India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమకొండలో యాదవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులకు చిన్నతనం నుంచే నేర్పించాలన్నారు. అన్ని విషయాల్లో మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో విజయం సాధించవచ్చన్నారు.
ములుగు జిల్లా మరింత అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి సీతక్క అన్నారు. మొదటిసారి ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన సందర్భంగా జిల్లాకు కావాల్సిన అభివృద్ధి పనుల్లో వారి సహాయ సహకారాలు ఉండాలని ఆశిస్తున్నామని, జిల్లాకు మొదటిసారి వస్తున్న గవర్నర్కు ఘనంగా స్వాగతం పలకాలని సీతక్క పిలుపునిచ్చారు.
> WGL: గుండెపోటుతో మాజీ కార్పొరేటర్ మృతి
> MHBD: కారు-బైక్ ఢీ.. నలుగురికి గాయాలు
> WGL: గంజాయి స్మగ్లర్పై పీడీ యాక్ట్
> JN: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి మృతి
> WGL: బ్లేడుతో గొంతు కోసుకున్న వృద్ధుడు
> WGL: ట్రాఫిక్ రూల్స్పై అవగాహన నిర్వహించిన ఏసీపీ
> MHBD: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్సై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టిఎస్.దివాకర సోమవారం సాయంత్రం రామప్పను సందర్శించారు. మంత్రి ముందస్తు ఏర్పాట్ల పనులను పరిశీలించారు.
ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను వరంగల్ ఎంపీ కడియం కావ్య అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కరాటేతో ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం పెరిగి చదువులో సైతం రాణించే అవకాశం ఉందని, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని అమ్మాయిలు తప్పకుండ కరాటే నేర్చుకోవాలన్నారు.
WGL 25వ డివిజన్లో MLC బస్వరాజు సారయ్య పర్యటించారు. పర్యటనలో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్సీ ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని, కాంగ్రెస్కు కార్యకర్తలే పట్టుకొమ్మలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు.
MLG: హైడ్రా వెనక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్ అన్నారు. ములుగులో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా తరహాలో ములుగులో భూ-కబ్జాలపై ఉక్కు పాదం మోపాలని, ప్రభుత్వ భూములను సంరక్షించి భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కొమురవెల్లి మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదంలో <<13938111>>ఒకరు <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. చెర్యాల మండలంలోని గురువన్నపేట గ్రామానికి చెందిన అందే వీరేశం(36) శుభకార్యానికి వెళ్లొస్తానని బయటికి వెళ్లాడు. శనిగరం గ్రామానికి రాజీవ్ రహదారి గుండా బైక్పై వెళ్తుండగా ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వీరేశం వేగంగా వచ్చి కారు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించాడు.
కాళేశ్వరం వద్ద మళ్లీ ఉభయ నదుల ప్రవాహం పెరిగింది. ఎగువన మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలిసి వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. 7.8 మీటర్ల మేర నీటిమట్టం నమోదైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలవల్ల నదికి వరద ఉధృతి పెరిగిందని అధికారులు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సమాచారం చరవాణిలో చూసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ఏర్పాటు చేసింది. ఇందుకు www.telangana.gov.in వెబ్ సైట్ లో సిటిజన్ లాగిన్లో చరవాణి నంబరును నమోదు చేస్తే వచ్చే ఓటీపీని ఫోన్లో నమోదు చేస్తే ఎల్ఆర్ఎస్ దరఖాస్తు సమాచారం, వివరాలు తెలుసుకోవచ్చు. సిటిజన్ లాగిన్ లో చరవాణి ద్వారా వివిధ దస్త్రాలను జత చేసే అవకాశం కల్పించారు.
Sorry, no posts matched your criteria.