India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలికపై లైంగిక దాడికి యత్నించి పోక్సో కేసులో అరెస్టయిన భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ బండారి సంపత్ కుమార్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారి బాలికపై అత్యాచారానికి యత్నించినందుకు సంపత్పై శాఖపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని ఆయన వెల్లడించారు.
వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే ఇక్కడ మాజీ MLA ఆరూరి రమేశ్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురుచూసున్నారు. మీ కామెంట్?
BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆరూరి రమేష్ రాజీనామాతో ఈ పదవి ఖాళీ అవ్వగా.. ఈ పదవిని ఎవరికి ఇస్తారో అని సందిగ్ధం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కార్యకర్తలు, సీనియర్ లీడర్లు చాలామంది పార్టీ ఫిరాయించడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్, పరకాల మాజీ MLA చల్లా ధర్మారెడ్డిలలో ఎవరో ఒకరికి ఈ పదవి రానున్నట్లు సమాచారం.
ప్రేమ పేరుతో బాలిక(15)ను వేధించిన యువకుడి(27)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ శుక్రవారం తెలిపారు. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈనెల 18న బాలిక ఇంటికి వెళ్లి వేధించడంతో బాలిక తల్లి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈమేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పర్వతగిరి మండలం తురకల సోమారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఇంటి పెరట్లో మొరంగడ్డ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా 5-8 అంగుళాల సైజు ఉండే ఈ మొరంగడ్డ ఏకంగా 2 అడుగుల పొడవు, రెండున్నర కిలోల బరువుతో అబ్బుర పరుస్తుంది. కాగా, గత కొంతకాలంగా వెంకటేశ్వర్లు తన ఇంటి ఆవరణలో కూరగాయలను పండిస్తున్నారు. వాటితో పాటు మొరంగడ్డ నాటారు. దానిని తవ్వి చూడగా.. భారీ పరిమాణంలో ఉండటంతో ఆశ్చర్యపోయారు.
ACB దాడులతో ఉమ్మడి WGL జిల్లాలోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. లంచం తీసుకుంటుండగా ముగ్గురు అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుపడగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తహశీల్దారును అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, తొలిసారిగా KUలో ఉద్యోగిని పట్టుకున్నారు. శుక్రవారం MHBD జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.
*MHBD జిల్లాలో 2018 మార్చిలో పోలీస్ స్టేషన్లో ఓ SI బాధితుడి నుంచి రూ.14 వేలు లంచం తీసుకుంటూ.. ACBకి దొరికాడు.
*2019లో నర్సింహులపేట MPDO రూ.35 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
*2021లో SC సంక్షేమ శాఖకు చెందిన అభివృద్ధి అధికారి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికాడు.
*జిల్లా పరిశ్రమల శాఖ అధికారి లోన్ మంజూరు కోసం రూ.7 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
* తాజాగా సబ్ రిజిస్టర్ పట్టుబడడం సంచలనంగా మారింది.
MHBD సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రూ.19,200 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఐతే గతంలో అవినీతి కేసుల్లో పట్టుబడిన నిందితులను హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేవారు. ఇటీవల వరంగల్లో ఏసీబీ కోర్టు ఏర్పాటు చేయడంతో మొదటి కేసుగా మహబూబాబాద్ రైడ్లో పట్టుబడిన ఇద్దరు నిందితులను ఇదే కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
MHBD జిల్లాలో శుక్రవారం విషాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ శివారు వెంకటాపురానికి చెందిన ఆకుల లావణ్య(28) కుటుంబ కలహాలతో తన కూతురు నిత్య(8), కుమారుడు ముఖేష్(10)లను బావిలో తోసి తానూ దూకింది. ఈ ఘటనలో తల్లి, కూతురు మృతి చెందగా.. బాలుడు ముఖేష్కు తీవ్ర గాయాలయ్యాయి. భర్త వివాహేతర సంబంధమే మహిళ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.
మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని నిలదీయగా ఓ కానిస్టేబుల్పై చేయిచేసుకున్న ఘటన మట్టెవాడ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. MGMలో చికిత్స కోసం ఓ మహిళ వచ్చింది. తోటి మహిళలతో MGM బస్టాప్ సమీపంలోకి రాగా.. రంగంపేటకు చెందిన విజయ్ కుమార్ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న ఎస్ పీఎఫ్ కమలాకర్ అతణ్ని అడ్డుకొని వారించాడు. దీంతో విజయ్ కానిస్టేబుల్పై రాయితో దాడి చేశాడు.
Sorry, no posts matched your criteria.