Warangal

News August 28, 2024

వరంగల్ రాజముద్ర వివాదంపై ఎక్స్‌లో స్పందించిన KTR

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదంపై కేటీఆర్ ‘X’లో స్పందించారు. ‘ఇది అధికారిక నిర్ణయమా? లేక అనాధికారిక నిర్ణయమా?.. అసలు ఏం జరుగుతుందో మీకైనా తెలుసా?’ అంటూ తెలంగాణ సీఎస్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. తెలంగాణ రాజముద్రను ఆమోదించక ముందే ఇలా ఫ్లెక్సీలో ముద్రించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News August 28, 2024

ములుగు: గవర్నర్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటారు: సీతక్క

image

ములుగు జిల్లాలోని ఏదైనా ఓ గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసుకుంటానని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ తెలిపారని సీతక్క అన్నారు. గవర్నర్ పర్యటన ప్రశాంతంగా ముగిసిందన్నారు. సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్‌గా నియామకమైన అనంతరం మొదటిసారి ములుగు జిల్లాకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ పర్యటనలో సహకరించిన ప్రతి ఒక్కరికి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

News August 28, 2024

ధర్మసాగర్: డెంగ్యూతో బాలిక మృతి

image

ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ప్రవళికకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. హన్మకొండలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు డెంగ్యూ అని నిర్ధారించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. బాలిక తమ్ముడు కూడా జ్వరంతో బాధపడుతున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. జ్వరంతో బాలిక మృతి చెందగా గ్రామంలో ప్రజలు భయపడుతున్నారు.

News August 28, 2024

తొర్రూరు: విష జ్వరంతో వ్యక్తి మృతి

image

విష జ్వరంతో వ్యక్తి మృతి చెందిన ఘటన తొర్రూరు మండలం కెవుల తండాలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ లచ్చిరాం (52) గత వారం రోజులుగా విష జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. వైద్యం కోసం వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News August 28, 2024

సీరోలు: దారుణం.. గొడ్డలితో తండ్రిపై కొడుకు దాడి

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చింతపల్లి గ్రామ శివారు కొత్త తండాలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకున్నది. భూ తగాదా విషయంలో తండ్రిపై కొడుకు స్వామి గొడ్డలితో దాడి చేయడంతో తండ్రి బానోత్ బీమా నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బీమా నాయక్ ను మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 28, 2024

హైదరాబాద్ తరహా.. వరంగల్‌లో వాడ్రా.?

image

HYDలో చెరువుల రక్షణ కోసం అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా తరహాలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వాడ్రా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోరం బెటర్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో ‘హైడ్రా లాగే మనకు కావాలి వాడ్రా..’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ వెంకట నారాయణతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

News August 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> NSPT: విష జ్వరంతో యువకుడు మృతి
> MLG: గోదావరిలో అక్రమంగా దాచిన కలప స్వాధీనం
> MHBD: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
> MLG: గవర్నర్ పర్యటనలో అపశ్రుతి.. పాము కాటుతో కానిస్టేబుల్ అస్వస్థత
> WGL: ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
> JN: ఆంధ్రప్రదేశ్‌లో జనగామ వాసి అరెస్టు
> MHBD: బైకును ఢీ-కొట్టిన బస్సు
> BHPL: అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు

News August 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> WGL: WAY2NEWS ఎఫెక్ట్.. ఫ్లెక్సీ మార్పు
> MLG: రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సును సందర్శించిన గవర్నర్
> BHPL: ఈనెల 29న జాబ్ మేళా
> WGL: క్వింటా పత్తి ధర రూ.7,600
> BHPL: మేడిగడ్డ బ్యారేజీకి పెరిగిన వరద
> MLG: వాగు దాటాలంటే.. ట్రాక్టర్ టైరు ఆధారం!
> WGL: అండర్ బ్రిడ్జి వద్ద అగ్ని ప్రమాదం
> HNK: విష జ్వరాల నియంత్రణకు చర్యలు

News August 27, 2024

కేసముద్రం: కోడలే కొడుకై.. మామకు తలకొరివి పెట్టింది!

image

ఆఖరి మజిలీలో ఆ వృద్ధుడికి కొడుకు లేని లోటును కోడలు తీర్చింది. మామకు ఇచ్చిన మాట ప్రకారం తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య(90) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. గతంలో వెంకటయ్య ఇద్దరు కుమారులు అనారోగ్యంతో చనిపోవడంతో పెద్ద కోడలు యాకమ్మ మామ వెంకటయ్యకు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది.

News August 27, 2024

WGL: విషజ్వరాల నియంత్రణకు చర్యలు

image

ఉమ్మడి WGL జిల్లాలో రోజురోజుకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో వివిధ శాఖల అధికారులను సమన్వయపరుస్తూ డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మురళీధరన్ తెలిపిన ప్రకారం.. 330కి పైగా డెంగీలు నమోదైనట్లు, వైద్య శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటా సర్వే చేపట్టి జ్వర లక్షణాలు ఉన్నవారికి మందులను ఇస్తున్నారు.