Warangal

News July 1, 2024

వరంగల్ కాంగ్రెస్‌‌లో కలహాలు?

image

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మధ్య కలహాలు పెరిగాయనే విమర్శలొస్తున్నాయి. శనివారం CM రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కనీస సమాచారం లేదని పలువురు ముఖ్యనాయకులు వాపోయారు. ఇదిలా ఉండగా CM పర్యటనలో NSPT MLA దొంతి మాధవరెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. పరకాల నియోజకవర్గంలో సైతం ఫ్లెక్సీలు, ఇతర అంశాలపై వాగ్వాదాలు జరుగుతుండగా.. వర్ధన్నపేటలో నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.

News July 1, 2024

నేటి నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటం

image

సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటానికి సిద్ధమైంది. సోమవారం నుంచి సింగరేణి వ్యాప్తంగా దశలవారీగా ఆందోళన కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి స్పష్టం చేశారు. 1న గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడంతో పాటు గని అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.

News July 1, 2024

BREAKING.. మహబూబాబాద్‌లో పురుగు మందు తాగిన SI

image

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాములు(34) MHBD జిల్లా కేంద్రంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. WGL జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో 5 నెలలుగా SIగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్టేషన్ నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టగా విషయం బయటపడింది. వరంగల్ ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News July 1, 2024

వరంగల్ ఎనుమాముల మార్కెట్ రేపు పునః ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News June 30, 2024

భూపాలపల్లి: రేపటి నుంచి అమలులోకి నూతన చట్టాలు : ఎస్పీ

image

జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేర, న్యాయచట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. నూతన చట్టాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి నెలరోజుల పాటు నిర్వహించిన శిక్షణ, అవగాహన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతన చట్టాల వల్ల కేసుల దర్యాప్తులో వేగం పెరిగి బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు.

News June 30, 2024

మేడారంలో భక్తుల సందడి

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగు వద్ద పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు తల్లుల గద్దెల వద్దకు చేరుకొని తల్లులకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరె, సారె, బంగారం ( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

News June 30, 2024

HNK: ఇన్‌స్టాగ్రాం పరిచయం.. బాలికపై అత్యాచారం

image

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకొని బాలికను ఓ యువకుడు అత్యాచారం చేశాడు. HNK జిల్లా కమలాపూర్ మండలంలో తాతయ్య ఇంటి వద్ద ఉంటున్న ఓ బాలిక (15)తో కామారెడ్డికి చెందిన శంకర్ (23) ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మిన ఆ బాలిక ఈనెల 23న ఇంట్లో నుంచి వెళ్లింది.అయితే శంకర్ తనను నమ్మించి అత్యాచారం చేశాడని బాలిక తన మేనమామకు చెప్పడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.

News June 30, 2024

తొర్రూరు: భార్య మందుల కోసం వచ్చి మృత్యువాత

image

భార్య మందుల కోసం వచ్చి ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాలకు చెందిన నంగునూరు నాగన్న (62) భార్య మందుల కోసం తొర్రూరుకు వెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్సులో వరంగల్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

News June 30, 2024

కాజీపేట: రేపటి నుంచి సింగరేణి, పుష్ పుల్ రైళ్ల రద్దు

image

మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా వరంగల్-సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్ పుల్ రైలును జులై 1 నుంచి 31 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే భద్రాచలం రోడ్-విజయవాడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు, కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్, సిర్పూర్ కాగజ్‌నగర్- కరీంనగర్ ప్యాసింజరు రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

News June 29, 2024

కేసముద్రం: రూ.30.38 కోట్ల బియ్యం మాయం!

image

కేసముద్రం మండల పరిధిలోని రైస్ మిల్లుల్లో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ తనిఖీల్లో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. CMR కింద ధాన్యాన్ని మర పట్టించి ప్రభుత్వానికి అందించాల్సిన రు.30.38 కోట్ల విలువ చేసే బియ్యాన్ని మిల్లర్లు మాయం చేసినట్లు అధికారులు తేల్చారు. ఆయా మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డీఎం కృష్ణవేణి తెలిపారు.