India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హన్మకొండ నగరంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన సయ్యద్ వహీద్, అష్రఫ్లు బైక్ పై హన్మకొండ వైపు వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన ఒక కారును బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వహీద్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అష్రఫ్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈనెల 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక బీల్వోకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు, మార్పులు కూడా చేసుకోవచ్చు.
KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
5రోజుల సుదీర్ఘ విరానంతరంమం అ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం పున:ప్రారంభం కానుంది. శుక్రవారం బాబు జగ్జీవన్ రావు జయంతి, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు, సోమవారం అమావాస్య, నేడు ఉగాది నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.
ఉగాది పండుగ సందర్భంగా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం పూర్తికాగానే కవి సమ్మేలనం జరిగింది. ఈ సందర్భంగా కవులతో పాటు ఆలయ ఈవో వెంకటయ్యను సీపీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రేమ వివాహం చేసుకున్నాడని అమ్మాయి తరఫువాళ్లు అబ్బాయిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఘటన MHBD జిల్లాలో జరిగింది. డోర్నకల్ మండలంలోని ఓ తండాకు చెందిన గణేశ్, ఓ యువతి ప్రేమించుకొని ఇటీవల HYDలో పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి తండ్రి డోర్నకల్ ఠానాలో కేసు పెట్టగా.. ఆమెను వారి తల్లిదండ్రులతో పంపించారు. అదేరోజు గణేశ్ ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా అమ్మాయి తరఫువాళ్లు గణేశ్, అతడి తల్లిపై దాడి చేశారు.
జనగామ మండలం పెంబర్తి గ్రామంలో పండగ వేల విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేకల శ్రీకాంత్(26) అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందారు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, స్నేహితులు సైతం కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా, ఇతనికి 6 నెలల క్రితమే వివాహం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతి లభించింది. గతేడాది నర్సంపేట, ములుగు పట్టణాలకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను పంపింది. ఈ మేరకు ఆ రెండు కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు దక్కినట్లు తెలిసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగుతున్నాయి.
జనగామ జిల్లా కొడకండ్లకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బుధవారం రానున్నట్లు బీజేపీ మండల శాఖ నాయకులు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా రేపు కొడకండ్లలో నిర్వహించనున్న బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొననున్నారు. వీరితో పాటు వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్లతో పాటు.. పలువురు నాయకులు హాజరు కానున్నట్లు సమాచారం.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగ తర్వాతే BRS వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తామని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ గొంతుక పార్లమెంట్లో వినిపిస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.