Warangal

News May 23, 2024

భూపాలపల్లి, ములుగు మీదుగా రైల్వే లైను 207.80 కి.మీ

image

రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.

News May 23, 2024

ఎంతమందికి స్కూటీలు, తులం బంగారం ఇచ్చారో చెప్పాలి: KTR

image

కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే మహిళలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని అన్నారు. ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.

News May 22, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో TODAY హైలెట్స్

image

> WGL, HNK, NSPTలో MLC సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
> సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు
> స్ట్రాంగ్ రూములను పరిశీలించిన HNK, WGL జిల్లాల కలెక్టర్లు
> జనగామలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం
> మేడిగడ్డను సందర్శించిన పూణే సైంటిస్ట్ బృందం
> WGL: రోడ్డు ప్రమాద బాధితున్ని ఆసుపత్రికి తరలించిన KTR
> జిల్లాలో 3 ప్రధాన పార్టీల విస్తృత ప్రచారం
> MGMను సందర్శించిన వరంగల్ జిల్లా కలెక్టర్

News May 22, 2024

WGL: వివాహేతర సంబంధం.. SI సస్పెండ్

image

వివాహేతర సంబంధం వ్యవహారంలో కొమురవెల్లి ఎస్సై నాగరాజును సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళ్తే.. నాగరాజు వేరే మహిళలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో పాటు, నాగరాజు భార్య పీఎస్ ముందు మంగళవారం ధర్నా చేసినట్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. దీంతో ఈ ఘటనపై సిద్దిపేట సీపీ విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమవడంతో అతన్ని సస్పెండ్ చేశారు.

News May 22, 2024

ఎనుమాముల మార్కెట్ యార్డులో ఏర్పాట్ల పరిశీలన

image

ఎనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించనున్న వరంగల్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారదర్శకతతో కూడిన ఏర్పాట్ల విషయంలో ఖచ్చితత్వం పాటించే విధానంలో చేపట్టవలసిన వాటిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద నిర్వహించే విధులపై చర్చించారు.

News May 22, 2024

బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోని అర్హత గల గిరిజన విద్యార్థుల నుంచి 2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం కింద 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జూన్ 6లోగా హన్మకొండలోని అంబేద్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ 12న కలెక్టరేట్లో డ్రా పద్ధతిన విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు.

News May 22, 2024

వరంగల్: పచ్చిరొట్ట విత్తనాల ధరలు ఖరారు

image

పచ్చిరొట్ట విత్తనాల ధరలను ఖరారు చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయశాఖ అధికారులు ఈసారి ముందస్తుగా పచ్చిరొట్ట విత్తనాలు తెప్పించారు. జీలుగు విత్తనాలు 22,000 క్వింటాళ్లు, 450 క్వింటాళ్ల పిల్లిపెసర, 2,300 క్వింటాళ్ల జనుము విత్తనాలను సాగును అనుసరించి మండలాలకు కేటాయించారు. వీటిని 60 శాతం రాయితీపై రైతులకు ఇవ్వనున్నారు.

News May 22, 2024

HNK: ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు

image

KU PSలో ముగ్గురు కానిస్టేబుళ్లతో పాటు ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 11న కానిస్టేబుల్ తాజోద్దిన్ జన్మదిన వేడుకలకు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కరుణాకర్, రమేశ్‌, ఉపాధ్యాయుడు మహేందర్‌రెడ్డి వెళ్లారు. ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులను కించపర్చే విధంగా కానిస్టేబుళ్లు మాట్లాడగా.. సరైంది కాదని రాజేశ్ అన్నారు. కానిస్టేబుళ్లు అతడిని కారులో ఎక్కించుకొని దాడి చేయగా KU PSలో ఫిర్యాదు చేశారు.

News May 22, 2024

జనగామ: భార్య గొంతుపై తొక్కి.. ప్రాణం తీసిన భర్త

image

భార్యను <<13285941>>హత్య <<>>చేసిన ఘటన HYD ఉప్పల్‌ పరిధిలో జరిగింది. CI కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగంపల్లికి చెందిన రమేశ్‌కు సిద్దిపేటకు చెందిన కమలతో వివాహమైంది. వీరు బ్యాంకు కాలనీలో ఉంటున్నారు. రమేశ్‌కు వివాహేతర సంబంధం ఉందనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కమలపై రమేశ్ దాడి చేసే క్రమంలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. అనంతరం ఉప్పల్‌ PSలో లొంగిపోయాడు.

News May 22, 2024

పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ

image

ఈ సెట్-2024 పరీక్ష ఫలితాల్లో వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపల్ డా. బైరి ప్రభాకర్ తెలిపారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో దీక్షిత్, వివేక్, హేమశ్రీ, నాగసాయి, యశ్వంత్, ఎలక్ట్రానిక్స్‌లో నవ్య, వైష్ణవ్, అర్షిత, హర్షిత, హారిక, సొహైల్, తదితర విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు.