India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ 4న కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు అన్నారు. ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో నమోదు చేయాలని సూచించారు.
HNK జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబీకుల వివరాలు.. ధర్మసాగర్ మండలం ములకలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు(45) క్వారీలో గ్రానైట్ కట్టర్గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుంటున్న సమయంలో కిందపడటంతో కాలికి దెబ్బ తగిలింది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్ సూది ఇవ్వగానే తమ తండ్రి ప్రాణం విడిచాడని, డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయారని వెంకటేశ్వర్లు కొడుకు ఆరోపించారు.
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి 1 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయంలో నిర్వహించనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, దీక్షాపరులు లక్షల సంఖ్యలో తరలిరానున్నందున ఆర్జిత సేవలు రద్దు చేశారు. కాగా, జయంతికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ తెలిపారు.
భూపాలపల్లి జిల్లా <<13326459>>మొగుళ్లపల్లి మండలంలో విషాదం<<>> నెలకొంది. గ్రామస్థుల ప్రకారం.. చిట్యాల మండలం వెంకట్రావుపల్లి(సీ) గ్రామానికి చెందిన రామలక్ష్మి(60) పిడిసిల్లలోని పెద్ద కూతురు ఇంటికి వెళ్లింది. రోజూలానే ఆరేసిన బట్టలను తీయడానికి వెళ్లి దండేన్ని తాకగానే కరెంట్ షాక్కు గురయింది. గమనించిన మనవడు సాయిచరణ్(15) ఆమెను కాపాడేందుకు వెళ్లగా కరెంట్ షాక్కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రేమ పేరిట మైనర్ను నమ్మించి ఓ యువకుడు గర్భవతిని చేసిన ఘటన జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలికను ప్రకాష్ అనే యువకుడు నమ్మించి మోసం చేశాడు. దీంతో మైనర్పై జరిగిన లైంగిక దాడిలో గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,200 పలకగా నేడు రూ.75 పెరిగి రూ.7275 ధర అయింది. అయితే గతవారంతో పోలిస్తే పత్తి ధరలు భారీగా పడిపోవడంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరలు పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు.
* జనగామ జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం. 2021లోనూ జనగామనే టాప్.
* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికల కంటే స్వల్పంగా పెరిగిన ఓటింగ్ శాతం.
* పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన MLC అభ్యర్థులు.
* సాయంత్రం 6గంటల వరకూ కొనసాగిన పోలింగ్.
* ఓటు హక్కును వినియోగించుకున్న ఉమ్మడి జిల్లా కలెక్టర్లు.
* భారీ బందోబస్తులో బ్యాలెట్ పెట్టెలను నల్గొండకు తరలింపు.
గుండెపోటుతో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మృతి చెందిన ఘటన MHBD జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తొర్రూరు మండలానికి చెందిన రాపోలు ప్రభాకర్ దేవరుప్పుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఇంట్లో ఉన్న సమయంలో సోమవారం తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు సోమవారం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. 2021లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76.82 శాతం పోలింగి నమోదయితే నిన్న జరిగిన ఎన్నికల్లో 72.66 శాతం అంటే.. 4.16% తక్కువ నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,68,727 మంది ఓటర్లు ఉండగా.. నిన్న సాయంత్రం వరకు 1,21,230 మంది ఓటేశారు. పలు చోట్ల సా.6గంటల వరకూ పోలింగ్ జరిగింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి సోమవారం పసుపు, మక్కలు బిల్టీ తరలివచ్చింది. క్వింటా పసుపుకి రూ.14,743 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే మక్కలు బిల్టీ రూ.2,335 ధర పలికాయి. కాగా గత వారంతో పోలిస్తే పసుపు ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో సరకులకు ఉన్న డిమాండ్ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలుపుతున్నారు.
Sorry, no posts matched your criteria.