Warangal

News May 9, 2024

కడియంకు రాజకీయ ఉనికి లేకుండా చేయాలి: ఆరూరి

image

కడియం శ్రీహరికి రాజకీయ ఉనికి లేకుండా MP ఎన్నికల్లో ఆయన కూతురు కావ్యను ఒడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వరంగల్ BJP MP అభ్యర్థి ఆరూరి రమేశ్ అన్నారు. ధర్మసాగర్ మండలంలో ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించి, తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. రాజకీయ భవిష్యత్తు కోసం అనేకమంది దళితులను నమ్మించి మోసం చేసిన వ్యక్తి కడియం అన్నారు. ధర్మసాగర్‌లో డిగ్రీ కళాశాల కోసం కృషి చేస్తానన్నారు.

News May 9, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.17,000 పలకగా.. 341 రకం మిర్చి రూ.18 వేల ధర పలికింది. వండర్ హాట్(WH) రకం మిర్చి రూ.14,300.. 5531 రకం మిర్చికి రూ.11 వేల ధర వచ్చింది. అలాగే టమాటో మిర్చికి రూ.31,500 ధర వచ్చింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News May 9, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 41కి చేరిన నామినేషన్లు

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. నిన్న మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా.. నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరింది. ఈరోజు మరికొన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా.. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

News May 9, 2024

మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై బీజేపీ వివక్ష: బండ ప్రకాశ్

image

మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై బీజేపీ పదేళ్లు వివక్ష చూపిందని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. పరకాలలో మీడియాతో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామన్నారు. బీజేపీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవమానించారన్నారు.

News May 9, 2024

10 వరకు పోస్టల్ బ్యాలెట్ల గడువు: వరంగల్ కలెక్టర్ 

image

పోస్టల్ బ్యాలెట్ల గడువును ఈ నెల 10 వరకు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో జారీ చేసిన 12,710 పోస్టల్ బ్యాలెట్లలో ఇప్పటికీ 9,544 బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు  ఈ నెల 10 లోగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News May 9, 2024

మందకృష్ణ మాదిగను కలవడం ఆనందంగా ఉంది: మోదీ

image

వరంగల్ నగరంలో జరిగిన ర్యాలీలో నా తమ్ముడు మందకృష్ణ మాదిగని కలవడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ అంతటా కాంగ్రెస్ మాదిగ వ్యతిరేక వైఖరిపై చర్చ జరుగుతోందని తెలిపారు. వారు మాదిగ సామాజిక వర్గానికి దక్కాల్సిన అవకాశం, గౌరవం లేకుండా చేశారని, మాదిగ సామాజికవర్గం సంక్షేమం కోసం బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

News May 9, 2024

భూపాలపల్లి: తండ్రి బీట్ ఆఫీసర్.. కుమారుడు IFS 

image

యూపీఎస్సీ బుధవారం ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన పోరిక లవ కుమార్ విజయ కేతనం ఎగరవేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన లవ కుమార్ 2017 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నిన్న విడుదల చేసిన ఫలితాల్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. లవ కుమార్ తండ్రి సూరి దాస్ సైతం అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.

News May 9, 2024

కాజీపేట: ఊయల కట్టిన స్టూల్‌ మీద పడి చిన్నారి మృతి

image

ఊయల కట్టిన స్టూల్‌ మీద పడి చిన్నారి మృతి చెందింది. ఛత్తీస్‌గఢ్‌‌కు చెందిన లోక్‌నాథ్‌ ఖర్ష్‌ తాపీమేస్త్రీ-భారతి దంపతులకు ముగ్గురు పిల్లలు. నాలుగేళ్ల కిందట కుటుంబంతో సహా కాజీపేటకు వలస వచ్చారు. ఆయన భార్య సోమిడిలో నిర్మాణంలో ఉన్న ఇంటి దర్వాజ, ఇనుప స్టూలుకు చీరతో ఊయల కట్టి చిన్నారి రోషిత (6 నెలలు)ను అందులో పడుకోబెట్టింది. స్టూల్‌ అదుపు తప్పడంతో ఊయలలో ఉన్న చిన్నారి కిందపడి గాయాల పాలై చనిపోయింది.

News May 9, 2024

రేపు ఒక్కరోజే వరంగల్ మార్కెట్ ఓపెన్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు(గురువారం) ప్రారంభం కానుంది. నేడు అమావాస్య, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు సెలవు ప్రకటించారు. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. ఉదయం నుంచి మార్కెట్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
గమనిక: శుక్రవారం నుంచి మార్కెట్‌కు వరుసగా 6 రోజులు సెలవులు రానున్నాయి.

News May 8, 2024

రేపు తొర్రూర్‌కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

image

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు తొర్రూరుకు రానున్నారు. బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్‌కి మద్దత్తుగా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఉ.10 గం.లకు జరిగే ఈ సభను విజయవంతం చేయాలని స్థానిక బీజేపీ శ్రేణులు కోరారు. ఇప్పటికే ఆయనకు రాకకు సంబంధించి ఏర్పాట్లు చేశారు.

error: Content is protected !!