Warangal

News May 22, 2024

తొర్రూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

MHBD జిల్లా తొర్రూరు మండలం పత్తేపురం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై జగదీశ్ వివరాల మేరకు.. నర్సింహులపేట మండల పరిధి పత్ని తండాకు చెందిన బానోత్ భరత్(19), అతడి బావ గుగులోత్ రఘు బైకుపై HYD నుంచి తన గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో పత్తేపురం క్రాస్ రోడ్డు వద్ద వీరి బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 22, 2024

వరంగల్: ECE విభాగంలో నవ్యశ్రీకి ఫస్ట్ ర్యాంకు

image

WGL ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థిని M.నవ్యశ్రీ ఈసెట్‌ ఫలితాల్లో సత్తా చాటింది. ECE విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట్‌కు చెందిన నవ్యశ్రీ WGL ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసింది. ఈసెట్‌‌లో ECE విభాగంలో 200 మార్కులకు 146 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, ఇంటిగ్రెటేడ్‌లో 14వ ర్యాంకు సాధించింది.

News May 22, 2024

వనరులను కాపాడటానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది: బల్దియా కమిషనర్

image

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో సీడీఎంఏ ఆధ్వర్యంలో “లేక్ ప్రొటెక్షన్ అండ్ రెజువినేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్” అనే అంశంపై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ వర్క్ షాప్‌లో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి వనరులను కాపాడటానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించిందన్నారు.

News May 21, 2024

కేయూ ఇన్‌ఛార్జి వీసీ వాకాటి కరుణ ప్రస్థానం

image

కేయూ ఇన్‌ఛార్జి వీసీగా నియమితులైన సీనియర్ IAS అధికారి వాకాటి కరుణ ఒంగోలులో తొలి పోస్టింగ్ రావడంతో 3 నెలల పాటు విధులు నిర్వర్తించారు. అనంతరం WGL కలెక్టర్‌‌గా పని చేయడంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం మహిళా, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల విభాగంలో ప్రభుత్వ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న కరుణకు కేయూ వీసీగా సర్కార్ అదనపు బాధ్యతలు అప్పగించింది.

News May 21, 2024

BREAKING.. WGL: ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మార్కెట్ సమీపంలో గల ముసలమ్మకుంట చెరువులో ఈతకు వెళ్లి విజయ్, ఆదామ్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను దేశాయిపేటకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 21, 2024

కేయూ ఇన్‌‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ

image

కాకతీయ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను ప్రభుత్వం నియమించింది. కేయూలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఉన్న వీసీ తాటికొండ రమేశ్‌పై ప్రభుత్వం ఎంక్వయిరీకి ఆదేశించిన విషయం తెలిసిందే.

News May 21, 2024

వరంగల్: నేటి మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.19,200 ధర, ఏసీ తేజ మిర్చి రూ.20,000 ధర పలికింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి రూ.18, 000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,700 ధర వచ్చింది. టమాటా రకం మిర్చి ఏసీ క్వింటాకు రూ.30 వేల ధర పలికింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు భారీగా పెరిగాయి.

News May 21, 2024

హనుమకొండ: షార్ట్ సర్క్యూట్‌తో ఒకరు మృతి

image

షార్ట్ సర్క్యూట్‌తో ఒకరు మృతిచెందిన ఘటన హనుమకొండలోని సుబేదారిలో జరిగింది. సుబేదారీ ఎన్ఐటి జిమ్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. రాము, విష్ణు, సందీప్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News May 21, 2024

జనగామ: రోడ్డు ప్రమాదంలో తోబుట్టువులు మృతి

image

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బ్రదర్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరానికి చెందిన మేటీ రాములు- రాజేశ్వరి దంపతుల కుమారులు శ్రవణ్ (29), శివ (27) హైదరాబాద్‌లోని శుభకార్యానికి వెళ్లారు. వారు బైకుపై ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తున్న క్రమంలో యూటర్న్ తీసుకుంటుండగా.. ఇంతలో వేగంగా వచ్చిన బొలేరో వారి బైకును ఢీ కొంది. ఆ దీంతో బ్రదర్స్ అక్కడికక్కడే చనిపోయారు.

News May 21, 2024

REWIND: వరంగల్‌లో స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్

image

WGL లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. 1 చోట బీఆర్ఎస్ విజయం సాధించింది. ఓవరాల్‌గా కాంగ్రెస్ 1,58,715 ఓట్ల మెజార్టీ సాధించగా.. బీఆర్ఎస్ 7,779 సాధించింది. కొన్నిచోట్ల మినహా చాలా చోట్ల బీజేపీ 3 స్థానానికి పరిమితమైంది. ప్రస్తుత ఓటింగ్ కలిసోస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే.. బీఆర్ఎస్, బీజేపీ మాత్రం రాజకీయ సమీకరణాలు మారాయని అంటున్నాయి.
– దీనిపై మీ కామెంట్