Warangal

News July 3, 2024

వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: మంత్రి

image

రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సత్తుపల్లి డివిజన్లో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కొండా సురేఖ హెలికాప్టర్లో వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

News July 3, 2024

ములుగు జిల్లా పేరు మార్పు.. మీరేమంటారు?

image

ములుగు జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో నేడు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి అధికారులు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈమేరకు సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చుతూ ఇప్పటికే అధికారులు పబ్లిక్ నోటీసులు జారీ చేశారు. మరి జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు. కామెంట్‌లో తెలపండి

News July 3, 2024

తొర్రూరు: అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు

image

ప్రేమ పేరుతో బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. డివిజన్ కేంద్రానికి చెందిన ఓ బాలికపై వాటర్ ప్లాంట్లో పనిచేసే ఇనుగుర్తి గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.

News July 3, 2024

WGL: వాట్సాప్ నుంచే ఫిర్యాదు చేయొచ్చు: సీపీ

image

కొత్త చట్టాలపై WGL సీపీ అంబర్ కిషోర్ ఝూ కీలక అంశాలను వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నూతన చట్టంలో మహిళలు, బాలలపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. బాధితులు చేసిన ఫిర్యాదుల వివరాలను ఆన్‌లైన్లో పరిశీలించుకోవచ్చని తెలిపారు. బాధితులు అత్యవసరంగా సంబంధిత ఠాణా నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, విచారించిన తర్వాత కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

News July 3, 2024

ఉత్తమ ప్లాంటుగా చిల్పూర్ కేటీపీపీ

image

భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చిల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) 600 మెగావాట్ల ప్లాంట్‌కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వరకు 200 రోజులుగా నిరంతరాయంగా విద్యుత్ అందించిన 600 మెగావాట్ల ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్లాంటుగా కేటీపీపీని గుర్తించడంపై ప్లాంట్ ‌లో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 2, 2024

వరంగల్: 9 మంది సీఐలు, ఐదుగురు ఎస్‌ఐల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు భారీగా బదిలీ అయ్యారు. 9 మంది ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్ఐ లను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఆత్మకూర్‌లో పని చేస్తున్న సీఐ క్రాంతి కుమార్‌ను పరకాలకు బదిలీ చేశారు. కమాండ్ కంట్రోల్ అటాచ్డ్‌గా ఉన్న సంతోశ్‌ను ఆత్మకూరు సీఐగా బదిలీ చేశారు.

News July 2, 2024

దేవాదాయశాఖ సమీక్షా సమావేశంలో మంత్రి కొండా సురేఖ

image

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సెక్రటేరియట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, సీజీఎఫ్ నిధులు, బోనాల ఉత్సవాలకు నిధుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 2, 2024

వరంగల్: కొత్త చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: సీపీ

image

కొత్త చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వరంగల్‌ పొలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్‌ న్యాయచట్టాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ముమ్మర ప్రచారం చేయాలని కమిషనర్‌ అధికారులకు సూచించారు. నూతన క్రిమినల్‌ న్యాయ చట్టాలతో రూపొందించిన క్రిమినల్‌ మేజర్‌ యాక్ట్స్‌ పుస్తకాలను పోలీస్‌‌స్టేషన్లకు పంపిణీ చేసే పుస్తకాలను రిలీజ్ చేశారు.

News July 2, 2024

ఆ ప్రచారంలో వాస్తవం లేదు: బండా ప్రకాశ్

image

తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ డా.బండా ప్రకాశ్ తెలిపారు. తాను BRS పార్టీని వీడటం లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తాను హైదరాబాద్ వెళ్లనన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డిని కలవలేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో పాతది అయి ఉండొచ్చని ఆయన తెలిపారు.

News July 2, 2024

వరంగల్: పెరిగిన మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలికింది. అలాగే ఏసీ 341 రకం మిర్చి రూ.16,500, వండర్ హాట్(WH) మిర్చికి రూ.18,500 ధర వచ్చింది. కాగా తేజ మిర్చి నిన్నటితో పోలిస్తే రూ.500, 341 మిర్చి రూ.500 తగ్గాయి. వండర్ హాట్ మిర్చి నిన్న రూ.16,000 పలకగా రూ.2,500 పెరిగి 18,500 పలికింది.