India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొత్త చట్టాలపై WGL సీపీ అంబర్ కిషోర్ ఝూ కీలక అంశాలను వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నూతన చట్టంలో మహిళలు, బాలలపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. బాధితులు చేసిన ఫిర్యాదుల వివరాలను ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చని తెలిపారు. బాధితులు అత్యవసరంగా సంబంధిత ఠాణా నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, విచారించిన తర్వాత కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చిల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) 600 మెగావాట్ల ప్లాంట్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వరకు 200 రోజులుగా నిరంతరాయంగా విద్యుత్ అందించిన 600 మెగావాట్ల ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్లాంటుగా కేటీపీపీని గుర్తించడంపై ప్లాంట్ లో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు భారీగా బదిలీ అయ్యారు. 9 మంది ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఎస్ఐ లను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఆత్మకూర్లో పని చేస్తున్న సీఐ క్రాంతి కుమార్ను పరకాలకు బదిలీ చేశారు. కమాండ్ కంట్రోల్ అటాచ్డ్గా ఉన్న సంతోశ్ను ఆత్మకూరు సీఐగా బదిలీ చేశారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సెక్రటేరియట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, సీజీఎఫ్ నిధులు, బోనాల ఉత్సవాలకు నిధుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కొత్త చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వరంగల్ పొలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ న్యాయచట్టాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ముమ్మర ప్రచారం చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు. నూతన క్రిమినల్ న్యాయ చట్టాలతో రూపొందించిన క్రిమినల్ మేజర్ యాక్ట్స్ పుస్తకాలను పోలీస్స్టేషన్లకు పంపిణీ చేసే పుస్తకాలను రిలీజ్ చేశారు.

తాను కాంగ్రెస్లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ డా.బండా ప్రకాశ్ తెలిపారు. తాను BRS పార్టీని వీడటం లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తాను హైదరాబాద్ వెళ్లనన్నారు. కానీ సీఎం రేవంత్రెడ్డిని కలవలేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో పాతది అయి ఉండొచ్చని ఆయన తెలిపారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలికింది. అలాగే ఏసీ 341 రకం మిర్చి రూ.16,500, వండర్ హాట్(WH) మిర్చికి రూ.18,500 ధర వచ్చింది. కాగా తేజ మిర్చి నిన్నటితో పోలిస్తే రూ.500, 341 మిర్చి రూ.500 తగ్గాయి. వండర్ హాట్ మిర్చి నిన్న రూ.16,000 పలకగా రూ.2,500 పెరిగి 18,500 పలికింది.

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తిధరలు నిలకడ కోల్పోతున్నాయి. నిన్న సోమవారం 7, 160 పత్తికి ధర పలకగా ఈరోజు (మంగళవారం) స్వల్పంగా పది రూపాయలు పెరిగి రూ.7,170 ధర పలికింది. మద్దతు ధర కంటే మార్కెట్లో పత్తికి ధర తక్కువ పలుకుతుండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పత్తి ధరలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలల్లో హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులకు పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లుగా పనిచేయడానికి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ సమన్వయ అధికారి ఎన్.విద్యారాణి తెలిపారు. పీజీలో సంబంధిత సబ్జెక్టుతో పాటు బీఈడీ ఉన్న అభ్యర్థులు హన్మకొండలోని RCO ఆఫీస్లో ఈనెల 3లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 4న డెమో ఉంటుందన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు ఏఎస్పీలు బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్ బాబాసాహెబ్ ములుగు ఓఎస్డీగా బదిలీ అయ్యారు. జనగామ ఏఎస్పీ అంకిత్ కుమార్ శంకవార్ భద్రాచలంకు, గ్రేహౌండ్స్ నుంచి శివమ్ ఉపాధ్యాయ ఏటూరునాగారం ఏఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.