Warangal

News May 13, 2024

వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (24.18%)

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-26.00%, స్టే.ఘ-30.40%, పాలకుర్తి-27.20%, పరకాల-27.56%, వర్దన్నపేట-22.50%, వరంగల్ ఈస్ట్-18.50%, వరంగల్ వెస్ట్-18.24శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

WGL-HYD జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

WGL-HYD జాతీయ రహదారి.. రఘునాథపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని టిఫిన్ చేస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 13, 2024

ఉమ్మడి వరంగల్‌లో ఈ గ్రామాలు SPECIAL

image

ఉమ్మడి WGLలోని ఈ గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాజేడు మండలం బొల్లారానికి చెందిన 219 మంది దాదాపు 6కి.మీ దూరంలోని ఆర్.గుంటపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటేస్తున్నారు. వెంకటాపురం మం.లోని పెంకవాగు, కలిపాక, కొత్తగుంపు గ్రామాల్లోని 433 మంది 6-7 కి.మీ దూరంలోని ఆలుబాక వెళ్లి ఓటేస్తున్నారు. మంగపేట మం. రేగులగూడెంలోని 150 మంది 4కి.మీ దూరం వెళ్లి తొండ్యాల-లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటేస్తారు.

News May 13, 2024

వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (8.97%)

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-9.00%, స్టే.ఘ-13.00, పాలకుర్తి-10.24%, పరకాల-9.75%, వర్దన్నపేట-8.10%, వరంగల్ ఈస్ట్-6.70%, వరంగల్ వెస్ట్-6.50శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

మహబూబాబాద్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (11.94%)

image

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-12.07%, డోర్నకల్-14.60, మహబూబాబద్-11.65%, ములుగు-11.38, నర్సంపేట-11.20, పినపాక-11.95, ఇల్లందు-11.90శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

WGL: ఓవైపు వర్షం… మరోవైపు పోలింగ్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఓ వైపు వర్షం.. మరోవైపు నేడు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో.. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయి కరెంట్ లేక పలు సమస్యలు తలెత్తాయి. వర్షం నీరు భారీగా నిలిచి ఓటర్లు చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు వర్షం, ఎండల నేపథ్యంలో ఉదయమే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.

News May 13, 2024

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

image

భారత రాజ్యాంగం రూపొందించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరు హైస్కూల్‌లో 258వ బూతులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

News May 13, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనికి వస్తుంది. జిల్లాలోని జనగామ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాబాద్ పరిధిలోకి, మిగిలిన ఏడు నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.

News May 13, 2024

WGL: ఎన్నికలు.. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారు

image

లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి

News May 13, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న ఎర్రబెల్లి దంపతులు

image

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన సతీమణి ఎర్రబెల్లి ఉషాతో కలిసి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎర్రబెల్లి కోరారు.

error: Content is protected !!