India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MHBDలో 70.68, WGLలో 68.29శాతం పోలింగ్ నమోదయింది. ఇక అభ్యర్థుల విషయానికొస్తే.. MHBD కంకరబోడు పాఠశాలలో BRS అభ్యర్థి కవిత, మానుకోట పీఏసీఎస్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్, వెంకటాపూర్ మం. మల్లయ్యపల్లిలో BJP అభ్యర్థి సీతారాం నాయక్లు ఓటేశారు. HNK టీచర్స్ కాలనీలో WGL కాంగ్రెస్ అభ్యర్థి కావ్య, KZPT ఫాతిమానగర్లో ఆరూరి రమేశ్, ములక్కనూర్ బాలుర ఉన్నత పాఠశాలలో BRS అభ్యర్థి సుధీర్ కుమార్ ఓటేశారు.
*HNK జిల్లా రహమత్నగర్లో 164 పోలింగ్ కేంద్రంలోని EVM బటన్ను ఓటరు గట్టిగా నొక్కడంతో అది పనిచేయకుండా ఆగిపోయింది.
*పలిమెల మండలం కామన్పల్లిలో EVMలు పనిచేయక మంగళవారం రెండు గంటల తర్వాత పోలింగ్ మొదలైంది.
*రేగొండ మం. రూపిరెడ్డిపల్లిలో EVM మొరాయించడంతో ఉ.7-8 వరకు పోలింగ్ నిలిచిపోయింది.
*వెంకటాపురం మం, సూరవీడులో 56వ పోలింగ్ కేంద్రంలో EVM మొరాయించడంతో 40ని. ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
SHARE IT
వరంగల్తో పోలిస్తే మహబూబాబాద్ లోక్సభ స్థానంలోనే ఎక్కువ శాతం పోలింగ్ నమోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,56,832 మంది ఓటర్లు ఉండగా.. MHBDలో 70.68, WGLలో 68.29శాతం నమోదయింది. అయితే వరంగల్ లోక్సభ స్థానం విషయానికొస్తే తక్కువ శాతం నమోదైనప్పటికీ ప్రతి రెండు గంటలకూ పెరుగుతూ వచ్చింది. 9గంటలకు 8.97, 11గం. 24.48, ఒంటి గంటకు 41.23, 3గం. 54.17, 5-9గంటల వరకు 67.49 శాతం నమోదయింది.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం: 67.49%.
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పోలింగ్ శాతం వివరాలు:
స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 78.54%,
పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో 71.35%,
పరకాల అసెంబ్లీ సెగ్మెంట్ 72%,
WGL పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ 50.27%, WGL తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లో 63.5%, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లో 71.4%, భూపాలపల్లి 67.68%.
ఉత్సాహంగా ఓటు వేయడానికి వచ్చిన మహిళ ఓటు వేసిన అనంతరం మృతి చెందిన విషాద ఘటన చేర్యాలలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చేర్యాల మండల కేంద్రంలోని పెద్దమ్మ గడ్డ బాలుర పాఠశాలలో.. పట్టణానికి చెందిన సరోజన(75) ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటికి రాగానే గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి మంగళవారం ప్రత్యేక సాధారణ సెలవుగా జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రకటించారు. బుధవారం యథావిధిగా విధులకు హాజరు కావాలని కోరారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-65.00%, స్టే.ఘ-74.64%, పాలకుర్తి- 68.41%, పరకాల-70.20%, వర్ధన్నపేట-66.43%, వరంగల్ ఈస్ట్-59.43%, వరంగల్ వెస్ట్-47.00%గా ఉన్నాయి.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-64.72%, డోర్నకల్-70.86%, మహబూబాబాద్-67.19%, ములుగు-67.92%, నర్సంపేట-73.01%, పినపాక-65.91%, ఇల్లందు-69.11%గా ఉన్నాయి.
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. మరో గంటలో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
– SHARE IT
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-60.58%, డోర్నకల్-64.51%, మహబూబాబాద్-58.71%, ములుగు-61.23%, నర్సంపేట-62.30%, పినపాక-60.68%, ఇల్లందు-61.40%గా ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.