Warangal

News May 26, 2024

మహబూబాబాద్: సమ్మర్‌ హాలిడేస్‌లో విషాదం

image

2 రోజుల క్రితం రహమత్‌నగర్‌లో బిల్డింగ్‌ మీద హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రగాయాల పాలైన లౌలి(8) చికిత్స పొందుతూ కాసేపటి క్రితం HYDగాంధీ ఆస్పత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 90శాతం శరీరం కాలిపోవడంతో కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. సమ్మర్ హాలిడేస్‌లో మహబూబాబాద్ నుంచి HYDలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన లౌలి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News May 26, 2024

వరంగల్: REWIND.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచాడు..!

image

2021లో KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికలో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636ఓట్లు చెల్లలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. రేపు ఈస్థానంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.

News May 26, 2024

జనగామ: నానమ్మ చీర మనవడికి ఉరితాడు

image

జనగామ మండలం గానుగపహాడ్‌కి చెందిన ఆంజనేయులు-అనిత దంపతులకు సంపత్(11), గణేశ్ అనే ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో ఆంజనేయులు తన భార్యతో కలిసి HYDకు పనికోసం వెళ్లారు. ఈ క్రమంలో కొడుకులిద్దరినీ స్వగ్రామంలోనే వాళ్ళ నానమ్మ వద్దనే వదిలి వెళ్లారు. దీంతో సంపత్ బాత్ రూంలో సరదాగా అడుకుంటుండగా నానమ్మకు సపోర్ట్‌గా ఏర్పాటు చేసిన చీర ప్రమాదవశాత్తు సంపత్ మెడకు చుట్టుకోవడంతో మృతి చెందాడు.

News May 26, 2024

రేపు వరంగల్ జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

ఈనెల 27న జరిగే వరంగల్‌–నల్గొండ–ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు వరంగల్ సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈనెల 27న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

News May 26, 2024

వరంగల్ జిల్లాలో 43,812 మంది పట్టభద్రులు

image

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 27న వరంగల్ జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. జిల్లాలో మొత్తం 43 వేల 812 మంది పట్టభద్రుల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.

News May 25, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి TOPNEWS

image

> జిల్లా వ్యాప్తంగా ముగిసిన MLC ఎన్నికల ప్రచారం
> రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఆసిఫాబాద్ MLA
> శాయంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
> WGL- KMM రహదారిపై సైకిల్ ని ఢీ కొట్టిన లారీ
> ఉరివేసుకొని 4వ తరగతి విద్యార్థి సూసైడ్
> వరంగల్లో విత్తన షాపులలో తనిఖీలు
> విద్యుత్ షాక్ తో 8ఏళ్ల బాలికకు గాయాలు
> భూపాలపల్లి కాలేశ్వరం ఆలయానికి పోటెత్తిన భక్తులు

News May 25, 2024

WGL: ఉరి వేసుకొని 4th క్లాస్ విద్యార్థి సూసైడ్

image

జనగామ మండలంలోని గానుగపహడ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సంపత్ (11) నాల్గవ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సంపత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంపత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

WGL: బరిలో 52 మంది..!

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈనెల 27న జరగనుంది. 3 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉ. 8 నుంచి సా. 4 వరకు పోలింగ్ జరగనుంది. బరిలో BRS నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52 మంది బరిలో ఉన్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.

News May 25, 2024

వరంగల్: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు 3 రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రచారం చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రేమేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డిలు వరంగల్ జిల్లాకు చెందిన వారే కాగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న నల్గొండ జిల్లాకు చెందిన వారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో వరంగల్ గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది.

News May 25, 2024

వరంగల్: ‘అమ్మ నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దు’

image

‘అమ్మ నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దు’ అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన ఓ మైనర్ హంటర్ రోడ్డు సమీపంలో 2 మోరీల జంక్షన్ వద్ద రైలు కింద పడి మృతి చెందింది. ఓ బాలికకు వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవ మధ్య ఫోన్ కాల్ ద్వారా బంధం ఏర్పడింది. ఇద్దరూ మైనర్లు కావడంతో ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమనే చర్చ జరుగుతుంది.