India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TGPSC విడుదల చేసిన గ్రూప్-1 రిజల్ట్లో నయీంనగర్కి చెందిన పులి సాయితేజ 507 మార్కులతో సత్తా చాటారు. సాయితేజ్ తండ్రి కిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి తండ్రుల ఆశయాలకు అనుగుణంగా సాయితేజ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచారు.
కరీంనగర్లోనే లోయర్ మానేరు డాం వద్ద 33/11 కెవి సబ్ స్టేషన్ వార్షిక నిర్వహణ పనులు కొనసాగుతున్నందున నేడు ఉదయం 8గంటల నుంచి 6గంటల వరకు నీటి సరఫరా జరగదని మున్సిపల్ అధికారులు తెలిపారు. వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతం, మడికొండ, కడిపికొండ బట్టుపల్లి రాంపూర్ ఎల్లాపూర్ నేటి సరఫరా జరగదని పేర్కొన్నారు. ఇట్టి ప్రాంతవాసులు గమనించి సహకరించాలని ఎస్సీ ప్రవీణ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..1/2 సాగునీటి తీరును క్షేత్రస్థాయిలో అధికారులు కలిసి పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు సాగునీరు అందించేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తరలింపు ప్రక్రియ వేగవంతంగా జరగాలని హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద అన్నారు. పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, బల్దియా కమిషనర్ పరిశీలించారు. పూడిక తీత మట్టి తరలింపు రూట్ మ్యాప్, వాహనాల రాకపోకలకు సంబంధించి వేస్తున్న ఫార్మేషన్ రోడ్డు పనులు మట్టి తరలించేందుకు ఇచ్చే వాహనాల రూట్లను పరిశీలించారు.
రాయపర్తి మండల పరిధిలో, ఉకల్, ఘటికల్, జగన్నాథపల్లి, గ్రామాల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీబీఎం 54, 57, కాల్వ వరి పంట పొలాలను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. ఈ సందర్భంగా వరికి నీరును సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ సత్య శారద అదేశించారు. వరి సాగు చేసే రైతులకు నూతన పద్ధతులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
మంత్రి కొండా సురేఖ తన CMRF చెక్కును అందజేశారు. చేర్యాల మండలం నాగపురి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ప్రశాంత్ కుమారుడు నయన్ కుమార్ మాటలు రాక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏ హాస్పటల్కి పోయినా రూ. 8 నుంచి 10లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచనతో తక్షణమే వారి పరిస్థితి తెలుసుకొని కింగ్ కోటిలోని ప్రభుత్వ ENT ఆసుపత్రికి రూ. 8లక్షలను CMRF చెక్కును మంత్రి అందజేశారు.
ములుగు జిల్లా సమక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్ను భారత ప్రభుత్వం/ కేంద్ర విద్యా శాఖ నియమించింది. హైదరాబాదులోని ఆరోరా హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీకి చెందిన ప్రొఫెసర్ యెడవల్లి లక్ష్మీ శ్రీనివాస్ను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. నిన్న పత్తి ధర క్వింటాకి రూ.6,960 పలకగా.. నేడు రూ.10 తగ్గి.. రూ.6,950కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్థులు తెలుపుతున్నారు.
వరంగల్ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్లు, బోరుబావులు ఎండిపోయాయి.
హైదరాబాద్ సచివాలయం నుంచి సాగునీటి నిర్వహణ సరఫరాపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు వరంగల్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నీటిపారుదల వ్యవసాయ విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.