Warangal

News June 1, 2024

చాణక్య X SURVEY: వరంగల్ కాంగ్రెస్‌దే..!

image

వరంగల్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ చేశారు. BJP నుంచి ఆరూరి రమేశ్, BRS నుంచి సుధీర్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, BJPకి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

ఆరా మస్తాన్ SURVEY: మహబూబాబాద్ కాంగ్రెస్‌దే..!

image

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ పోటీ చేశారు. BJP నుంచి అజ్మీరా సీతారాం నాయక్, BRS నుంచి మాలోతు కవిత పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

ఆరా మస్తాన్ SURVEY: వరంగల్ కాంగ్రెస్‌దే..!

image

వరంగల్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ చేశారు. BJP నుంచి ఆరూరి రమేశ్, BRS నుంచి సుధీర్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, BJPకి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

వరంగల్: ఒక్క రూపాయి గొడవ.. ఒకరి మృతి

image

వరంగల్ గాంధీ నగర్‌లో బిర్యానీ సెంటర్లో ఒక్క రూపాయి విషయంలో జరిగిన గొడవలో ఒకరు మృతి చెందారు. ఒక బిర్యానీ సెంటర్లో రూ.59 రూపాయల బిర్యానీకి అరవింద్ అనే యువకుడు రూ.60లు ఫోన్ పే చేశాడు. ఒక్క రూపాయి విషయంలో అరవింద్‌కు, ప్రేమ్ సాగర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో కిందపడ్డ ప్రేమ్ సాగర్ చిన్న మెదడు చిట్లి మృతి చెందాడు. మిల్స్ కాలనీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 1, 2024

ములుగు: వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

image

వరకట్న వేధింపులు కారణంగా వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దీకొండ శ్రీనాథ్ భార్య అంజలితో తనకు రావాల్సిన వరకట్నం ఇంకా ఇవ్వలేదని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అంజలి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా అంజలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 1, 2024

వరంగల్: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. వరంగల్, MHBD పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికే వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!

News June 1, 2024

ములుగు: మూడేళ్లకే.. నూరేళ్లు నిండాయి

image

రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మంగపేటలో జరిగింది. స్థానిక ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మోట్లగూడెం చెందిన నగేశ్ ద్విచక్ర వాహనంపై చిన్నారి ఆద్య(3)ను తీసుకొని మంగపేట వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రమణక్కపేట శివారులో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.

News June 1, 2024

వరంగల్: భానుడి సెగలు.. రోడ్లన్నీ నిర్మానుష్యం

image

వరంగల్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. దాదాపు ప్రతీ మండలంలోనూ 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. పందులు మేపడానికి వెళ్లి చెన్నారావుపేటకు చెందిన బలయ్య వడదెబ్బకు గురై మృతిచెందాడు. కొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతవరణ అధికారులు చెబుతున్నా, ప్రస్తుతం మాత్రం సూర్యుడి దెబ్బకు జనాలు విలవిల్లాడుతున్నారు. వరంగల్ నగరంతో పాటు వర్ధన్నపేట, నర్సంపేట రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

News May 31, 2024

చెన్నారావుపేట: వడదెబ్బతో ఒకరు మృతి

image

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో వడదెబ్బతో ఒకరు మృతిచెందారు. చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య రెండు రోజులుగా కూలీ పనులకు వెళ్లగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా చికిత్స అందించినప్పటికి శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఐలయ్య మృతదేహానికి ఏకలవ్య సంఘం నాయకులు నివాళులర్పించి, బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు.

News May 31, 2024

కేయూ ఉద్యోగులపై కేసు నమోదు..?

image

కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల నియంత్రణ విభాగంలో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బందిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కేయూ పరిధిలో జరిగిన డిగ్రీ పరీక్షల జవాబు పత్రాల సీల్ తెరచి, మళ్ళీ విద్యార్థులతో పరీక్షలు రాయించి గుట్టుచప్పుడుగా సీల్ వేస్తున్నట్లు కొందరు సిబ్బంది గుర్తించారు. ఇదే విషయాన్ని పరీక్షల నియంత్రణ అధికారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేయూ పోలీసులకు ఫిర్యాధు చేసినట్లు సమాచారం.