India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో భారీగా వివిధ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణ పేట జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రస్తుతం వరంగల్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పి. ప్రావీణ్యను హనుమకొండ జిల్లా కలెక్టర్గా నియమించారు.
మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం 60 నూతన బస్సుల కోసం ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం జిల్లాలోని 9 డిపోల్లో 579 ప్రభుత్వ బస్సులు, 327 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ప్రతిపాదనల మేరకు కొత్త బస్సులు వస్తే కొంత మేర బస్సుల్లో రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ కేఎంసీ అనస్తీషియా విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన డా. సైఫ్ ఈ నెల 17న ఉమ్మడి వరంగల్ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో హాజరుకానున్నారు. న్యాయమూర్తి నేర నిర్ధారణ విచారణ చేయనున్నారు. అనంతరం ట్రయల్ తేదీల కోసం కేసు వాయిదా వేస్తారు. గత సంవత్సరం ఫిబ్రవరి 26న ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్యపల్లి క్రాస్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నల్లబెల్లి మండలం ముచింతాల గ్రామానికి చెందిన పులి రవి అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. గోదావరిఖనికి వెళ్లి వస్తున్న ఆయనను పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 108 వాహనంలో అతని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
వరంగల్ ఇన్ఛార్జ్ సీపీగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాఖాపరమైన శిక్షణ నిమిత్తం డిల్లీకి వెళ్లడంతో మహంతికి ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఆయనకు రోజువారీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27న శిక్షణ పూర్తయ్యాక సీపీ అంబర్ కిషోర్ ఝా వరంగల్కు రానున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు 3 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం బక్రీద్ పండగ సందర్భంగా మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ 3 రోజులు మార్కెట్కి సరుకులు తీసుకురావద్దని, ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
వరంగల్ నగరానికి చెందిన తోట రాజేశ్వరరావు రికార్డు స్థాయిలో రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు 129 సార్లు రక్తదానం చేసిన ఆయన ఈరోజు 130వ సారి రక్తదానం చేశారు. తన 18వ ఏటా నుంచి సంవత్సరానికి 4 సార్లు (ప్రతి 3 నెలకోసారి) రక్తదానం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ DMHO వెంకటరమణ, KMC ప్రిన్సిపల్ మోహన్ దాస్ తదితరులు ఆయనను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని రామాలయాన్ని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రామ సహాయం రఘురామిరెడ్డి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రామచంద్ర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి స్వామివారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న పార్టీ మార్పు ప్రచారాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. సోషల్ మీడియా వేదిక చేసుకుని కొంతమంది తనపై అసత్య ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు రాజకీయాల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని, అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ, పార్టీ మారే ఆలోచన లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.19,000 ధర పలికింది. 341 రకం మిర్చికి రూ.16,500 ధర వచ్చింది. వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.17,500 ధర, టమాటా మిర్చి రూ.25వేల ధర వచ్చింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా ధరలు పెరిగాయి.
Sorry, no posts matched your criteria.