India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎనుమాముల మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల కు ఏర్పాటు చేసిన మూడు అంచెల భద్రతను సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్ర బలగాలు మరియు స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న విధులపై సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతోపాటు స్ట్రాంగ్ రూమ్లు మరింత భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు సూచించారు
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి ప్రావీణ్య ఆదేశించారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుపనున్న దృష్ట్యా గురువారం కలెక్టరేట్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై ఎన్నికల సంఘం నిబంధనల కచ్చితంగా పాటించాలన్నారు.
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నారావుపేట మండలం మగ్దుంపురంలో చోటుచేసుకుంది. మగ్దుంపురం గ్రామానికి చెందిన తోట రాజు(40)కు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. భార్య భర్తల మధ్య గొడవతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రాకపోవడం, మద్యానికి బానిసైన రాజు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. ‘ నేను మీటింగ్లో ఉన్నాను. నాకు డబ్బులు కావాలంటూ’ కలెక్టర్ ఐడీతో మేసేజ్ వచ్చింది. ఇది గమనించిన కలెక్టర్ తక్షణమే పోలీసులకు ఫిర్యాదుచేశారు. తన పేరుతో వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని ఆమె ప్రజలకు సూచించారు
వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు FACEBOOKలో నకిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. కలెక్టర్ పేరుతో ఉన్న ఐడీ ద్వారా.. తాను మీటింగ్లో ఉన్నానని, అర్జెంట్గా డబ్బులు కావాలంటూ +94776414080 నుంచి మేసేజ్ వచ్చింది. డబ్బులు ఫోన్పే చేసి, స్క్రీన్షాట్ షేర్ చేయాలని సందేశంలో ఉంది. వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.18,200 ధర, ఏసీ తేజ మిర్చి రూ.20,000 ధర పలికింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. టమాటా రకం మిర్చి ఏసీ క్వింటాకు రూ.30 వేల ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నికల ప్రచార గడువు శనివారంతో ముగియనుంది. దీంతో BRS, BJP, INC పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అన్ని పార్టీల్లోని రాష్ట్ర స్థాయి నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ఎన్నికకు సోమవారం పోలింగ్ జరగనుంది. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
నిన్న ఎండ తీవ్రత నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల మార్కెట్ బంద్ ఉండగా.. ఈరోజు ప్రారంభమవడంతో నేడు పత్తి తరలివచ్చింది. గత రెండు రోజులతో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,040, మంగళవారం రూ.7,070 పలికాయి. ఈరోజు మరింత పెరిగి రూ.7,210 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
మూడో లైను పనుల కారణంగా ఈ నెల 27 నుంచి వచ్చే నెల 30 వరకు పలు రైళ్లను రద్దు చేశారు. 07462/63 వరంగల్- సికింద్రాబాద్ పుష్పల్ రైలు, 17035/36 కాజీపేట- బల్లార్షా, 07766/65 కరీంనగర్ -సిర్పూర్ టౌన్, 07894 కరీంనగర్- బోధన్ రైళ్లను వచ్చే నెల 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.
వరంగల్ ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు పొందుటకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ జుమ్లానాయక్ తెలిపారు. వచ్చే నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రాధాన్య క్రమంలో ట్రేడ్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. 14 ఏళ్ల వయసు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలన్నారు. అభ్యర్థులు వాడుకలో ఉన్న ఫోన్ నంబరును అందజేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.