India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ 9న జరగనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీపీలు, ఎస్పీ, డీసీపీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
తాడ్వాయి మండలం దామెరవాయి రాక్షసగుహలు సమీపంలోని ఊర చెరువులో ఉపాధిహామీ పనులు చేపట్టారు. చెరువుల మట్టిని తవ్వుతున్న క్రమంలో విలేజ్ అన్వేషకుడు కార్తీక్కు అరుదైన ముద్ర లభించింది. ఈముద్ర ఎరుపు వర్ణంలో 5 రేకులతో కూడిన పువ్వు గుర్తు ఉంది. లభించిన ముద్రను పరిశోధకుడు రత్నాకర్ రెడ్డికి అందజేయగా సుమారు 2500 సం. కాలం నాటిదై ఉండవచ్చని తెలిపారు.
తెలంగాణ EAPCET ఫలితాల్లో హనుమకొండ విద్యార్థిని ప్రతిభ కనబరిచారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేటగిరిలో రెడ్డికాలనీకి చెందిన గడ్డం శ్రీవర్షిణి 145.26 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. కాగా శ్రీవర్షిణి హనుమకొండలో పదో తరగతి, హైదరాబాద్లో ఇంటర్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమెను కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పాత మగ్దుంపురం శివారు వ్యవసాయ భూముల్లోని పిల్ల కాలువలో మొసలి ప్రత్యక్షమైంది. ఆ మొసలిని స్థానికులు చూసి భయాందోళన చెందారు. ఈ కాలువకు సమీపంలో కొన్ని ఇళ్లు ఉండటంతో స్థానికులు, రైతులు భయపడుతున్నారు. మొసలిని మరో చోటకు వెళ్లేలా చూడాలని అటవీ శాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి మే 27న పోలింగ్ జరగనుంది. రాకేశ్ రెడ్డి (BRS), తీన్మార్ మల్లన్న (INC), ప్రేమెందర్ రెడ్డి (BJP)తో పాటు మరో 49 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల వ్యాప్తంగా 1,67,853 మంది ఓటు హక్కు పొందారు. అత్యధికంగా WGL జిల్లాలో 43,594, HNKలో 43,383, MHBD 34,759, జనగామ 23,320, భూపాలపల్లి 12,460, ములుగులో అతి తక్కువగా 10,237 మంది ఓటర్లు ఉన్నారు.
విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లాకి చెందిన రాఘవేంద్ర (23) శంభునిపేట విశ్వనాథ రాఘవేంద్ర కాలనీలో ఉంటున్న అత్తగారింటికి వచ్చాడు. సాయంత్రం కురిసిన వర్షానికి తడిసి ఇంటికి వచ్చిన ఆయన గుడిసెలోకి వెళ్తున్న క్రమంలో ఫ్యాన్కు చేయి తగిలింది. దీంతో కరెంట్ షాక్కి గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని MGMకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. సగటున 49 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా WGLలో 85.4 మి.మీ, వర్ధన్నపేటలో 84.2 మి.మీ, రాయపర్తిలో 73.6, అత్యల్పంగా నర్సంపేటలో 17.4 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రకాళి ఆలయం రోడ్డులో 50-60 ఏళ్ల క్రితం నాటి రావి చెట్టు నేలకూలింది. చేతికొచ్చిన పంట నేలకొరిగింది. ధాన్యం గింజలు రాలిపోయాయి. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు రేపు, ఎల్లుండి సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు వారాంతపు యార్డు బంద్, ఎల్లుండి (ఆదివారం) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు విషయాన్నీ గమనించి ఈ రెండు రోజులు మార్కెట్కు సరుకులు తీసుకుని రావద్దని సూచించారు.
పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నినిస్తారని, ఇప్పటివరకు నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్పై మల్లన్న ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రభుత్వాన్ని, ప్రశ్నించే వ్యక్తి కావాల ప్రశ్నించలేని వ్యక్తి కావాలా ఆలోచించాలన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు.
నర్సంపేటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఎంపీసీ, బైపిసి కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతున్నారు. పదో తరగతి పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 23న నర్సంపేటలోని కళాశాలలో జరిగే కౌన్సిలింగ్కు హాజరు కావాలని ప్రాంతీయ సమన్వయ అధికారి వెంకన్న తెలిపారు.
Sorry, no posts matched your criteria.