India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లో యువ ఓటర్లు కీలకం కానున్నారు. మహబూబాబాద్, వరంగల్ లోక్సభ పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,22,871 మంది 18-39 ఏళ్ల వారే. మొత్తం ఓటర్లలో వీరి శాతం 48.34. కాగా మహబూబాబాద్ పరిధిలో 50.33%, వరంగల్లో 46.67% మంది ఆ వయస్సు ఉన్న ఓటర్లు ఉన్నారు. దీంతో యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎంపీ అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఆ పార్టీ ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు నల్గొండలోని లక్ష్మీ గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించనున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
వరంగల్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, వరంగల్ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలో రాత్రి కడియం కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదని, పనులు చేసి చూపించే పార్టీ అని కడియం కావ్య అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో నిర్వహించిన మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బీజేపీ ప్రమాదకర ధోరణిని అవలంబిస్తుందని, బీజేపీ దుర్మార్గాలను, ఆకృత్యాలను అడ్డుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కడియం అన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నల్గొండ కలెక్టరేట్లో ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేయనున్నారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయన పార్టీ బీ ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక కచ్చితంగా గెలవబోతున్నామని, నీ వెంట పార్టీ యంత్రాంగం, నాయకత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. విద్యావంతులు, నిజాయితీ పరులు, యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందన్నారు.
మహబూబాబాద్ మండలం ఇస్లావత్ తండాలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ప్రచారం నిర్వహించారు. ఇందులో మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కవిత కూతురు మహతి ప్రచారంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి, తన తల్లికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కవిత కూతురు మహతి మట్టి తట్ట నెత్తిన పెట్టుకొని కాసేపు ముచ్చటించారు.
HNK జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురానికి చెందిన కుమారస్వామి, అతని కూతురు శ్రీవిద్య పురుగు మందు తాగి <<13193945>>ఆత్మహత్యాయత్నానికి<<>> పాల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. కూతురు చదువు విషయమై ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశంలో పురుగు మందు సేవించిన తండ్రి మృతి చెందాడు. కూతురి పరిస్థితి విషమం కావడంతో పరకాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
నేను పక్కా లోకల్ అభ్యర్థినని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూడలేకనే, నేను నాన్ లోకల్ అంటూ కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని సుధీర్ కుమార్ మండిపడ్డారు.
హన్మకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురంలో విషాదం చోటుచేసుకుంది. పురుగు మందు తాగి తండ్రి, కూతురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో తండ్రి కుమారస్వామి(43) మృతి చెందగా.. కూతురు శ్రీవిద్య(16) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శ్రీవిద్యను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పార్టీ మార్పుపై వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ స్పందించారు. తాటికొండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కడియం కావ్యకు టికెట్ ఇచ్చినందుకే తాను బీఆర్ఎస్ నుంచి పార్టీ మారినట్లు తెలిపారు. కడియం శ్రీహరి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదని, వరంగల్ జిల్లాలో దళితులకు అన్యాయం చేసిన మొదటి వ్యక్తి కడియం శ్రీహరి మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.