Warangal

News June 28, 2024

వరంగల్‌: పడిపోతున్న పల్లి ధర!

image

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వేరుశనగ పంట సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గుముఖం పడుతోంది. గతేడాది సుమారు 5 వేల ఎకరాల వరకు సాగు చేసిన రైతులు ఈ ఏడాది 4,200 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. దానికి తోడు ఆకుమచ్చ, ఆకు పీల్చే పురుగులు తదితర కారణాలతో వేరుశనగ పంట దిగుబడి తగ్గిపోతోంది. గతేడాది క్వింటా రూ.8 వేల వరకు పలికిన పల్లి ఈ ఏడాది రూ.5 వేల వరకు పడిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

News June 28, 2024

పాకాల వెళ్లే పర్యాటకులకు శుభవార్త!

image

పాకాల వెళ్లే పర్యాటకులకు రెట్టింపు ఆనందం కలగనుంది. కొన్ని రోజులుగా నిలిచిన బోటు షికారు మళ్లీ ప్రారంభం కానుంది. గతంలో పాకాల సరస్సు WGL జిల్లా ఖానాపురం మండలంలో ఉండగా.. జిల్లాల పునర్విభజనతో కొంత భాగం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలో చేరింది. దీంతో అటవీ, పర్యాటక శాఖల మధ్య టికెట్ల పంపిణీలో తలెత్తిన కారణాలతో బోటు షికారు నిలిచింది. కాగా స్థానిక MLA చొరవతో బోటింగ్ మళ్లీ ప్రారంభించనున్నట్లు సమాచారం.

News June 27, 2024

పవర్ కట్టింగ్ కాదు.. టెస్టింగ్ మాత్రమే: టీజీఎన్పీడీసీ

image

హన్మకొండ కలెక్టరేట్‌లో ఈరోజు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతుండగా <<13521309>>పవర్ కట్<<>> విషయమై ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వివరాలు తెలిపింది. హన్మకొండ కలెక్టరేట్‌కు 11కేవీ ఫీడర్‌పై విద్యుత్ సరఫరా బంద్ లేదని ఎక్స్‌లో సంబంధిత అధికారులు తెలిపారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా కలెక్టరేట్‌లో సిబ్బంది ముందస్తు టెస్టింగ్‌లు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం అవాస్తవమన్నారు.

News June 27, 2024

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి: మంత్రి

image

వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్‌ను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా వ్యవహరించాలని అధికారులకు మంత్రులు సూచించారు.

News June 27, 2024

వరంగల్: రూ.500 పడిపోయిన పసుపు ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి నేడు పసుపు, పల్లికాయ తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపు రూ.14,159 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ రూ.6010, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చింది. మరోవైపు మక్కలు రూ.2,550 పలకగా.. 5531 రకం మిర్చికి రూ.14,800 ధర పలికింది. మార్కెట్‌లో  పసుపు ధర ఒక రోజు వ్యవధిలోనే రూ.500 తగ్గగా.. పల్లికాయ ధరలు స్వల్పంగా పెరిగాయి.

News June 27, 2024

11 ఏరియాల్లో నూతన డీసీసీబీ బ్యాంకులు ఏర్పాటు: ఛైర్మన్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగేళ్ల కాలంలో కొత్తగా 12 డీసీసీబీ బ్యాంకులను ఏర్పాటు చేశామని డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు తెలిపారు. కురవి, మొగుళ్లపల్లి, దేవరుప్పుల, రఘునాథపల్లి, సంగెం, హసన్‌పర్తి, మంగపేట, గీసుగొండ, నర్సింహులపేట, బచ్చన్నపేట, నెల్లికుదురు తదితర 11 ఏరియాల్లో నూతన బ్యాంకుల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.

News June 27, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలికింది. అలాగే ఏసీ 341 రకం మిర్చి రూ.17,000, వండర్ హాట్ (WH) మిర్చి రూ.17,500 ధర పలికాయి. కాగా నిన్నటితో పోలిస్తే తేజ మిర్చి రూ.500 పెరగగా.. అన్ని రకాల మిర్చి ధరల్లో నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News June 27, 2024

వరంగల్: రూ.120 పెరిగిన పత్తి ధర

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర రైతన్నలకు ఊరటనిచ్చింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. నిన్న రూ.7,090 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.7,210కి చేరింది. ఒక రోజు వ్యవధిలోనే రూ.120 ధర పెరగడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత ధర పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.

News June 27, 2024

రేపు వరంగల్‌కు సీఎం.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి అక్కడి ఏర్పాట్లను సంబంధిత అధికారులతో పరిశీలించారు. పార్కులో చేపట్టిన పనులు, ఫొటో ఎగ్జిబిట్లను సీఎం తిలకిస్తారని చెప్పారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీందర్ తదితరులు ఉన్నారు.

News June 27, 2024

రేపు మేడారం హుండీల లెక్కింపు

image

మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల హుండీల లెక్కింపును రేపు గురువారం ప్రారంభించనునట్లు మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు. పూజారులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారుల భారీ బందోబస్తు నడుమ మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.