 2025

స్టేషన్‌ఘన్‌పూర్: ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

image

ట్రాక్టర్ కొనివ్వలేదని ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సముద్రాల గ్రామానికి చెందిన బోధాసి సంతోష్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ట్రాక్టర్ కొనివ్వమని అడగగా.. ఇప్పుడు డబ్బులు లేవు కొన్ని రోజుల తర్వాత కొనిస్తామన్నారు. దీంతో క్షణికావేశంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News April 1, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్‌.. జనగామ జిల్లా మహిళా మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 1, 2025

చిన్నారికి రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎంపీ కావ్య

image

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.5 లక్షల ఎల్ఓసీని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అందజేశారు. అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని కడియం కావ్య అన్నారు. హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన Md. నజీం అహ్మద్ కుమారుడు ఆదిల్ అహ్మద్‌కు వైద్య చికిత్స కోసం అందించామని వరంగల్ ఎంపీ కావ్య తెలిపారు.

News April 1, 2025

శివనగర్: ప్రేమ వ్యవహారంలో మధ్యవర్తిగా.. కత్తితో దాడి

image

శివనగర్ ప్రాంతంలోని సబ్ స్టేషన్ వద్ద యువకుడిపై కత్తితో దాడి జరిగింది. ప్రేమ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడనే నెపంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. గాయపడిన యువకుడికి కత్తిపోటుతో పాటు ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. మిల్స్ కాలనీ పోలీసులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడు మైసయ్య నగర్‌కు చెందిన కందుల వినయ్‌గా పోలీసులు గుర్తించారు.

News April 1, 2025

వరంగల్: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సురేఖ

image

వరంగల్ పట్టణ పరిధిలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఇలా ఖిల్లా ఈద్గాలో ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నెల రోజులు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉండి రంజాన్ పండుగను జరుపుకుంటారని అన్నారు. ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.