Warangal

News May 20, 2024

గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నా: మల్లన్న

image

తనపై ఎన్ని కేసులు పెట్టినా గత పది సంవత్సరాలుగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మల్లన్న పాల్గొన్నారు. తనని ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని మల్లన్న హామీ ఇచ్చారు.

News May 20, 2024

వరంగల్ నగరంలో బుల్లితెర నటి నవీన సందడి

image

ప్రముఖ బుల్లితెర నటి నవీన (సుమంగళి) ఈరోజు వరంగల్ నగరంలో సందడి చేశారు. వరంగల్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన వేయిస్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి గుడిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయాల్లో దేవుళ్లను దర్శించుకుని, పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఊహలు గుస గుస లాడే, గువ్వ గోరింక, చెల్లెలి కాపురం వంటి సీరియల్స్‌లో నటిస్తున్నట్లు ఆమె తెలిపారు.

News May 20, 2024

వరంగల్: పట్టు దక్కేది ఎవరికో..

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…

News May 20, 2024

హన్మకొండలో తీన్మార్ మల్లన్న సుడిగాలి పర్యటన

image

ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హన్మకొండలోని ఆర్ట్స్&సైన్స్ కాలేజ్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్, కేయూ గ్రౌండ్&కేయూ కామన్ మెస్, స్టడీ రూమ్‌లలో మార్నింగ్ వాక్ ద్వారా విస్తృతంగా పర్యటించారు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్, సుధాకర్ తదితరులున్నారు.

News May 20, 2024

వరంగల్: నేటి పత్తి ధర వివరాలు

image

2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు పునః ప్రారంభం కాగా మార్కెట్ కు పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే ఈరోజు పెరిగింది. గతవారం రూ.6700 పలికిన పత్తి ధర.. ఈరోజు రూ.7040కి పెరిగింది. ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆశిస్తున్నారు.

News May 20, 2024

మేడారం: రెండు రోజులు సమ్మక్క- సారాలమ్మ దర్శనాలు నిలిపివేత

image

తమ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేయనున్నారు. ఆదివారం గద్దెల వద్ద పూజారులు, వాటాదారులు సమావేశం నిర్వహించారు. వరంగల్‌లో తమకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే 2రోజులు దర్శనాల నిలిపివేతకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

News May 20, 2024

WGL: అప్పుడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు

image

KMM-WGL-NLG MLC స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మల్లన్న (INC), రాకేశ్ రెడ్డి (BRS), ప్రేమేందర్ రెడ్డి (BJP) పోటీ చేస్తున్నారు. అయితే ముగ్గురు గతంలో BJPలో ఉన్నవారే. తీన్మార్ మల్లన్న 2021లో BJPలో చేరి, తిరిగి 2023లో హస్తం గూటికి చేరారు. ప్రేమేందర్ రెడ్డి BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాకేశ్ రెడ్డి 2013లో BJPలో చేరి BJYMలో అనేక పదవులు చేపట్టారు. ఈ ఏడాదే BRS పార్టీలో చేరారు.

News May 20, 2024

WGL: ఆస్తి కోసం తాతను చంపిన మనవళ్లు!

image

ఆస్తి తగాదాల్లో తాతను మనవళ్లు హత్యచేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో జరిగింది. హసన్‌పర్తికి చెందిన జల్లి సారయ్య (80)తో అతని మనవళ్లు సాయికృష్ణ, శశికుమార్ పలుమార్లు ఆస్తి విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే వారిద్దరు సారయ్యపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వాకింగ్ స్టాండ్‌తో సారయ్య తలపై బలంగా కొట్టగా.. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 20, 2024

WGL: నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఈ పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించగా ఈసారి ఆన్లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు. డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు సైతం పరీక్ష రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,949 మంది హాజరుకానున్నారు.

News May 20, 2024

REWIND: ఓడిపోయిన అరూరి రమేశ్!

image

అరూరి రమేశ్ వరంగల్ లోక్‌సభ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 87,238 ఓట్లు సాధించి ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అరూరి ఈ లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– దీనిపై మీ కామెంట్?