Warangal

News August 29, 2024

నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి అడ్మిషన్

image

నర్సంపేట పట్టణంలో ఈ ఏడాది ప్రారంభమైన ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి అడ్మిషన్‌ను రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శుభోధ్ శర్మ తీసుకున్నారు. కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థికి జాయినింగ్ లెటర్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ గురువారం అందజేశారు. ఎంబీబీఎస్‌లో 50 సీట్లతో ఈ ఏడాది తరగతులను నిర్వహించనున్నారు. విభాగాధిపతులు పరశురాం, గిరిధర్, దామోదరి, శ్రీదేవి, కేశవ్, తదితరులున్నారు.

News August 29, 2024

శిక్షణ సమయంలోనే పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలి: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనర్ మడికొండలోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ముందుగా ట్రైనీ కానిస్టేబుళ్లకు పోలీస్ చట్టాలను బోధించే తరగతి గదులను సందర్శించారు. శిక్షణ సమయంలోనే పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలని సీపీ సూచించారు. బోధనకు సంబంధించి ప్రతి అంశంపై పట్టు ఉండాలని, తద్వారా విధులు నిర్వహించే సమయంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించవచ్చని తెలిపారు.

News August 29, 2024

వరంగల్ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మళ్లీ వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అమావాస్య నేపథ్యంలో మార్కెట్‌ను మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు గమనించి మూడు రోజులు సరకులు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News August 29, 2024

వరంగల్ మార్కెట్లో చిరు ధాన్యాల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.5,910 పలకగా పచ్చి పల్లికాయ ధర రూ.3500 పలికింది. మరోవైపు పసుపు కి రూ.11,885 ధర రాగా, 5531 రకం మిర్చికి నిన్న రూ.13,500, టమాటా రకం మిర్చికి రూ.19 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News August 29, 2024

వరంగల్ సీపీకి హైకోర్టు షోకాజ్ నోటీసులు

image

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు హైకోర్టు షోకాజు నోటీసులు పంపించింది. యాదాద్రి అనే వ్యక్తి వరంగల్ కమిషనరేట్‌లో పని చేసి ఉద్యోగ విరమణ పొంది, పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పింఛను ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని అతడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో సీపీ లేదా ఆయన తరఫు న్యాయవాది సెప్టెంబర్ 6న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

News August 29, 2024

వరంగల్: మక్కలు క్వింటా రూ.2,936 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌లో మళ్లీ రికార్డు నమోదైంది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈరోజు మక్కలకు రికార్డు ధర వచ్చింది. నేడు క్వింటా మక్కలకు రూ.2,936 ధర వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా మంగళవారం రూ.2,885 పలికిన క్వింటా మక్కలకు బుధవారం రూ.2,911 ధర వచ్చింది. 

News August 29, 2024

వరంగల్ మార్కెట్లో క్రమంగా తగ్గుతున్న పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మళ్ళీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ. 7,600 పలకగా.. బుధవారం రూ.7,560 పలికింది. నేడు రూ. 5 తగ్గి రూ.7,555కి చేరినట్లు అధికారులు తెలిపారు. పత్తి ధరలు మళ్ళీ తగ్గుతుండడంతో రైతులు తీవ్రనిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా చూడాలని కోరుతున్నారు.

News August 29, 2024

భూపాలపల్లి: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం

image

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో యూనియన్ నాయకులు, సింగరేణి కార్మికులు ఆదర్శ వివాహం జరిపించారు. కృష్ణ కాలనీకి చెందిన శృతి అనే సింగరేణి ఉద్యోగినితో మంచిర్యాలకు చెందిన సందీప్‌తో వివాహం జరిపించారు. శృతి వివాహం గురించి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఏఐటీయూసీ యూనియన్ నాయకులు దగ్గరుండి పెళ్లి జరిపించారు. కాగా, సింగరేణి ఉద్యోగి చంద్రమౌళి-లక్ష్మీ కన్యాదానం చేశారు.

News August 29, 2024

వరంగల్ MGMలో కనీస వసతులు కరవు

image

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు, వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్‌లోని క్యాజువాలిటిలో ఫ్లూయిడ్ స్టాండ్లు, స్ట్రెచ్చర్లు లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఈరోజు ఇబ్బంది పడ్డారు. రోగులను కుర్చీలో కూర్చోబెట్టి అటెండెంట్ చేతికి సెలైన్ బాటిల్ ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. దీనిపై రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News August 28, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> MLG: మొదటి అడ్మిషన్ తీసుకున్న రాజస్థాన్ విద్యార్థి
> WGL: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్
> WGL: మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర
> BHPL: జాతీయ రహదారి పనులకు శ్రీకారం
>HNK: 1న సబ్ జూనియర్స్ ఖోఖో ఎంపికలు
> WGL: హైదరాబాద్ తరహా.. వరంగల్‌లో వాడ్రా ?
>NSPT: గిరిజన కుటుంబానికి కేటీఆర్ ఆర్ధిక సహాయం
> MLG: కానిస్టేబుల్‌ను పరామర్శించిన గవర్నర్