India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటా రూ.17,100 పలకగా, 341 రకం మిర్చి రూ.16 వేల ధర పలికింది. అలాగే వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.14 వేలు, 5531 రకం మిర్చికి రూ.12 వేల ధర వచ్చింది. మరోవైపు టమాటా మిర్చి గత వారంతో పోలిస్తే భారీగా పెరిగింది. గతం శుక్రవారం రూ. 31 వేల ధర పలికిన టమాటా మిర్చి.. ఈరోజు రూ.35,500 పలికింది.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి భారీగా తరలివచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పత్తి ధర పడిపోయింది. శుక్రవారం రూ.6,840 పలికిన క్వింటా పత్తి .. ఈరోజు రూ.6,725కి పడిపోయింది. ధరలు దారుణంగా పడిపోతుండడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా ముగిసినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంజుల దేవి ప్రకటనలో తెలిపారు. మొత్తం 5,205 మంది విద్యార్థులకు గాను 5,087 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలం బొల్లారం గ్రామంలో పిడుగు పాటుకు విద్యుత్ స్తంభం కూలి పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఇంటికి మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న భార్యాభర్తలు కంతి చిలకమ్మ, లింగయ్యకు స్వల్ప గాయలయ్యాయి. గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజుల్లో ఉండటంతో వరంగల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలు పర్యటించారు. మరోసారి కాంగ్రెస్ WGL అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7న రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. WGL, MHBD అభ్యర్థులకు మద్దతుగా ఈ నెల 8న ప్రధాని మోదీ మామునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్నగర్లో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొర్రి బిక్షపతి (40) తన వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి పనులు చేసుకున్నాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లి చెట్టుకింద సేదతీరాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో II, IV, VI సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 1,70,991 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 122 పరీక్ష కేంద్రాలను, 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందు వలన పోలింగ్ సమయం పొద్దున్న 7నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుందన్నారు.. ప్రజలు పెంచిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
* > ముగిసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తల్లి లచ్చిభాయ్ అంతక్రియలు
* > ములుగు, MHBD, జనగామ జిల్లాల్లో కురిసిన వర్షాలు
* > ఎటునాగారం, రఘునాథపల్లిలో పిడుగు పడి ఇద్దరు మృతి
>* WGL: ముగిసిన నిట్ పరీక్ష.. పలుచోట్ల ఇబ్బందులు
* > మరిపెడలో కాంగ్రెస్ సమావేశం..పాల్గొన్న మంత్రి తుమ్మల
* > MHBD, వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన BSP రాష్ట్ర అధ్యక్షుడు
>* జిల్లాలో విస్తృతంగా కొనసాగిన ఎన్నికల ప్రచారం
జనగాం పట్టణంలోని రైల్వేస్టేషన్ ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం దొరికింది. 70 నుంచి 80 ఉండొచ్చు. మృతుడిపై ఆకుపచ్చ రంగు లుంగీ, నిండు చేతుల తెలుపు రంగుచొక్కా వుంది. తెల్లని గడ్డం కలిగి ఉన్నాడు. డెడ్ బాడీని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.