Warangal

News April 28, 2024

వరంగల్: గన్ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్‌కు గాయాలు

image

వరంగల్‌లోని ఎనుమాముల EVM స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద విధులు పోలీస్ గన్ మిస్ ఫైరయ్యింది. గార్డ్ డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ రాకేశ్ గన్ మిస్ ఫైర్ కావడంతో ఎడమకాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. హుటాహుటినా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజేశ్‌కు MGMలో చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు వివరించారు.

News April 28, 2024

HNK: కాసేపట్లో కేసీఆర్ రోడ్‌షో.. అంతా సిద్ధం

image

హన్మకొండలో కాసేపట్లో మాజీ సీఎం కేసిఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. రోడ్‌షోకు సంబంధించి స్థానిక నేతలు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రోడ్ షోకు హాజరయ్యేందుకు పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి.

News April 28, 2024

మహబూబాబాద్: మే 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దాసు రాజు మాట్లాడుతూ.. మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 26 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు పరీక్షల ఫీజులను మే 6 వరకు చెల్లించవచ్చని తెలిపారు.

News April 28, 2024

హనుమకొండలో కేసీఆర్ రోడ్ షో

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర నేడు హనుమకొండకి చేరనుంది. సాయంత్రం 6 గంటలకు అంబేడ్కర్ విగ్రహం నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. అనంతరం హనుమకొండ చౌరస్తాలో జరిగే కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రసంగిస్తారు. సమావేశం అనంతరం రాత్రి మాజీ ఎంపీ కెప్టెన్ వొడితల లక్ష్మీ కాంతారావు నివాసంలో బస చేస్తారు.

News April 28, 2024

WGL: ఇంటర్ పరీక్షలు తప్పినందుకు విద్యార్థి సూసైడ్

image

ఖిలా వరంగల్ కోటపై శుక్రవారం <<13130945>>ఆత్మహత్య <<>>చేసుకున్న యువకుడి వివరాలు లభించాయి. కాశీబుగ్గకు చెందిన వరుణ్ సాయి(17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో మూడు సబ్జెక్టులు తప్పాడు. మూడు రోజులుగా మనోవేదనకు గురవుతున్న అతనికి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు. మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు మిల్స్ కాలనీ PS ఫిర్యాదు చేశారు.

News April 28, 2024

HNK: ప్రేమించిన అమ్మాయికి పెళ్లి నిశ్చయం.. యువకుడి ఆత్మహత్య

image

గూడురు మండలం తీగలవేణి గ్రామానికి చెందిన రాజన్న (25) హసన్‌పర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇటీవల ఆమెకు వేరే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. రెండేళ్లుగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని మరో అబ్బాయితో నిశ్చితార్థం చేసుకుందని తీవ్ర మనస్తాపానికి గురైన అతడు సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు శనివారం కేయూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.

News April 28, 2024

WGL: మే 8 లోగా పోలింగ్ స్లిప్స్ అందించాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ పి. ప్రావీణ్య సంబంధిత అధికారులతో పోలింగ్ ఏర్పాట్లపై శనివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్ట్రాంగ్ రూముల భద్రత,ఓటర్ల సమాచార చీటీల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మే 13న జరగనున్న పోలింగ్‌కు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోలింగ్ చీటీలు మే 8లోగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

News April 27, 2024

WGL: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం ఎవరికీ లేదు: మంత్రి సీతక్క

image

దేవుళ్ల పేరుతో బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. పదేళ్లలో కేంద్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. శనివారం ఆమె ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించారు. బీజేపీ పేదలపై పన్నులు వేస్తూ దుర్మార్గ పాలన చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. మాజీమంత్రి హరీశ్‌రావుకి పదవి మీద తప్పా, ప్రజల మీద ప్రేమ లేదని దుయ్యబట్టారు.

News April 27, 2024

HNK: పాఠశాలల పున:ప్రారంభం నాటికి పనులు పూర్తిచేయాలి: కలెక్టర్

image

హన్మకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను జూన్‌లో ప్రారంభమయ్యే పాఠశాలల పున:ప్రారంభం నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, అధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

News April 27, 2024

వరంగల్: 1.67లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు

image

ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1,67,853 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో వరంగల్ జిల్లాలో 43,594మంది, హన్మకొండ- 43,483, మహబూబాబాద్- 34,759, జనగామ- 23,320, భూపాలపల్లి- 12,460, ములుగు-10,237 మంది ఉన్నారు. వీరి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 222 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.