India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేయూ ఇన్ఛార్జి వీసీగా నియమితులైన సీనియర్ IAS అధికారి వాకాటి కరుణ ఒంగోలులో తొలి పోస్టింగ్ రావడంతో 3 నెలల పాటు విధులు నిర్వర్తించారు. అనంతరం WGL కలెక్టర్గా పని చేయడంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం మహిళా, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల విభాగంలో ప్రభుత్వ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న కరుణకు కేయూ వీసీగా సర్కార్ అదనపు బాధ్యతలు అప్పగించింది.
వరంగల్ నగరంలోని ఎనుమాముల ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మార్కెట్ సమీపంలో గల ముసలమ్మకుంట చెరువులో ఈతకు వెళ్లి విజయ్, ఆదామ్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను దేశాయిపేటకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను ప్రభుత్వం నియమించింది. కేయూలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఉన్న వీసీ తాటికొండ రమేశ్పై ప్రభుత్వం ఎంక్వయిరీకి ఆదేశించిన విషయం తెలిసిందే.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.19,200 ధర, ఏసీ తేజ మిర్చి రూ.20,000 ధర పలికింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి రూ.18, 000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,700 ధర వచ్చింది. టమాటా రకం మిర్చి ఏసీ క్వింటాకు రూ.30 వేల ధర పలికింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు భారీగా పెరిగాయి.
షార్ట్ సర్క్యూట్తో ఒకరు మృతిచెందిన ఘటన హనుమకొండలోని సుబేదారిలో జరిగింది. సుబేదారీ ఎన్ఐటి జిమ్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. రాము, విష్ణు, సందీప్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బ్రదర్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరానికి చెందిన మేటీ రాములు- రాజేశ్వరి దంపతుల కుమారులు శ్రవణ్ (29), శివ (27) హైదరాబాద్లోని శుభకార్యానికి వెళ్లారు. వారు బైకుపై ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తున్న క్రమంలో యూటర్న్ తీసుకుంటుండగా.. ఇంతలో వేగంగా వచ్చిన బొలేరో వారి బైకును ఢీ కొంది. ఆ దీంతో బ్రదర్స్ అక్కడికక్కడే చనిపోయారు.
WGL లోక్సభ నియోజకవర్గపరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. 1 చోట బీఆర్ఎస్ విజయం సాధించింది. ఓవరాల్గా కాంగ్రెస్ 1,58,715 ఓట్ల మెజార్టీ సాధించగా.. బీఆర్ఎస్ 7,779 సాధించింది. కొన్నిచోట్ల మినహా చాలా చోట్ల బీజేపీ 3 స్థానానికి పరిమితమైంది. ప్రస్తుత ఓటింగ్ కలిసోస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే.. బీఆర్ఎస్, బీజేపీ మాత్రం రాజకీయ సమీకరణాలు మారాయని అంటున్నాయి.
– దీనిపై మీ కామెంట్
తనపై ఎన్ని కేసులు పెట్టినా గత పది సంవత్సరాలుగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మల్లన్న పాల్గొన్నారు. తనని ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని మల్లన్న హామీ ఇచ్చారు.
ప్రముఖ బుల్లితెర నటి నవీన (సుమంగళి) ఈరోజు వరంగల్ నగరంలో సందడి చేశారు. వరంగల్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన వేయిస్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి గుడిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయాల్లో దేవుళ్లను దర్శించుకుని, పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఊహలు గుస గుస లాడే, గువ్వ గోరింక, చెల్లెలి కాపురం వంటి సీరియల్స్లో నటిస్తున్నట్లు ఆమె తెలిపారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…
Sorry, no posts matched your criteria.