India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఇంటర్ ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా రాశారని విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. ఈ పరీక్షలు ఉదయం మధ్యాహ్నం నిర్వహించినట్లు తెలిపారు. పరకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాల్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒకరిని హనుమకొండ డీఈఓ అబ్దుల్ పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పరకాలలో ఇద్దరు ఇన్విజిలేటర్లను రిలీవ్ చేశామని అన్నారు.
ఖిలా వరంగల్ కోటలో గుర్తు తెలియని యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కోటలోని వ్యవసాయ క్షేత్రాలను ఆనుకొని ఉన్న రాతికోట మెట్లపై 20 ఏళ్ల యువకుడు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఎప్పుడు చేసుకున్నాడనే విషయంపై స్పష్టత లేదు. ఘటనా స్థలానికి మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య, ఎస్ఐ గోవర్దన్ చేరుకొని పరిశీలించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి ఈరోజు పసుపు తరలివచ్చింది. ఈ క్రమంలో పలు రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. కాడి పసుపు క్వింటాకి రూ.14,521, అలాగే గోల పసుపు క్వింటాకి రూ.14,650 పలికింది. మరోవైపు మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2280 పలకగా…సింగల్ పట్టి మిర్చి ధర రూ.39వేలు పలికింది. .
ట్రాక్ దాటుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన జనగామ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. పర్వతగిరి మండలం దౌలత్బాద్కు చెందిన దద్దు రాజు(27) కొమురవెల్లి దేవస్థానానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. జనగామ రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే పోలీసు అధికారి రమణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేడ జంగాల కాలనీలో గురువారం ఇద్దరు ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన ముత్యాలు భార్య కనకలక్ష్మి(35), చింతల పులేందర్ (40) రాజాపేటలోని పులేందర్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని మృతిచెందారు. ఈ జంట ఆత్మహత్యలకు అక్రమ సంబంధమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాను పనిచేస్తున్న యజమాని ఇంటిలోనే ప్రియుడు, అక్కతో కలిసి చోరికి పాల్పడింది ఓ మహిళ. ఈ ముగ్గురిని నిందితులను శుక్రవారం హనుమకొండలోని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ.38 లక్షల విలువ గల 470 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, దోచుకున్న సొమ్మును వరంగల్ పోలీస్ కమిషనరేట్ అంబర్ కిషోర్ ఝా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. గురువారం రూ.7,020 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.7100 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. ఎండాకాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులను మార్కెట్కు తీసుకొని రావాలని అధికారులు సూచించారు. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ కొనసాగుతోంది.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం9 నుంచి 12 వరకు జరగనున్నాయి.
SHARE
JEE మెయిన్స్లో వరంగల్ విద్యార్థులు సత్తాచాటారు. ఓపెన్ కేటగిరీలో మనీశ్ 126వ ర్యాంకు సాధించగా.. రిజర్వేషన్ కేటగిరీలో నవీన్ జాతీయ స్థాయిలో 5, నందిని 12, సాత్విక్ రెడ్డి 42వ ర్యాంకు సాధించారు. వివిధ కేటగిరీల్ల భరత్ కుమార్ 34, శ్రీతమ్ 71, మాలిక్ 142, హరిచరణ్ 371, పంజన 406, ధీరజ్ 755, రేనిత్(1064)తో పాటు.. పలువరు ర్యాంకు సాధించి ఔరా అనిపించారు.
SHARE
Sorry, no posts matched your criteria.