India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివాహేతర సంబంధం వ్యవహారంలో కొమురవెల్లి ఎస్సై నాగరాజును సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళ్తే.. నాగరాజు వేరే మహిళలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో పాటు, నాగరాజు భార్య పీఎస్ ముందు మంగళవారం ధర్నా చేసినట్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. దీంతో ఈ ఘటనపై సిద్దిపేట సీపీ విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమవడంతో అతన్ని సస్పెండ్ చేశారు.
ఎనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించనున్న వరంగల్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారదర్శకతతో కూడిన ఏర్పాట్ల విషయంలో ఖచ్చితత్వం పాటించే విధానంలో చేపట్టవలసిన వాటిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద నిర్వహించే విధులపై చర్చించారు.
వరంగల్ జిల్లాలోని అర్హత గల గిరిజన విద్యార్థుల నుంచి 2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం కింద 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జూన్ 6లోగా హన్మకొండలోని అంబేద్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ 12న కలెక్టరేట్లో డ్రా పద్ధతిన విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు.
పచ్చిరొట్ట విత్తనాల ధరలను ఖరారు చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయశాఖ అధికారులు ఈసారి ముందస్తుగా పచ్చిరొట్ట విత్తనాలు తెప్పించారు. జీలుగు విత్తనాలు 22,000 క్వింటాళ్లు, 450 క్వింటాళ్ల పిల్లిపెసర, 2,300 క్వింటాళ్ల జనుము విత్తనాలను సాగును అనుసరించి మండలాలకు కేటాయించారు. వీటిని 60 శాతం రాయితీపై రైతులకు ఇవ్వనున్నారు.
KU PSలో ముగ్గురు కానిస్టేబుళ్లతో పాటు ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 11న కానిస్టేబుల్ తాజోద్దిన్ జన్మదిన వేడుకలకు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కరుణాకర్, రమేశ్, ఉపాధ్యాయుడు మహేందర్రెడ్డి వెళ్లారు. ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులను కించపర్చే విధంగా కానిస్టేబుళ్లు మాట్లాడగా.. సరైంది కాదని రాజేశ్ అన్నారు. కానిస్టేబుళ్లు అతడిని కారులో ఎక్కించుకొని దాడి చేయగా KU PSలో ఫిర్యాదు చేశారు.
భార్యను <<13285941>>హత్య <<>>చేసిన ఘటన HYD ఉప్పల్ పరిధిలో జరిగింది. CI కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగంపల్లికి చెందిన రమేశ్కు సిద్దిపేటకు చెందిన కమలతో వివాహమైంది. వీరు బ్యాంకు కాలనీలో ఉంటున్నారు. రమేశ్కు వివాహేతర సంబంధం ఉందనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కమలపై రమేశ్ దాడి చేసే క్రమంలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. అనంతరం ఉప్పల్ PSలో లొంగిపోయాడు.
ఈ సెట్-2024 పరీక్ష ఫలితాల్లో వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపల్ డా. బైరి ప్రభాకర్ తెలిపారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో దీక్షిత్, వివేక్, హేమశ్రీ, నాగసాయి, యశ్వంత్, ఎలక్ట్రానిక్స్లో నవ్య, వైష్ణవ్, అర్షిత, హర్షిత, హారిక, సొహైల్, తదితర విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు.
MHBD జిల్లా తొర్రూరు మండలం పత్తేపురం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై జగదీశ్ వివరాల మేరకు.. నర్సింహులపేట మండల పరిధి పత్ని తండాకు చెందిన బానోత్ భరత్(19), అతడి బావ గుగులోత్ రఘు బైకుపై HYD నుంచి తన గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో పత్తేపురం క్రాస్ రోడ్డు వద్ద వీరి బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
WGL ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని M.నవ్యశ్రీ ఈసెట్ ఫలితాల్లో సత్తా చాటింది. ECE విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట్కు చెందిన నవ్యశ్రీ WGL ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసింది. ఈసెట్లో ECE విభాగంలో 200 మార్కులకు 146 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, ఇంటిగ్రెటేడ్లో 14వ ర్యాంకు సాధించింది.
హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో సీడీఎంఏ ఆధ్వర్యంలో “లేక్ ప్రొటెక్షన్ అండ్ రెజువినేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్” అనే అంశంపై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ వర్క్ షాప్లో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి వనరులను కాపాడటానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించిందన్నారు.
Sorry, no posts matched your criteria.