Warangal

News May 13, 2024

సింగారం గ్రామంలో మొదలైన ఎన్నికల పోలింగ్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ మొదలైంది. శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ-లైన్లలో వేచి ఉన్నారు. ఎండల నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 13, 2024

వరంగల్ జిల్లాలో 22.3 మి.మీ వర్షపాతం నమోదు

image

వరంగల్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం పడింది. గీసుగొండలో 61.9 మి.మీ, ఖానాపురంలో 61 మి.మీ, వరంగల్‌లో 59.8 మి.మీ, ఖిలా వరంగల్‌లో 43,5 మి.మీ, సంగెంలో 28.8 మి.మీ, దుగ్గొండిలో 25.3 మి.మీ, నర్సంపేటలో 10 మి.మీ వర్షం పడింది. జిల్లావ్యాప్తంగా సరాసరి 22.3 మి.మీ వర్షం కురిసింది. మొత్తంగా 292.3 మి.మీ వర్షం పడినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News May 13, 2024

వరంగల్: పట్టణాల్లో తక్కువ, పల్లెల్లో ఎక్కువ

image

గతేడాది జరిగిన అసెబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి WGL 12 అసెంబ్లీ స్థానాల్లోని WGL తూర్పు, పశ్చిమ మినహా మిగతా 10స్థానాల్లోని చాలా కేంద్రాల్లో 90%పైగా ఓటింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే 1952 నుంచి 2019 వరకు WGL లోక్‌సభ స్థానంలో 2014లో 76.39% అత్యధికంగా 1952లో అత్యల్పంగా 51.03% నమోదయింది. MHBD స్థానంలో 1957లో అత్యల్పంగా(53.82), 2014లో 81.05% ఓటేశారు. పట్టణాల్లో విద్యావంతులున్నా పల్లెల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది.

News May 13, 2024

WGL: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. WGL ఎంపీ స్థానంలో 2019లో 63.70 శాతం పోలింగ్ నమోదవగా మహబూబాబాద్‌లో 69.06 నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

News May 12, 2024

WGL: ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

image

కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్‌లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్‌లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.

News May 12, 2024

MHBD: జిల్లాలో పోలీసులు సీజ్ చేసిన ఐటమ్స్ ఇవే..!

image

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి నేటివరకు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని రూ.870,840 నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా SP సుధీర్ రామ్నాథ్ కెనాన్ తెలిపారు. అలాగే రూ.91,18,107 విలువచేసే మద్యాన్ని సీజ్ చేశామని, రూ.11,04,150ల విలువ చేసే గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో వివిధ వ్యక్తులు 18 తుపాకులను డిపాజిట్ చేశారన్నారు.

News May 12, 2024

WGL: అమ్మను ఆదర్శంగా తీసుకొని.. ఓటు వేద్దాం

image

నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమ, బాధ్యతలోనూ. మన ఓరుగల్లు జిల్లాలో 33,56,832 మంది ఓటర్లున్నారు. -నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.

News May 12, 2024

BREAKING.. జనగామ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్ వద్ద జాతీయ రహదారిపై కారు ఢీకొని లచ్చమ్మ(70) మృతి చెందింది. కాగా, స్టేషన్ ఘన్‌పూర్లో కారు-స్కూటీ ఢీకొని రమేశ్(55) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 12, 2024

వరంగల్: పోలింగ్‌ కేంద్రం లేని పంచాయతీ!

image

ఓటరే నిజమైన నిర్ణేత. కానీ WGL జిల్లా దుగ్గొండి (M) గిర్నిబావిలో పాఠశాల లేదని పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. 2018లో ఏర్పడిన గిర్నిబావి పంచాయతీ.. NSPTకు 10KM దూరంలో ఉంది. ఇక్కడి ఓటర్లను రెండు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించారు. 936 మంది ఓటర్లు ఉండగా.. మందపల్లికి 530, తొగర్రాయికి మరో 406 మంది ఓటర్లను కేటాయించారు. గిర్నిబావిలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

News May 12, 2024

WGL: RTC స్పెషల్ బస్సులపై చార్జీలు పెంపు!

image

HYD నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న స్పెషల్ RTC బస్సుల్లో ప్రయాణానికి RTC ఛార్జీలు 1.25% పెంచినట్లు అధికారులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బస్సుల్లో రద్దీ ఏర్పడింది. వన్ సైడ్ ట్రాఫిక్ అధికంగా ఉందని, తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉప్పల్-తొర్రూరు ఎక్స్‌ప్రెస్ సాధారణంగా రూ.220 కాగా.. స్పెషల్ బస్సులో రూ.250 తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు.

error: Content is protected !!