Warangal

News June 12, 2024

డోర్నకల్‌లో ‘MLA గారి తాలూకా’ ట్రెండ్

image

ఏపీలోని పిఠాపురం సంస్కృతి తెలంగాణకు చేరింది. ఇటీవల KNR జిల్లా చొప్పదండి, WGL పాలకుర్తి MLAల అభిమానులు వాహనాల మీద ‘ఎమ్మెల్యేల గారి తాలూకా’ అనే స్టిక్కర్లు అతికించి సందడి చేసిన విషయం తెలిసిందే. దీన్ని అనుసరిస్తూ డోర్నకల్‌లో సైతం వాహనాల మీద ఈ తరహా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. మంగళవారం డోర్నకల్ మండలంలో ఓ వాహనంపై ‘డోర్నకల్ MLA గారి తాలూకా’ అని రాసి ఉన్న స్టిక్కరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

News June 12, 2024

వరంగల్ జిల్లా పాలనలో మహిళల మార్క్..

image

ఉమ్మడి వరంగల్ జిల్లా పాలనలో మహిళల మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోనూ వరంగల్ ప్రాంతాన్ని రాణిరుద్రమదేవి పరిపాలించింది. రాణిరుద్రమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకునట్లుగా జిల్లాలో 80శాతం ప్రజాప్రతినిధులు, అధికార సారథులు మహిళలే కావడం విశేషం. జిల్లా నుండి ఇద్దరు మహిళా మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఐదుగురు జడ్పీ చైర్మన్లు, మేయర్, మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మహిళలే ఉన్నారు.

News June 11, 2024

రేపు వరంగల్ మార్కెట్‌కు మళ్లీ సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు బంద్ ఉండనుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని అధికారులు సూచించారు. గురువారం మార్కెట్ యథాతథంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

News June 11, 2024

సీఎం రేవంత్‌ను కలిసిన మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ మల్లన్న

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సీతక్కతో కలిసి సీఎంను కలిసి పూలబొకే అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

News June 11, 2024

వరదలకు సంబంధించి ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై మంత్రి స‌మీక్ష

image

ప్రజా పాలనలో భాగంగా మంత్రి సీతక్క రాష్ట్ర స‌చివాల‌యంలో వరదలకు సంబంధించి ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఆమె మాట్లాడుతూ.. ముంద‌స్తుగా స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వాటిని ప‌రిష్కరించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్, పాత కనెక్షన్‌పై సమీక్షించారు. పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని ఆదేశాలిచ్చారు.

News June 11, 2024

వరంగల్: వైద్య కళాశాల భవనాన్ని సందర్శించిన కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడు నర్సంపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలో నిర్మాణంలో ఉన్న నర్సంపేట వైద్యకళాశాల భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మ్యాపును పరిశీలించి, అధికారులకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. నిర్మాణంలో అలసత్వం వహించవద్దని, నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

News June 11, 2024

రాజన్న దర్శనానికి వచ్చి గుండెపోటుతో జనగామ వాసి మృతి

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన వినయ్ కుమార్.. రాజన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ మృతి చెందాడు.

News June 11, 2024

వరంగల్: మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నేడు మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.18,500 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి సైతం నిన్నటి (రూ.16,500) ధర వచ్చింది. వండర్ హాట్ (WH) రకం మిర్చికి సోమవారం రూ.18,000 ధర రాగా నేడు రూ.18,500 ధర వచ్చింది. కాగా, నేడు మార్కెట్‌కు మిర్చి తరలివచ్చింది.

News June 11, 2024

విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి: డీఈ

image

వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని డీఈ విజయ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తపేట సబ్ స్టేషన్లో విద్యుత్ అధికారులతో డీఈ సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

News June 11, 2024

HNK: చింతచెట్టు కోసం గొడవ.. ప్రాణాలు కోల్పోయిన తల్లి

image

చింతచెట్టు కోసం జరిగిన గొడవ కొడుకు చేతిలో తల్లి ప్రాణాలు పోవడానికి కారణమైంది. HNK జిల్లా శాయంపేట మం. కొప్పులకు చెందిన తిరుపతి రెడ్డికి, జయపాల్ రెడ్డికి ఈనెల 8న చింతచెట్టు విషయంలో గొడవ జరిగింది. గొడవ వద్దని తిరుపతిరెడ్డిని భార్య అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కోపంలో భార్యను కొట్టేందుకు తిరుపతిరెడ్డి ప్రయత్నించగా.. తల్లి నర్సమ్మ అడ్డుకుంది. దీంతో తీవ్ర గాయాలపాలై MGMకు తీసుకెళ్లే క్రమంలో మరణించింది.