Warangal

News July 6, 2024

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కొండా సురేఖ

image

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు మంత్రులు కాసేపు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రులు సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News July 6, 2024

శిథిలావస్థకు చేరిన సర్వాయి పాపన్న కోట గోడలు!

image

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో సర్ధార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోటతో పాటు గోడలు శిథిలావస్థకు చేరి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన కోటను సంరక్షించేందుకు గతంలో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వానలకు కోట గోడలు శిథిలమై కూలుతున్నాయి. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న కోటకు అధికారులు మరమ్మతులు చేపట్టి సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

News July 6, 2024

వరంగల్: ముందే మేల్కొనకపోతే ప్రమాదం తప్పదు!

image

గ్రేటర్ వరంగల్ పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. వానాకాలం నేపథ్యంలో అలాంటి పురాతన భవనాలు, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. మున్సిపాలిటీ అధికారులు సకాలంలో స్పందించి ఆయా భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం చేయకపోతే గతం మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.

News July 6, 2024

UPDATE: దంతాలపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

MHBD జిల్లా దంతాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొని <<13573092>>ముగ్గురు వ్యక్తులు మృతి<<>> చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో మల్లేశ్, నరేశ్, కుమార్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందిస్తున్నారు. వీరు తొర్రూరు మండలం వెలికట్ట నుంచి ఆటోలో బీరిశెట్టిగూడెనికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.కి.మీ అయితే ఇంటికి చేరుకునే వారని స్థానికులు చెప్పారు.

News July 5, 2024

MHBD: కారు, ఆటో ఢీ.. ముగ్గురి మృతి

image

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంతాలపల్లి మండలం చారి తండా శివారులో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

వరంగల్: ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

image

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసిన సైబర్‌ నేరస్థుడిని వరంగల్‌ సైబర్‌ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతణ్నుంచి సుమారు రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లాకి చెందిన పొనగంటి సాయితేజ(28) MBA చేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో 2 తెలుగురాష్ట్రాల్లో సుమారు రూ.35 మంది నుంచి రూ.45 లక్షలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

News July 5, 2024

HNK: అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ మంత్రి సమీక్షా సమావేశం

image

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, తదితర అంశాలను సమావేశంలో జిల్లా కలెక్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించారు.

News July 5, 2024

BHPL: జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

image

భూపాలపల్లి జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీవోల సీనియారిటీ జాబితా అందజేయాలని జడ్పీ సీఈఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2024

KU ఎస్సై కుమారుడికి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‌లో చోటు

image

కేయూసీ పీఎస్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న దేవేందర్‌- స్వప్న దంపతుల కుమారుడు అక్షిత్‌ 6వ తరగతి చదువుతున్నాడు. అతి పిన్న వయస్సులోనే ప్రపంచ దేశాలకు సంబంధించిన రాజధానులతో పాటు ఆ దేశ కరేన్సీలను చూడకుండా ధారళంగా చెప్పాడు. ప్రతిభను గుర్తించిన తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ గుర్తింపు పత్రాన్ని జారీ చేశారు. శుక్రవారం ఈ పత్రాన్ని వరంగల్‌ సీపీ అంబర్ కిశోర్ ఝా తన చేతుల మీదుగా అక్షిత్‌కు అందజేశారు.

News July 5, 2024

మరో మైలురాయికి చేరువగా జనగామ ప్రభుత్వ డిగ్రీ కళాశాల!

image

జనగామ ఆంధ్ర భాషాభివర్ధిని (ABV) ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో మైలు రాయిని చేరుకోబోతోంది. జిల్లాలో ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఉన్న ఈ కాలేజీకి ఈ విద్యా సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి హోదా వస్తుందని ఆశిస్తున్నారు. UGC నిబంధనలను అనుసరించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతిపాదనలను UGCకి, కేయూ రిజిస్ట్రారు, కళాశాల అభివృద్ధి కమిటీ డీన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది.