India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేపల మార్కెట్లో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన వెంకటాపురం మండలంలో చోటుచేసుకుంది. మార్కెట్లో చేపల విక్రయిస్తున్న నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తిపై వంశీ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అశోక్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వంశీని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
మహబూబాబాద్ పట్టణ ప్రజలు ఈ నెల 30వ తేదీలోగా ఇంటి పన్ను చెల్లిస్తే 5 శాతం మినహాయింపు ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణ ప్రజలు 2024-25 సంవత్సరం ఇంటి పన్ను నంబర్, పాత డిమాండ్ నోటీస్తో గాని చెల్లించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో చెల్లించవచ్చన్నారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొడ్తె మాటు తండాకు చెందిన చందా(50) అనే రైతు విద్యుత్ షాక్తో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. తండా శివారులోని వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నెక్కొండలో ఇటీవల ఫలుదాలో ఓ వ్యాపారి వీర్యం, మూత్రం కలుపుతున్నట్లు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. వెంటనే సదరు వ్యాపారిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ ఐస్క్రీం బండిలోని పదార్థాలను HYDలో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. వాటి నివేదికను ఫుడ్ సేఫ్టీ అధికారులు విడుదల చేశారు. అందులో ఎలాంటి వీర్యం, మూత్రం ఆనవాళ్లు లేవని నిర్ధారించినట్లు WGL జోన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అమృతశ్రీ క్లారిటీ ఇచ్చారు.
శుభాలను ఇచ్చే సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరమని, ప్రజలందరూ శుభాలతో ఏప్రిల్ 9న ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, కలెక్టర్ ఆకాంక్షించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా.. సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని అభిలషించారు. అలాగే కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని మల్లికార్జునస్వామి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. ఇటీవల ఓ దాత రూ.13 లక్షలతో ఇత్తడి తొడుగు, బంగారుపూతతో గర్భాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఆలయం కొత్త రూపును సంతరించుకుంటూ, భక్తులను ఆకర్షిస్తున్నది. దాతల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవస్థానం ఈవో అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు.
హన్మకొండలో ప్రసిద్ధి చెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో నూతన ఉగాది సందర్భంగా తొమ్మిది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు అర్చకులు తెలిపారు. ఈనెల 9 నుంచి 17 వరకు రోజుకు ఒక్కో రకమైన 21 కిలోల పుష్పాలతో పుష్పయాగం శ్రీ హనుమద్గిరి పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సభ్యుల సమక్షంలో నిర్వహించబడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.
వివిధ రకాల ట్యాక్స్ల పేరుతో పేద ప్రజలను మరింత పేదలుగా మార్చిన ఘనత బీజేపీ పార్టీది అని మంత్రి సీతక్క అన్నారు. బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో సీతక్క పాల్గొన్నారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. జీఎస్టీ పేరుతో పేద ప్రజలను బీజేపీ దోపిడీ చేస్తుందని మండిపడ్డారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నానని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, పార్టీ మారిన వారితో ఎలాంటి నష్టం లేదని, పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకునే ఆలోచన లేదని అన్నారు.
26ఏళ్ల యశస్వినిరెడ్డి గెలుపుతో రాష్ట్రమంతా పాలకుర్తి వైపు చూసిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. రాక్షస పాలన నుంచి యశస్విని రెడ్డి అందరికీ విముక్తి కల్పించారని కొనియాడారు. మీ అందరితో కలిసి నడుద్దామని తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు.
Sorry, no posts matched your criteria.