Warangal

News May 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి HEADLINES

image

> జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల MLC ఎన్నికలు
> కొత్తగూడ: న్యూమోనియాతో బాలుడు మృతి
> మొగుళ్లపల్లి: పిడిసిల్లలో కరెంటు షాకుతో మనవడు, అమ్మమ్మ మృతి
>కేసముద్రంలో ఓటు వేయకుండా వెనుదిరిగిన పట్టభద్రుడు
>బామ్మర్ది కోసం ఐనవోలుకు మోకాళ్లపై నడిచిన బావ
> 9వ రోజుకు చేరిన మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
>MHBD: అస్వస్థతకు గురైన పోలింగ్ అధికారి
>WGL: ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్

News May 27, 2024

ఉమ్మడి వరంగల్‌లో ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు ఇలా..

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం వరంగల్ -నల్గొండ -ఖమ్మం పట్టభద్రుల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో 70.83%, ములుగు 74.54%, జనగామ 76.28%, భూపాలపల్లి 69.16%, హనుమకొండ 72.16%, మహబూబాబాద్ జిల్లాలో 69.52% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది.

News May 27, 2024

బాసర IIIT ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

image

నిర్మల్ జిల్లా బాసర IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఈమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.
# Share it

News May 27, 2024

భూపాలపల్లి: కరెంట్ షాక్.. అమ్మమ్మ, మనవడు మృతి

image

భూపాలపల్లి జిల్లాలో విషాదం జరిగింది. మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో దుంప సాయిచరణ్(14), అతడి అమ్మమ్మ రామలక్ష్మి (55) కరెంట్ షాకుతో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 27, 2024

వరంగల్ జిల్లా వ్యాప్తంగా 70.83 శాతం పోలింగ్ నమోదు

image

వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా.4 గంటల వరకు 70.83% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు అన్నారు. వరంగల్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది తమ సామగ్రితో జిల్లా కేంద్రానికి బస్సులలో తరలివెళ్ళనున్నారు.

News May 27, 2024

HNK: బావమరిది కోసం మోకాళ్లపై నడిచి మొక్కు తీర్చుకున్న బావ 

image

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తన బావమరిది రజినీకాంత్ కోలుకుంటే మోకాళ్ల మీద ఐనవోలు మల్లికార్జున స్వామి వారి దర్శనానికి నడుచుకుంటూ వస్తానని కమలాపూర్ మండలం  అంబాలకు చెందిన నాగరాజు మొక్కుకున్నారు. ఈ మేరకు రజినీకాంత్ ఆరోగ్యం మెరుగుపడటంతో నాగరాజు మొక్కు తీర్చుకునేందుకు మోకాళ్లపై 70 కి.మీ నడుచుకుంటూ ఐనవోలు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నాగరాజును అభినందిస్తున్నారు.

News May 27, 2024

WGL: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.

News May 27, 2024

వరంగల్: తరలివచ్చిన పత్తి… ఈరోజు ధర ఎంతంటే?

image

రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే గతవారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. నేడు క్వింటా పత్తి ధర రూ.7,200 పలికింది. పత్తి ధర మళ్లీ తగ్గడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. కాగా, మార్కెట్లో క్రయ విక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News May 27, 2024

వరంగల్: ఉ.10 గంటల వరకు పోలింగ్ 13.19% నమోదు

image

వరంగల్ జిల్లాలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో ఉదయం 10:00 గంటల వరకు పోలింగ్ 13.19% అయింది. ఓటర్లు తమ ఓటును సకాలంలో వినియోగించుకోవాలని అధికారులకు కోరుతున్నారు. ఇప్పటివరకు 13 శాతం ఓటింగ్ పోల్ కావడంతో రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లకు ఫోన్ చేసి ఓటు వేసేందుకు మోటివేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అధికారులు కూడా చెబుతున్నారు.

News May 27, 2024

WGL: ప్రధాన అభ్యర్థులు ఓటేసేదిక్కడే..!

image

KMM-WGL-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మం. మాదాపురం ZPHSలో, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి HNKలోని సుబేదారి, హంటర్‌రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో, BRS అభ్యర్థి రాకేష్‌రెడ్డి HNKలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.