Warangal

News June 4, 2024

10 నుంచి డిగ్రీ సెమిస్టర్ తరగతులు ప్రారంభం

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్& సైన్స్ కళాశాలలో ఈ నెల 10 నుంచి డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ 3వ, 5వ సెమిస్టర్‌ల ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కావున విద్యార్థులు తప్పక ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వాలన్నారు. తరగతులకు హాజరు కాని విద్యార్థులను సెమిస్టర్ పరీక్షలకు అనుమతించబోమని ఆమె తెలిపారు.

News June 4, 2024

WGL, MHBDలో సర్వం సిద్ధం!

image

WGL, MHBD ఎంపీ స్థానాల ఓట్ల లక్కింపునకు సర్వం సిద్ధమైంది. WGL ఎంపీ స్థానంలో WGL తూర్పు లెక్కింపు తొలుత పూర్తవనుండగా.. ఆ తర్వాత PLKY, వర్ధన్నపేట, WGL పశ్చిమ, PRKL, BHPL, ఘనపూర్ ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 125 టేబుళ్లకు గాను 18 రౌండ్లలో కౌంటింగ్ చేయనున్నారు. MHBD ఎంపీ స్థానంలో MHBD, NSPT, పినపాక, భద్రాచలం, ఇల్లందు, డోర్నకల్, ములుగు సెగ్మెంట్లలో 112 టేబుళ్లకు గాను 22 రౌండ్లలో లెక్కించనున్నారు.

News June 4, 2024

WGL: 400 మంది పోలీసు సిబ్బందితో కౌంటింగ్ బందోబస్తు : సీపీ

image

రేపు ఏనుమాముల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో 400 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ సీపీ తెలిపారు. సోమవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సీపీ సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి కేవలం ఎంపీ ఎన్నికల్లో పోటీదారులు, సంబంధిత ఏజెంట్లు, పాసులు ఉన్నవారికీ మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

News June 3, 2024

కాకతీయ కళాతోరణం తొలగింపుపై నిర్ణయం తీసుకోలేదు: సీతక్క

image

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల అభీష్టం మేరకే నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. అధికారికంగా ప్రకటించకముందే ప్రతిపక్షాలు ఆందోళన చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేయడం విపక్షాలకు అలవాటుగా మారిందన్నారు.

News June 3, 2024

మానుకోట విద్యార్థికి పాలిటెక్నిక్‌లో స్టేట్ 5 ర్యాంకు

image

తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్షా ఫలితాల్లో మానుకోట విద్యార్థి ముత్యాల పార్థసారథి గణితశాస్త్ర విభాగంలో స్టేట్ 5వర్యాంక్ సాధించాడు. స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో పార్థసారథి టెన్త్ చదువుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని మానుకోట జిల్లా కాంగ్రెస్ నాయకులు శంతన్ రామరాజు, ప్రైవేటు విద్యాసంస్థల జిల్లా అధ్యక్షుడు కమ్మగాని కృష్ణమూర్తి, తెలంగాణ ఉద్యమ ఫోరం నాయకులు నారాయణ్ సింగ్, తదితరులు అభినందించారు.

News June 3, 2024

RTV సర్వే: వరంగల్ బీజేపీ, మహబూబాబాద్ కాంగ్రెస్!

image

వరంగల్ స్థానం బీజేపీదేనని RTV సర్వే తేల్చి చెప్పింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున అరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి మారేపల్లి సుధీర్‌కుమార్ బరిలో ఉన్నారు. మహబూబాబాద్ స్థానంలో కాంగ్రెస్ గెలుపొందనుందని ఈ సర్వే పేర్కొంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోరిక బలరాం నాయక్, బీజేపీ తరఫున అజ్మీరా సీతారాంనాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత పోటీలో ఉన్నారు.

News June 3, 2024

మన ఎంపీ బలరాంనా.. కవితనా.. సీతారాం నా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో మహబూబాబాద్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి మాలోతు కవిత, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, BJP నుంచి అజ్మీరా సీతారాం నాయక్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

మన ఎంపీ కావ్యనా.. ఆరూరినా.. సుధీర్ కుమార్‌ నా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో వరంగల్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి సుధీర్ కుమార్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, BJP నుంచి ఆరూరి రమేశ్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

పంథిని వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐనవోలు మండలం పంథిని గ్రామంలో రెండు ట్రాక్టర్లను ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

వరంగల్: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

image

వరంగల్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజుల ఉత్కంఠకు మరో రోజుతో తెర పడనుంది. ఎనుమాముల మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. WGL తూర్పులో 17 రౌండ్లు ఉండడంతో లెక్కింపు ప్రక్రియ మొదట పూర్తి కానుంది. మిగతా 6 నియోజకవర్గాల్లో 18 రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. మొత్తం 124 టేబుళ్లపై.. 127 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.