India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవం’గా ఉత్సవాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం కార్యక్రమాలు ఇతర సంస్కృతి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర I & PR మంత్రి శ్రీనివాస్ హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
అడవుల్లో ప్రకృతి ప్రకోపం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మానవ తప్పిదాల వల్ల పర్యావరణంలో ఇలా ఎన్నడూ లేని మార్పులు ఏర్పడుతున్నాయని, పర్యావరణాన్ని రక్షిస్తూ.. ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ములుగు జిల్లా అటవీ ప్రాంతాన్ని భారీ చెట్ల పెంపకంతో సంరక్షించాలని కేటీఆర్ కోరారు.
రామప్ప దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రామప్ప కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పేలా అభివృద్ధి పనులను చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పల్లికాయ ధరలు మొన్నటితో పోలిస్తే ఈరోజు భారీగా పెరిగాయి.
> సోమవారం సూక పల్లికాయ ధర రూ.5,270 పలకగా నేడు రూ.6400 పలికింది.
> అలాగే పచ్చి పల్లికాయకు మొన్న రూ.3,600 ధర రాగా.. రూ.5550 పలికింది.
> మరోవైపు పసుపుకి మొన్న రూ.12,399 ధర రాగా.. నేడు రూ.12,817 ధర వచ్చింది.
> 5531 రకం మిర్చికి మొన్న రూ.12వేల ధర రాగా.. నేడు రూ.13,500 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నిన్న తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 పలకగా, నేడు రూ.18,500కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15,500కి ఎగబాకింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.16,000 ధర రాగా నేడు కూడా అదే ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర రెండు రోజులతో పోలిస్తే ఈరోజు భారీగా పెరిగింది. మార్కెట్లో సోమ, మంగళవారాలు క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా నేడు రూ.7,800 అయిందని మార్కెట్ అధికారులు తెలిపారు. ధరలు పెరగడం రైతులకు కొంత ఊరట లభించినట్టయింది. మరింత ధరలు పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా అక్టోబర్ 16 నుంచి 20 వరకు అప్ అండ్ డౌన్ రూట్లో 12 రైళ్ల సర్వీసులను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జబల్పూర్, ఇటార్సీ, నాగ్పూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు చెప్పారు.
వరంగల్ రీజియన్ పరిధిలోని ములుగు, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 12న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకు మడికొండలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు హాజరు కావాలన్నారు.
ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు వరంగల్, హనుమకొండ డీఐఈవోలు ఎ.గోపాల్, డా.సుమన్ శ్రీధర్ తెలిపారు. బోర్డు నిర్దేశించిన ప్రవేశాల గడువు ఈ నెల 7తో ముగియగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 15 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు అధికార వర్గాలు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కాకతీయ యూనివర్సిటీ స్టేషన్ పరిధి గోపాల్పూర్ శివసాయి కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వేలేరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ శివసాయి కాలనీలో ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువచ్చి ఏడాదిగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, కేయూ పోలీసులతో కలిసి ఆ గృహంపై దాడి చేసి ఆమెను అరెస్టు చేశారు.
Sorry, no posts matched your criteria.