India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ కేఎంసీ అనస్తీషియా విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన డా. సైఫ్ ఈ నెల 17న ఉమ్మడి వరంగల్ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో హాజరుకానున్నారు. న్యాయమూర్తి నేర నిర్ధారణ విచారణ చేయనున్నారు. అనంతరం ట్రయల్ తేదీల కోసం కేసు వాయిదా వేస్తారు. గత సంవత్సరం ఫిబ్రవరి 26న ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్యపల్లి క్రాస్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నల్లబెల్లి మండలం ముచింతాల గ్రామానికి చెందిన పులి రవి అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. గోదావరిఖనికి వెళ్లి వస్తున్న ఆయనను పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 108 వాహనంలో అతని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
వరంగల్ ఇన్ఛార్జ్ సీపీగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాఖాపరమైన శిక్షణ నిమిత్తం డిల్లీకి వెళ్లడంతో మహంతికి ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఆయనకు రోజువారీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27న శిక్షణ పూర్తయ్యాక సీపీ అంబర్ కిషోర్ ఝా వరంగల్కు రానున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు 3 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం బక్రీద్ పండగ సందర్భంగా మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ 3 రోజులు మార్కెట్కి సరుకులు తీసుకురావద్దని, ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
వరంగల్ నగరానికి చెందిన తోట రాజేశ్వరరావు రికార్డు స్థాయిలో రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు 129 సార్లు రక్తదానం చేసిన ఆయన ఈరోజు 130వ సారి రక్తదానం చేశారు. తన 18వ ఏటా నుంచి సంవత్సరానికి 4 సార్లు (ప్రతి 3 నెలకోసారి) రక్తదానం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ DMHO వెంకటరమణ, KMC ప్రిన్సిపల్ మోహన్ దాస్ తదితరులు ఆయనను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని రామాలయాన్ని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రామ సహాయం రఘురామిరెడ్డి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రామచంద్ర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి స్వామివారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న పార్టీ మార్పు ప్రచారాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. సోషల్ మీడియా వేదిక చేసుకుని కొంతమంది తనపై అసత్య ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు రాజకీయాల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని, అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ, పార్టీ మారే ఆలోచన లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.19,000 ధర పలికింది. 341 రకం మిర్చికి రూ.16,500 ధర వచ్చింది. వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.17,500 ధర, టమాటా మిర్చి రూ.25వేల ధర వచ్చింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా ధరలు పెరిగాయి.
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతు గూడెం తండాలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గత వారం భర్త రవి సంగెం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక భార్య సరిత గురువారం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జేఈఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 18న నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జేఈఈలో అర్హత సాధించి ఇంజినీరింగ్ కళాశాలను ఎంచుకునేందుకు గాను ఈ అవగాహన తోడ్పడుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అవగాహన నిర్వహించనున్నారు. నిట్ వరంగల్ ప్రత్యేకతనూ తెలియజేయనున్నారు.
Sorry, no posts matched your criteria.