Warangal

News May 15, 2024

మరో కీలక ఎన్నికకు వరంగల్ సిద్ధం

image

లోక్‌సభ పోరు ముగియగా మరో సమరానికి వరంగల్ సిద్ధమైంది. NLG-KMM-WGL MLC స్థానానికి ఈ నెల 27న బైపోల్ జరగనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న (INC), BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండింపెండెంట్‌గా అశోక్ పోటీ చేస్తున్నారు.

News May 15, 2024

WGL, MHBDలో 23,57,331 మంది ఓటేశారు!

image

2019 ఎన్నికలతో పోలిస్తే వరంగల్‌ లోక్‌సభ స్థానంలో 2024లో ఓటింగ్‌ శాతం పెరిగింది. అప్పుడు 63.65% నమోదు కాగా.. ఇప్పుడు 68.86% పోలింగ్ అయింది. మహబూబాబాద్‌లోనూ 2019లో కంటే ఈసారి 2.81% మంది అధికంగా పోలింగ్‌లో పాల్గొనడంతో 71.85% నమోదైంది. ఈ రెండు స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉండగా.. 70.22 శాతంతో 23,57,331 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరి మీరు ఓటేశారా? కామెంట్.

News May 15, 2024

REWIND-2019: వరంగల్‌లో BRSకి 3,50,298 ఓట్ల మెజార్టీ!

image

వరంగల్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. దొమ్మాటి సాంబయ్య(కాంగ్రెస్)పై పసునూరి దయాకర్(BRS) 3,50,298 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. చింతా సాంబమూర్తి(BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో కావ్య(కాంగ్రెస్), ఆరూరి రమేశ్(BJP), సుధీర్ కుమార్(BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 14, 2024

FINAL: MHBD ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 71.85%

image

మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. భద్రాచలం-69.02%, డోర్నకల్-75.39%, మహబూబాబాద్-71.24%, ములుగు-69.66%, నర్సంపేట-76.60%, పినపాక-69.40%, ఇల్లందు-70.48%గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 71.85% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత బరిలో ఉన్నారు.

News May 14, 2024

FINAL: వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 68.86%

image

వరంగల్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. భూపాలపల్లి- 67.71%, స్టే.ఘ-78.77%, పాలకుర్తి- 71.43%, పరకాల-76.86%, వర్ధన్నపేట-72.24%, వరంగల్ ఈస్ట్ -65.08%, వరంగల్ వెస్ట్- 52.68%గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 68.86% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, BJP నుంచి ఆరూరి రమేశ్, BRS నుంచి సుధీర్ కుమార్ బరిలో ఉన్నారు.

News May 14, 2024

భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో దత్తాత్రేయ ఆలయ మూడో వార్షికోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ప్రజలు సంతోషంగా ఉండాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.

News May 14, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలజడులు ఇక్కడే

image

*జనగామ జిల్లా ధర్మకంచ(263)లో పోలింగ్‌ను పరిశీలించేందుకు యువజన కాంగ్రెస్‌ నేత కొమ్మూరి ప్రశాంతరెడ్డి వచ్చారు. దీంతో BRS నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
*సంగెం మం. ఎల్గూరుస్టేషన్‌లోని 211 పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి ఓ యువకుడు ఫొటోతీసి వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు.
*జనగామ మం.లోని గానుగుపహాడ్‌ ZPHSలో BRS, BJP నాయకులు టెంట్లు ఏర్పాటు చేశారు. వాటిని తీసేయాలని పోలీసులు సూచించగా వాగ్వాదం చోటుచేసుకుంది.

News May 14, 2024

WGL: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

image

ఓరుగల్లు ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వరంగల్ లోక్‌సభలో 42 మంది, మహబూబాబాద్‌లో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత వరంగల్ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో‌ ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో‌ టెన్షన్‌ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

WGL: మన అభ్యర్థులు ఓటేసింది ఇక్కడే

image

MHBDలో 70.68, WGLలో 68.29శాతం పోలింగ్ నమోదయింది. ఇక అభ్యర్థుల విషయానికొస్తే.. MHBD కంకరబోడు పాఠశాలలో BRS అభ్యర్థి కవిత, మానుకోట పీఏసీఎస్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్, వెంకటాపూర్ మం. మల్లయ్యపల్లిలో BJP అభ్యర్థి సీతారాం నాయక్‌లు ఓటేశారు. HNK టీచర్స్ కాలనీలో WGL కాంగ్రెస్ అభ్యర్థి కావ్య, KZPT ఫాతిమానగర్‌లో ఆరూరి రమేశ్, ములక్కనూర్ బాలుర ఉన్నత పాఠశాలలో BRS అభ్యర్థి సుధీర్ కుమార్ ఓటేశారు.

News May 14, 2024

వరంగల్‌లో EVMలు ఎక్కడెక్కడ మొరాయించాయంటే.?

image

*HNK జిల్లా రహమత్‌నగర్‌లో 164 పోలింగ్ కేంద్రంలోని EVM బటన్‌ను ఓటరు గట్టిగా నొక్కడంతో అది పనిచేయకుండా ఆగిపోయింది.
*పలిమెల మండలం కామన్‌పల్లిలో EVMలు పనిచేయక మంగళవారం రెండు గంటల తర్వాత పోలింగ్ మొదలైంది.
*రేగొండ మం. రూపిరెడ్డిపల్లిలో EVM మొరాయించడంతో ఉ.7-8 వరకు పోలింగ్ నిలిచిపోయింది.
*వెంకటాపురం మం, సూరవీడులో 56వ పోలింగ్ కేంద్రంలో EVM మొరాయించడంతో 40ని. ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
SHARE IT