India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవరుప్పుల మండలం సీతారాంపురంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజాబీ(55) వృత్తి రీత్యా వీఆర్ఏగా కొడకండ్లలో పని చేస్తుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 15 నుంచి ఎంఫార్మసీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహచారి షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 15, 18, 20, 22తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
కేయూ పరిధిలో ఎంపీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి తెలిపారు. 16న మొదటి పేపర్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్, 19న స్పోర్ట్స్ మెడిసిన్, 22న హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, 24న స్పోర్ట్స్ ఇంజినీరింగ్. పరీక్షల ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయన్నారు.
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం ఫతేషాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండ ఉమేశ్(28) జనగామలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ ఇబ్బందుల దృష్ట్యా వ్యవసాయ భూమి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తొర్రూరు నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే రూట్లో సక్రమంగా బస్సులు నడపటం లేదు దీంతో బస్సులు సకాలంలో రావడం లేదని ప్రయాణికులు తొర్రూరులోని ఆర్టీసీ బస్టాండ్లో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బస్సులో సంఖ్యకు మించి బయల్దేరనున్న క్రమంలో తమను కూడా ఎక్కించుకోవాలని పలువురు వాదిస్తూ బస్సు అద్దాలపై కొట్టడంతో ముందు భాగంలో ఉన్న రెండు అద్దాలు పగిలిపోయాయి.
నేడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా నుంచి ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్ కార్యాలయానికి రాకూడదని కలెక్టర్ కోరారు.
నర్సంపేట పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీల్లో రూ.6లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట శివారు మహేశ్వరంలోని చెక్ పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ కారులో తరలిస్తున్న రూ.6లక్షలను పట్టుకున్నారు. సరైన లెక్కపత్రాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం అశ్వరావుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సోని(20) ఇటీవల విడుదలైన డిగ్రీ ఫలితాల్లో ఫెయిల్ అయింది. మనస్తాపానికి గురైన విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
TRSను BRS మార్చడం తనకు నచ్చలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పుడే పార్టీ ఓటమి ఖాయమైందన్నారు. దీనిపైనా, పార్టీ నిర్మాణంపైనా అంతర్గత సమావేశాల్లో మాట్లాడానని ఆయన తెలిపారు. తానుఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నానని.. కానీ ఒత్తిడితో తప్పని పరిస్థితుల్లో పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో LLB 5 ఏళ్ల కోర్సు మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు, మూడు ఏళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్ విద్యార్థులు) పరీక్షలు ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహాచారి వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.